*కోటబొమ్మాళికి విద్యా వైభవం* *రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కృషి ఫలితం* *కోటబొమ్మాళికి డిగ్రీ కళాశాల పునః మంజూరుకు ప్రభుత్వం అనుమతి* *టెక్కలి నియోజకవర్గంలో హర్షాతిరేకాలు* *ఆనందోత్సవాల్లో కూటమి నేతలు* *కేక్ కత్తిరించి సంబరాలు చేసుకున్న కూటమి నాయకులు* *కొత్త ఏడాదిలో విద్యార్థులకు అనూహ్య కానుక* *ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు* *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు* *కోటబొమ్మాళి, జనవరి 8*: కొత్త ఏడాది రాగానే కొత్త కానుక వచ్చింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోటబొమ్మాళి ప్రాంత విద్యార్థులకు ఓ గొప్ప వరం అందించింది కూటమి ప్రభుత్వం. ఆ..రోజు 2014 - 2019 మధ్య కాలంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హయాంలో మంజూరయిన డిగ్రీ కళాశాలను తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రాంత వైకాపా నాయకులు తీరు కారణంగా.. ఆరోజు నిర్దాక్షిణ్యంగా ముందూ వెనుకా చూడకుండా ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు అవసరం లేదని, అప్పటి ఉన్నతాధికారులను తప్పుదోవపట్టిస్తూ, ఏకపక్షంగా మంజూరయినా కళాశాలను రద్దు చేయించారు. తరువాత 2024 ఎన్నికల్లో కూటమి అనూహ్య విజయంతో డిగ్రీ కళాశాల పునరుద్ధరణ చేసేందుకు (మళ్లీ మంజూరుకు) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు చేసిన కృషి ఫలించింది. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చెన్న ఇచ్చిన హామీ నెరవేరింది. దీంతో కూటమి ప్రభుత్వంలో మరోసారి టెక్కలికి మంచి ప్రాధాన్యం లభించింది. ఉన్నత విద్యను నియోజక వర్గ విద్యార్థులు అందుకోనున్నారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడుతూ ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వైనం తెలిసిందే. ఈ పరంపరకు కొనసాగింపు విద్యకు సమున్నత ప్రాధాన్యం ఇస్తూ.. కూటమి లక్ష్యాల నెరవేర్పులో భాగంగా ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మళ్లీ అనుమతులు సాధించి ప్రతిపక్ష వర్గాలలో వణుకు పుట్టించారు. చదువు ప్రాధాన్యం తెలియని కొందరు విపక్ష నాయకుల స్వార్థ ప్రయోజనాలలో భాగంగా ఇక్కడ కళాశాల అవసరం లేదని చెబితే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇందుకు భిన్నంగా స్థానిక ఆకాంక్షలకు పట్టంకడుతూ కోటబొమ్మాళి వాకిట డిగ్రీ కళాశాల ఏర్పాటు కలను సాకారం చేస్తూ, అందుకు తగ్గ అనుమతులు ప్రభుత్వం నుంచి తీసుకు వచ్చారు. విద్యార్థుల, తల్లిదండ్రుల మన్ననలు అందుకున్నారు. *నియోజవవర్గ విద్యార్థుల కలలు నెరవేర్చారు మంత్రి అచ్చెన్నాయుడు* నియోజవవర్గ విద్యార్థుల కలలు నెరవేర్చారు మంత్రి అచ్చెన్న. జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా రద్దు చేసిన డిగ్రీ కళాశాలను తిరిగి ఇక్కడే ఏర్పాటు చేసేలా ఇందుకు తగ్గ సాంకేతిక అనుమతులు పాలన సంబంధ అనుమతులు సాధించారు మంత్రి అచ్చెన్న. ఆ రోజు ఇక్కడ కళాశాలే అక్కర్లేదు అని అన్నారు వైసీపీ నాయకులు. కానీ అంతకుమునుపే తమ హయాంలో 2014 - 19 మధ్య మంజూరయిన కాలేజీని ఎలా రద్దు చేస్తారని ఆ రోజు అచ్చెన్న ప్రశ్నించారు. ఇదే సందర్భంలో విద్యకు ముఖ్యంగా ఉన్నత విద్యకు పల్లె వాసులు దూరం కాకూడదు అందరికీ విద్య..అందరిదీ బాధ్యత అన్న నినాదంతో మంత్రి అచ్చెన్న చొరవ చూపి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లి పరిష్కరించారు. ఆ..రోజు వైకాపా ప్రభుత్వ పాలనలో ఏ ఆలోచనా లేకుండా మంజూరు అయిన కళాశాలను రద్దు చేయడం వల్ల స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వీరంతా ఐదేళ్లూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తరువాత కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ వీళ్లలో ఆశలు చిగురులెత్తాయి. తమ ప్రియతమ నేత అచ్చెన్నాయుడు తీసుకున్న ప్రత్యేక చొరవతో, కోటబొమ్మాళి డిగ్రీ కళాశాల పునరుద్ధరణకు(మంజూరు కావడంతో) ఈ ప్రాంత వాసులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. *ఆనందోత్సవాల్లో కూటమి నేతలు* కూటమి ప్రభుత్వం బాధ్యతలు అందుకున్న రోజు నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, యువతకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది.అదే లక్ష్యంలో భాగంగా టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండల వాసులకు ఓ గొప్ప వరం ఇచ్చింది. డిగ్రీ కళాశాల పునరుద్ధరణ కావడంతో త్వరలోనే ఇక్కడి విద్యార్థులకు తమ స్వస్థలంలోనే ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించనుంది. వారి ఆకాంక్షలు నెరవేరనున్నాయి. కూటమి ప్రభుత్వం వెలువరించిన తాజా నిర్ణయంతో నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, విద్యాపరమైన ప్రాధాన్య విధానాల వల్లే కోటబొమ్మాళికి డిగ్రీ కళాశాల సాధ్యమైందని పేర్కొన్నారు.
*కోటబొమ్మాళికి విద్యా వైభవం* *రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కృషి ఫలితం* *కోటబొమ్మాళికి డిగ్రీ కళాశాల పునః మంజూరుకు ప్రభుత్వం అనుమతి* *టెక్కలి నియోజకవర్గంలో హర్షాతిరేకాలు* *ఆనందోత్సవాల్లో కూటమి నేతలు* *కేక్ కత్తిరించి సంబరాలు చేసుకున్న కూటమి నాయకులు* *కొత్త ఏడాదిలో విద్యార్థులకు అనూహ్య కానుక* *ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు* *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు* *కోటబొమ్మాళి, జనవరి 8*: కొత్త ఏడాది రాగానే కొత్త కానుక వచ్చింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోటబొమ్మాళి ప్రాంత విద్యార్థులకు ఓ గొప్ప వరం అందించింది కూటమి ప్రభుత్వం. ఆ..రోజు 2014 - 2019 మధ్య కాలంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హయాంలో మంజూరయిన డిగ్రీ కళాశాలను తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రాంత వైకాపా నాయకులు తీరు కారణంగా.. ఆరోజు నిర్దాక్షిణ్యంగా ముందూ వెనుకా చూడకుండా ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు అవసరం లేదని, అప్పటి ఉన్నతాధికారులను తప్పుదోవపట్టిస్తూ, ఏకపక్షంగా మంజూరయినా కళాశాలను
రద్దు చేయించారు. తరువాత 2024 ఎన్నికల్లో కూటమి అనూహ్య విజయంతో డిగ్రీ కళాశాల పునరుద్ధరణ చేసేందుకు (మళ్లీ మంజూరుకు) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు చేసిన కృషి ఫలించింది. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చెన్న ఇచ్చిన హామీ నెరవేరింది. దీంతో కూటమి ప్రభుత్వంలో మరోసారి టెక్కలికి మంచి ప్రాధాన్యం లభించింది. ఉన్నత విద్యను నియోజక వర్గ విద్యార్థులు అందుకోనున్నారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడుతూ ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వైనం తెలిసిందే. ఈ పరంపరకు కొనసాగింపు విద్యకు సమున్నత ప్రాధాన్యం ఇస్తూ.. కూటమి లక్ష్యాల నెరవేర్పులో భాగంగా ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మళ్లీ అనుమతులు సాధించి ప్రతిపక్ష వర్గాలలో వణుకు పుట్టించారు. చదువు ప్రాధాన్యం తెలియని కొందరు విపక్ష నాయకుల స్వార్థ ప్రయోజనాలలో భాగంగా ఇక్కడ కళాశాల అవసరం లేదని చెబితే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇందుకు భిన్నంగా స్థానిక ఆకాంక్షలకు పట్టంకడుతూ కోటబొమ్మాళి వాకిట డిగ్రీ కళాశాల ఏర్పాటు కలను సాకారం
చేస్తూ, అందుకు తగ్గ అనుమతులు ప్రభుత్వం నుంచి తీసుకు వచ్చారు. విద్యార్థుల, తల్లిదండ్రుల మన్ననలు అందుకున్నారు. *నియోజవవర్గ విద్యార్థుల కలలు నెరవేర్చారు మంత్రి అచ్చెన్నాయుడు* నియోజవవర్గ విద్యార్థుల కలలు నెరవేర్చారు మంత్రి అచ్చెన్న. జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా రద్దు చేసిన డిగ్రీ కళాశాలను తిరిగి ఇక్కడే ఏర్పాటు చేసేలా ఇందుకు తగ్గ సాంకేతిక అనుమతులు పాలన సంబంధ అనుమతులు సాధించారు మంత్రి అచ్చెన్న. ఆ రోజు ఇక్కడ కళాశాలే అక్కర్లేదు అని అన్నారు వైసీపీ నాయకులు. కానీ అంతకుమునుపే తమ హయాంలో 2014 - 19 మధ్య మంజూరయిన కాలేజీని ఎలా రద్దు చేస్తారని ఆ రోజు అచ్చెన్న ప్రశ్నించారు. ఇదే సందర్భంలో విద్యకు ముఖ్యంగా ఉన్నత విద్యకు పల్లె వాసులు దూరం కాకూడదు అందరికీ విద్య..అందరిదీ బాధ్యత అన్న నినాదంతో మంత్రి అచ్చెన్న చొరవ చూపి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లి పరిష్కరించారు. ఆ..రోజు వైకాపా ప్రభుత్వ పాలనలో ఏ ఆలోచనా లేకుండా మంజూరు అయిన కళాశాలను రద్దు చేయడం వల్ల స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
వీరంతా ఐదేళ్లూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తరువాత కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ వీళ్లలో ఆశలు చిగురులెత్తాయి. తమ ప్రియతమ నేత అచ్చెన్నాయుడు తీసుకున్న ప్రత్యేక చొరవతో, కోటబొమ్మాళి డిగ్రీ కళాశాల పునరుద్ధరణకు(మంజూరు కావడంతో) ఈ ప్రాంత వాసులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. *ఆనందోత్సవాల్లో కూటమి నేతలు* కూటమి ప్రభుత్వం బాధ్యతలు అందుకున్న రోజు నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, యువతకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది.అదే లక్ష్యంలో భాగంగా టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండల వాసులకు ఓ గొప్ప వరం ఇచ్చింది. డిగ్రీ కళాశాల పునరుద్ధరణ కావడంతో త్వరలోనే ఇక్కడి విద్యార్థులకు తమ స్వస్థలంలోనే ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించనుంది. వారి ఆకాంక్షలు నెరవేరనున్నాయి. కూటమి ప్రభుత్వం వెలువరించిన తాజా నిర్ణయంతో నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, విద్యాపరమైన ప్రాధాన్య విధానాల వల్లే కోటబొమ్మాళికి డిగ్రీ కళాశాల సాధ్యమైందని పేర్కొన్నారు.
- నరసన్నపేట: సంక్రాంతికి ఊరెళితే సమాచారం ఇవ్వండి.. సీఐ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా తమ ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రయాణాల సమయంలో ఇళ్లల్లోని విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. ముందుగా సమాచారం ఇస్తే, ఆయా గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచడం ద్వారా భద్రత కల్పించబడుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.1
- సంతబొమ్మాళి, జనవరి 9,సంతబొమ్మాళి మండలం బోరుభద్ర, దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయు లు ఆధ్వర్యంలో శుక్రవారం భోగి, సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యా యులు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. డూడూ బసవన్నలు ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీ, స్లో సైక్లింగ్ తదితర ఆటలు నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక పాటలకు డాన్స్లు వేశారు. హరిదాసు,సంక్రాంతి గొబ్బెమ్మలు, కోలాటం సాంప్రదాయ నృత్యాలు నిర్వహించారు సాంప్రదాయ వంటలు వాళ్లు విషయాలపై సాంస్కృతికంగా తెలిపారు.4
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల నందు సంక్రాంతి సంబరాలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహముతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి, పాటశాల అవరణంతా మామిడి తోరణాలతో, రంగు రంగుల రంగవల్లికలు తో తీర్చిదిద్దారు. విద్యార్థులు వేసిన హరిదాసు, జంగమయ్య, సోదమ్మ వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చెరకుగడలతో, క్రొత్తకుండలో పాలు పొంగించిడము, గొబ్బెమ్మలు, భోగి మంటలతో కోలాహలంగా పండుగ వాావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమానికి మండల విద్యాధికారులు చిన్నవాడు, అర్జునుడు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.1
- సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే ఎంజీఆర్. ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పష్టం చేసారు. ఈ మేరకు గురువారం నియోజకవర్గ పరిధి కొత్తూరు మండలంలో గల బలద గ్రామానికి చెందిన బెహర శంకరరావు మేడపై నుండి జారీ పడిపోవడంతో రెండు కాళ్ళు విరిగి ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ స్థానిక నాయుకులు ద్వారా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వద్ద వివరించారు. దీంతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పందిస్తూముఖ్యమంత్రి సహాయానిదికి దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 80,916/- రూపాయిలు చెక్ ను గురువారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి, సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవల ౦ అర్హతే ఆధారంగా నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియో జక వర్గంలో గత పాలకులు ఏరోజైనా సీఎం సహాయనిది కోసం ఒక్క దరఖాస్తు అయిన చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు ఉన్నారు.2
- 'మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్ సౌక ర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూర మవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. ఏళ్లు గడుస్తున్నా మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందిం చాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావ లస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు. వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించు కుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పల రాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు.1
- फिल्मी हीरो बनने की सनक: युवती को इंप्रेस करने के लिए रची नकली एक्सीडेंट की साजिश, दो युवक गिरफ्तार1
- 🙏🙏1
- भारत सरकार ने 100 mg से ज्यादा डोज वाली निमेसुलाइड दवाओं पर रोक लगा दी है। यह पेनकिलर और एंटी‑इंफ्लेमेटरी दवा आमतौर पर बुखार, सिरदर्द और बदन दर्द में ली जाती थी, लेकिन ज्यादा मात्रा में लेने से लिवर और किडनी को नुकसान पहुंच सकता है। स्वास्थ्य मंत्रालय और डॉक्टरों ने बिना सलाह दवा लेने से बचने और बच्चों को यह दवा न देने की चेतावनी दी है।1