ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవరావు ఆదేశాలు, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత సూచనల మేరకు, జూన్ 19న ములుగు జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్లో వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో జిల్లా హాస్పిటల్ నుండి డాక్టర్ వీరమల్లు హరీష్, నర్సింగ్ ఆఫీసర్ జి. తిరుపతితో కూడిన వైద్య బృందం వయోవృద్ధులకు దంత పరీక్షలు నిర్వహించారు. అలాగే, బీపీ, షుగర్ పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ములుగు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సి ఎస్ ఆర్ఎంవో డాక్టర్ ఏ. అప్పయ్య, వయోవృద్ధులు ప్రతిరోజూ ఉదయం, రాత్రి బ్రష్ చేయాలని, చక్కెర పదార్థాలు, గుట్కా, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. క్రమం తప్పకుండా బీపీ, షుగర్ చెక్ చేసుకోవాలని, చిన్నపాటి సమస్య ఉన్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలని ఆయన హితవు పలికారు. డే కేర్ సెంటర్ సభ్యులందరూ పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని డాక్టర్ అప్పయ్య ఆకాంక్షించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 30 మంది వయోవృద్ధులు దంత పరీక్షలు చేయించుకున్నారు. జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సహాయకులు నాగేంద్ర, ప్రాణమ్ డే కేర్ సెంటర్ సూపరిండెంట్ చుంచు రమేష్, డే కేర్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవరావు ఆదేశాలు, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత సూచనల మేరకు, జూన్ 19న ములుగు జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్లో వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో జిల్లా హాస్పిటల్ నుండి డాక్టర్ వీరమల్లు
హరీష్, నర్సింగ్ ఆఫీసర్ జి. తిరుపతితో కూడిన వైద్య బృందం వయోవృద్ధులకు దంత పరీక్షలు నిర్వహించారు. అలాగే, బీపీ, షుగర్ పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ములుగు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సి ఎస్ ఆర్ఎంవో డాక్టర్ ఏ. అప్పయ్య, వయోవృద్ధులు
ప్రతిరోజూ ఉదయం, రాత్రి బ్రష్ చేయాలని, చక్కెర పదార్థాలు, గుట్కా, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. క్రమం తప్పకుండా బీపీ, షుగర్ చెక్ చేసుకోవాలని, చిన్నపాటి సమస్య ఉన్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలని ఆయన హితవు పలికారు. డే కేర్ సెంటర్ సభ్యులందరూ పౌష్టికాహారం తీసుకుంటూ
ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని డాక్టర్ అప్పయ్య ఆకాంక్షించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 30 మంది వయోవృద్ధులు దంత పరీక్షలు చేయించుకున్నారు. జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సహాయకులు నాగేంద్ర, ప్రాణమ్ డే కేర్ సెంటర్ సూపరిండెంట్ చుంచు రమేష్, డే కేర్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామం ఎస్సీ కాలనీలోని రచ్చబండ వద్ద అంతర్జాతీయ హరిత మిత్ర అవార్డు గ్రహీత, వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్మ్ జన్మదినం సందర్భంగా ఒక మర్రి మొక్కను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మర్రి మొక్కను నాటడం కేవలం ఒక సంబరం మాత్రమే కాదని, దానిని పోషించి పెంచే బాధ్యత తనదేనని ఉద్ఘాటించారు. గ్రామ ప్రజలకు, పక్షులకు, జంతువులకు మంచి వాతావరణాన్ని అందించడానికి, అలాగే ముందు తరాలకు ఉపయోగపడే మహావృక్షంగా ఇది ఎదగాలని భగవంతుని వేడుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్ మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.1
- మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ జిల్లాలోని బయ్యారం మండల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆమె మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలతో స్వయంగా మాట్లాడారు, వారి సమస్యలను తెలుసుకున్నారు, అంతేకాకుండా ఉపాధ్యాయురాలిగా మారి స్వయంగా పాఠాలు కూడా బోధించారు. జిల్లాలో మొత్తం 1032 విద్యాసంస్థలు ఉన్నాయని, వాటిలో చదువుతున్న 1 లక్ష 90 వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన డైట్ మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ పక్కాగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో డిజిటల్ తరగతుల ద్వారా విద్య బోధనలు అందించాలని, ప్రతి ఉపాధ్యాయుడు అందుకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికతో టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. పిల్లలను వ్యక్తిగతంగా గమనిస్తూ, విద్య అంశాలపై తల్లిదండ్రులతో చర్చించాలని పేర్కొన్నారు. 'బడిబాట' కార్యక్రమంలో ఇప్పటివరకు 6,709 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో అందిస్తున్న సౌకర్యాలపై విస్తృత ప్రచారం కల్పించి, నమోదు శాతం పెంచేందుకు అన్ని విద్యాసంస్థల సిబ్బంది కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరికీ టెస్ట్ బుక్కులు, నోట్ బుక్స్ అందించాలని, తెలుగుతో పాటు అన్ని సబ్జెక్టులలో, ముఖ్యంగా ఇంగ్లీషులో ప్రావీణ్యం పొందడం కోసం ఉపాధ్యాయులు ఇంగ్లీషులోనే విద్యను బోధించాలని, పిల్లలతో అదే భాషలో మాట్లాడాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పిల్లల విద్యాబోధనలు, ఆరోగ్యం, పారిశుధ్యం, పోషకాహారం, ధ్యానం, క్రీడలు, మేధస్సును వెలికి తీసేలా ఉండాలని, విద్య అంశాలపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తున్న సిబ్బందికి, కిందిస్థాయి ఉద్యోగులకు కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వాటి నివేదికలను సమర్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజు విద్యాసంస్థలలో పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహించాలని, స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని, విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. టాయిలెట్స్, డైనింగ్ హాల్, తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించాలని, కోడిగుడ్లు, బాలామృతం వంటి పౌష్టికాహారం కలిగిన నాణ్యమైన పదార్థాలను అందించాలని కలెక్టర్ అన్నారు. అంగన్వాడి కేంద్రం పరిధిలో శ్యామ్ (SAM), మ్యామ్ (MAM) పిల్లలను నిరంతరం గమనిస్తూ, వారికి సమయానికి మందులు అందిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధనలను అందించాలని ఆమె పునరుద్ఘాటించారు.1
- వరంగల్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి సినిమాలు తీసుకోవచ్చని, అయితే ఇక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఆయనకు లేదని ఆమె తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే డిప్యూటీ సీఎం అని కవిత పునరుద్ఘాటించారు. ఏపీ నాయకులు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. సినీ రంగాన్ని, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని కూడా కవిత అన్నారు.1
- కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో మాజీ జెడ్పిటిసి బిల్ల వెంకట్రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారంతా బిల్ల వెంకట్రెడ్డితో కేక్ కట్ చేయించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వెంకట్రెడ్డి ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, గ్రామస్తులు కూడా పాల్గొని సందడి చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసిన సుమారు రూ. 91 లక్షల విలువైన ధాన్యం చోరీ కేసును పోలీసులు చేధించారు. అపెరల్ పార్క్ మేనేజర్తో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 14.16 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా, వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 46.21 లక్షలను స్తంభింపజేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉత్కం విజయ్ (A1), కమ్మరి రాజశేఖర్ (A2), గడ్డం స్వామి (A3), చెపూరి మధుకర్ (A4), వాసాల గణేష్ (A5), గాజుల నవీన్ (A6), చిటుకుల శ్రీకాంత్ (A7) ఉన్నారు. వీరిపై Cr.No.351/2026 U/Sec. 61(2), 318(4), 316(2), 316(5) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేశారు. ఈ మోసంలో సిరిసిల్ల సమీపంలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాం మేనేజర్గా పనిచేస్తున్న కరీంనగర్కు చెందిన ఉత్కం విజయ్ (A1), అతనితో పనిచేస్తున్న వేములవాడ రూరల్ అచ్చనపల్లికి చెందిన వాసాల గణేష్ (A5) కీలక పాత్ర పోషించారు. వీరు ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేశారు. రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్చార్జ్ గడ్డం స్వామి (A3) రెండు లారీలకు నకిలీ ట్రక్ చిట్టీలు జారీ చేయగా, ఉత్కం విజయ్ వాటిని సివిల్ సప్లై వెబ్సైట్లో అప్లోడ్ చేసి నిధులు పొందారు. అలాగే, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2), బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్చార్జ్ గాజుల నవీన్ (A6)తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చిట్టిని రూపొందించి ఉత్కం విజయ్కు అందించారు. విజయ్ దానిని వెబ్సైట్లో అప్లోడ్ చేయగా, రాజశేఖర్ ఆమోదించారు. విడుదలైన నిధులను ఈ ముగ్గురు పంచుకున్నారు. ఇక, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్లైన్లో మాత్రం దించినట్లు నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (A4)కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వేర్వేరు రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన మొత్తాన్ని ఆరుగురు పంచుకున్నారు. ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో సుమారు రూ. 91 లక్షల విలువైన ధాన్యం దోపిడికి గురైనట్లు తేలింది. అరెస్టు చేసిన ఆరుగురు నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, రూ. 14,16,800 నగదు స్వాధీనం చేసుకొని, రూ. 46,21,358 మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో స్తంభింపజేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.3
- జూన్ 21న తమిళనాడు రాష్ట్రంలో విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ మహాసంఘ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ డా. మద్దిశెట్టి సామేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో సుమారు 30 గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు, ఆలయ పూజారులు, ధర్మకర్తలు మరియు హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభకు విచ్చేసిన డా. మద్దిశెట్టి సామేలుకు పూలమాలలు, బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, మహంత్ ముకేశ్ నాథ్ జీ ఆదేశాల మేరకు, చిన్నదురై గారిని తమిళనాడు రాష్ట్ర విశ్వ హిందూ మహాసంఘ్ అధ్యక్షుడిగా ప్రకటించారు. అలాగే, డా. మద్దిశెట్టి సామేలు తమిళనాడులోని 30 గ్రామ పంచాయతీల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సంస్థను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.1
- కరీంనగర్ కిసానగర్ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్పై కిసానగర్లోని రమణయ్య టిఫిన్ సెంటర్ వద్ద కారుతో దాడి జరిగింది. మొన్న రాత్రి 11 గంటలకు రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కారుతో దూసుకువచ్చి గుద్ది చంపే ప్రయత్నం చేశారని కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ వివరించారు. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. అర్ధరాత్రి వేళ ఒక కార్పొరేటర్పైనే ఇలాంటి దాడి జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది; అయితే, ఈ దాడి నుండి కార్పొరేటర్ ప్రాణాలతో బయటపడ్డారు.1
- హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం, మడికొండలోని కరిష్మా గార్డెన్లో జులై 5న భవన నిర్మాణ కార్మిక మహాసభను నిర్వహించనున్నట్లు నాయకులు ప్రకటించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జరిగే ఈ మహాసభకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నట్లు వారు వెల్లడించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున కార్మికులు హాజరుకావాలని నాయకులు పిలుపునిచ్చారు. వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ నియామకం, రుణ సౌకర్యం, పెన్షన్ వంటి తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోతే ఉద్యమాలకు సిద్ధమని వారు తీవ్రంగా హెచ్చరించారు.1