Shuru
Apke Nagar Ki App…
ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లిపేట గ్రామంలో దల్లి నారాయణ రెడ్డి కుమార్తె రజస్వల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమదాలవలస నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ హాజరై బాలికను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తవిటిరెడ్డి, సూర కిరణ్, లంగు రమణ, గోవింద్ మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆమదాలవలస
ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లిపేట గ్రామంలో దల్లి నారాయణ రెడ్డి కుమార్తె రజస్వల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమదాలవలస నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ హాజరై బాలికను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తవిటిరెడ్డి, సూర కిరణ్, లంగు రమణ, గోవింద్ మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురంలోని పురాతన సీతారామ ఆలయాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. శిల్పకళా వైభవంతో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శిథిలావస్థకు చేరిన భాగాల పునరుద్ధరణ కోసం దేవాదాయ శాఖ ద్వారా నిధులను మంజూరు చేయాలని కోరారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, ఇక్కడికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- పలాస ప్రాంతంలో ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. మందస మండలం బిడిమి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉద్దాన ప్రాంత ప్రజలు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఉద్దాన ప్రాంతంలో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయే రైతులు, నిర్వాసితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. బాధితులకు చట్టప్రకారం తగిన నష్టపరిహారం అందించి, పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డిలతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు మరియు స్థానికులు పాల్గొన్నారు.1
- పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళ్లపాదం పంచాయతీ పరిధిలోని రెబ్బ–వనధార గ్రామాలకు వెళ్లే రహదారి పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల జాప్యం కారణంగా రహదారి అధ్వానంగా తయారవడంతో స్థానిక ప్రజలే స్వయంగా శ్రమదానం చేస్తూ రోడ్డును మరమ్మతు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో రహదారి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, కాంట్రాక్టర్ కొంత మేర పనులు చేసి మధ్యలోనే వదిలేశారని గ్రామస్తులు ఆరోపించారు. జేసీబీతో రోడ్డును తవ్వడంతో పాటు కల్వర్టుల పనులను కూడా అసంపూర్తిగా వదిలివేయడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి మొత్తం బురదమయంగా మారింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కూడా గ్రామం నుంచి బయటకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్కు, స్థానిక ఎమ్మెల్యేకు, కొమరాడ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో గ్రామ ప్రజలు, యువకులు స్వయంగా రంగంలోకి దిగారు. ట్రాక్టర్లతో మట్టి, కంకర తెప్పించి పారలతో బురదను తొలగిస్తూ రహదారిని బాగు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి, తమ రోడ్డు దుస్థితిని వీడియోల ద్వారా పరిశీలించాలని, తమ పార్టీ నాయకులను పంపి సమస్యను తెలుసుకోవాలని ఆవేదనతో విజ్ఞప్తి చేశారు. గిరిజన గ్రామాల ఈ దయనీయ స్థితిపై వెంటనే స్పందించాలని వారు కోరారు. మరోవైపు, అసంపూర్తిగా పనులు వదిలేసిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే రహదారి పనులను పూర్తి చేయకుంటే రెబ్బ, వనధార గ్రామాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.2
- భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని శ్రీమతి ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి గారు సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైయస్ జగన్ కొనియాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఆమె ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని పేర్కొన్నారు. తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైయస్ జగన్, ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు మరియు సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.1
- దేశ ఆర్థిక అభివృద్ధికి కృషి చేసినందుకు గాను నారా బ్రాహ్మణి గారికి ఫార్ట్యూన్ ఇండియా ప్రతిష్టాత్మక 'మోస్ట్ పవర్ఫుల్ లేడీ' జాతీయ అవార్డును అందజేసింది. ఈ నేపథ్యంలో, ఆమె రాజకీయ ప్రవేశం చేయాలని, ఆమె నాయకత్వం వర్ధిల్లాలని కోరుతూ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖపట్నం అక్కయ్యపాలెం హైవే పోర్ట్ హాస్పిటల్ ఎదురుగా భారీగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి, నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం దక్షిణ కొరియా వెళ్లి పెట్టుబడులు తెచ్చిన నారా లోకేష్ నాయకత్వాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. 2029 ఎన్నికలలో పోటీ బరిలో మహిళలకు 33 శాతం టిక్కెట్లు ఇస్తామని లోకేష్ ప్రకటించడం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. లోకేష్ గారు తన భార్య బ్రాహ్మణి గారికి ఇచ్చిన తోడ్పాటు వల్లే ఆమె దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఈ అవార్డును అందుకున్నారని కొనియాడారు. అలాగే వయసుతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన సతీమణికి కూడా ఈ సందర్భంగా పాలాభిషేకం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ, తనకు వచ్చిన ఈ అవార్డును నారా బ్రాహ్మణి గారు రైతులు మరియు ఉద్యోగులకు అంకితం ఇచ్చారు. నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ రోజు హర్షం వ్యక్తంచేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ తెలిపారు.2
- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలోని రహదారుల దుస్థితిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రోడ్లు ఏమాత్రం బాగోలేవని, వీటిని ఎవరూ గుర్తించడం లేదని, అసలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ దారుల గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కింద పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఎవరిలోనూ చలనం లేదని, తాము చెప్పాల్సింది చెప్పేశామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.2
- కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ ఆలయంలో ఆదివారం నాడు భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం కావడంతో సుమారుగా 32 వేల మందికి పైగా భక్తులు క్యూ లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో విశ్వనాథరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గొర్ల భాస్కర్ సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజుతో కలిసి క్యూ లైన్లలో నిలబడిన భక్తుల వద్దకు వెళ్లి ఆలయంలో కల్పించిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తుల రాకతో ఆలయానికి భారీగా ఆదాయం లభించింది. వాహన పూజలు, ప్రసాదాలు, రూములు, కేశఖండన మరియు వివిధ మార్గాల ద్వారా ఆలయానికి రూ. 12,13,758 (12 లక్షల 13 వేల 758) ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో విశ్వనాథరాజు వెల్లడించారు.1
- కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఆదివారం నాడు భక్తులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఒక లారీ ఢీకొట్టింది. తలుపులమ్మ అమ్మవారి ఆలయానికి ఆటోలో 12 మంది భక్తులు బయలుదేరారు. జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఒక కోళ్ల ఫారం దగ్గరకు ఆటో చేరుకోగానే, వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.1