మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలో జరిగే సంతకు ప్రతి వారం వేలాది మంది రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు తరలివస్తున్నారు. అయితే, ఈ సంతకు తగిన పార్కింగ్ స్థలం లేకపోవడంతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను ప్రధాన రహదారులపైనే నిలిపివేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. సంతకు వచ్చే ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ ఇబ్బందులతో పాటు సంతలో తాగునీరు, మరుగుదొడ్లు, చెత్త సేకరణ వంటి కనీస మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి వారం ఇదే పరిస్థితి పునరావృతమవుతున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సంతలో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని రైతులు, గ్రామస్థులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలో జరిగే సంతకు ప్రతి వారం వేలాది మంది రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు తరలివస్తున్నారు. అయితే, ఈ సంతకు తగిన పార్కింగ్ స్థలం లేకపోవడంతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను ప్రధాన రహదారులపైనే నిలిపివేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. సంతకు వచ్చే ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ ఇబ్బందులతో పాటు సంతలో తాగునీరు, మరుగుదొడ్లు, చెత్త సేకరణ వంటి కనీస మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి వారం ఇదే పరిస్థితి పునరావృతమవుతున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సంతలో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని రైతులు, గ్రామస్థులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
- మెదక్ జిల్లా రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్లో శనివారం ప్రయాణికుల సహనం పరీక్షకు గురైంది. సమయానికి బస్సులు రాకపోవడంతో గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో ఆగ్రహించిన ప్రయాణికులు మొదట బస్టాండ్ ప్రాంగణంలోనే ధర్నాకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచూ బస్సులు ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బస్సులను సమయపాలనతో నడిపించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.1
- మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఆదివారం నాడు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు హారతులను నిర్వహించారు. ఇందులో భాగంగా ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతిని సమర్పించారు.1
- తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలో బయోటెక్ పరిశ్రమ కోసం టాప్సే (Topse) సంస్థ తన అధునాతన టర్న్కీ ప్రాసెస్ సొల్యూషన్స్ను ప్రదర్శించింది.1
- సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని మాసాన్పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం పోసి, మంగళహారతులతో బోనాలు సమర్పించారు. మాసాన్పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కల్యాణం అనంతరం భక్తులందరికీ కమిటీ సభ్యులు భారీగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, పెద్దమ్మ తల్లి దయతో గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి ధన, వస్తు రూపేణా సహకరించిన దాతలకు, రాత్రింబవళ్లు కష్టపడిన గ్రామ యువకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ కులస్థులు, మహిళలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.1
- Post by Assalamualikumjj3
- చిలిపిచేడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలోని ఎరువుల దుకాణాన్ని ఎమ్మార్వో శివప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా బస్తాల పంపిణీ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించాలని, పంపిణీలో పారదర్శకత పాటిస్తూ ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని డీలర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల కోసం వచ్చిన రైతులతో మాట్లాడిన ఎమ్మార్వో, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ఫారాలు నింపి ఓటరు వివరాలను సరిచేసుకోవాలని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.1
- మెదక్ జిల్లా చేగుంటలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఒక తల్లి కన్నుమూయగా, ఆ విషయం తెలియని ఆమె ఇద్దరు చిన్న పిల్లలు (ఒక బాబు, ఒక పాప) రోజంతా ఆమె మృతదేహం పక్కనే కూర్చుండిపోయారు. ఎవరైనా వచ్చి తమకు సహాయం చేస్తారేమోనని ఆ చిన్నారులు ఆశగా ఎదురుచూశారు. ఈ కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వీరి తండ్రి ఇదివరకే మరణించడంతో, ఇప్పుడు తల్లి కూడా దూరమై ఆ చిన్నారులు పూర్తిగా అనాథలయ్యారు. ఆసుపత్రిలో తక్షణమే ఆదుకునేందుకు బంధువులు ఎవరూ లేకపోవడంతో, ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ చిన్నారులు మృతదేహం వద్దే దిక్కుతోచని స్థితిలో నిరీక్షించాల్సి వచ్చింది.1