మహబూబాబాద్ జిల్లా సూధన పల్లి గ్రామంలో పాల్గొని ప్రసంగించిన జిల్లా ఎస్పీ శబరిష్ ఐపిఎస్ ఈరోజు సుధనపల్లి గ్రామంలో Arrive Alive మరియు 'మన ఊరు మన బాధ్యత' సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ శభాష్ పి ఐ పి ఎస్ గారు, తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ గారు మరియు మరిపెడ సిఐ పవన్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసుకున్న సుదనపల్లి గ్రామంలో మూడు తీర్మానాలు 1. రోడ్డు భద్రతలో భాగంగా గ్రామంలో ఉన్న ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం 2. గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడం 3. గ్రామాన్ని గంజాయి రైతు గ్రామంగా తీర్చిదిద్దడం పై అంశాల గురించి గ్రామస్తులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ద్విచక్ర వాహనదారులకు 150 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న మరియు ఉపసర్పంచ్ పాలకవర్గం ను ఎస్పీ గారు అభినందించారు, అలాగే గ్రామంలో గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని గంజాయి సేవిస్తున్నట్టుగాని రవాణా చేస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే 87126 56 99 9 ఇంటి నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందిస్తే 5000 వరకు బహుమతి అందజేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే గ్రామంలోని యువతకి పిల్లలకి ఎస్పి గారు స్పోర్ట్స్ కిట్ ను అందజేయడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్న సైకిల్ కి సైకిల్ ముందు వెనక రేడియం స్టిక్కర్లు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా ఎస్పీ గారు చేసిన సూచనలను పాటిస్తామని విలేజ్ ని గంజాయి రైతు గ్రామంగా మారుస్తామని నిర్ణయించడం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా సూధన పల్లి గ్రామంలో పాల్గొని ప్రసంగించిన జిల్లా ఎస్పీ శబరిష్ ఐపిఎస్ ఈరోజు సుధనపల్లి గ్రామంలో Arrive Alive మరియు 'మన ఊరు మన బాధ్యత' సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ శభాష్ పి ఐ పి ఎస్ గారు, తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ గారు మరియు మరిపెడ సిఐ పవన్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసుకున్న సుదనపల్లి గ్రామంలో మూడు తీర్మానాలు 1. రోడ్డు భద్రతలో భాగంగా గ్రామంలో ఉన్న ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం 2. గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడం 3. గ్రామాన్ని గంజాయి రైతు గ్రామంగా తీర్చిదిద్దడం పై అంశాల గురించి గ్రామస్తులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ద్విచక్ర వాహనదారులకు 150 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న మరియు ఉపసర్పంచ్ పాలకవర్గం ను ఎస్పీ గారు అభినందించారు, అలాగే గ్రామంలో గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని గంజాయి సేవిస్తున్నట్టుగాని రవాణా చేస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే 87126 56 99 9 ఇంటి నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందిస్తే 5000 వరకు బహుమతి అందజేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే గ్రామంలోని యువతకి పిల్లలకి ఎస్పి గారు స్పోర్ట్స్ కిట్ ను అందజేయడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్న సైకిల్ కి సైకిల్ ముందు వెనక రేడియం స్టిక్కర్లు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా ఎస్పీ గారు చేసిన సూచనలను పాటిస్తామని విలేజ్ ని గంజాయి రైతు గ్రామంగా మారుస్తామని నిర్ణయించడం జరిగింది.
- మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సంక్షేమ వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరిమిట్ట మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు వసతి గృహాల్లో పారిశుధ్యం, ఆరోగ్యం, మైనర్ రిపేర్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.1
- Post by Ramprasad islavath1
- *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 15 నుండి 15 రోజులపాటు హిందూ సమ్మేళనం కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిందూ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి, తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100కు పైగా, తెలంగాణ వ్యాప్తంగా రెండువేలపైగా, భారత దేశవ్యాప్తంగా 25వేల హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి హిందువు తమ విద్యుక్త ధర్మం కోసం పాటుపడాలని, గడప లోపల కులమని, గడప దాటితే హిందువులమన్న భావన ప్రతి ఒక్క హిందువులో కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూధర్మం లో ఉన్న విలువలు మరే దేశానికి లేవని, విదేశీయులు సైతం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి మాట్లాడుతూ, భారతదేశంలో హిందువును దేశ భద్రతకు, సమాజ శ్రేయస్సుకు తయారు చేసే శక్తి కేవలం మాతృమూర్తికే ఉందని, యువకులను దేశ సమగ్రత కాపాడడానికి ప్రతీకలుగా తయారు చేయాలన్నారు. హిందూ సమ్మేళనంలో దాదాపు 5వేలకు మందిపైగా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.2
- Post by Tagore1
- Post by Merugu Rajitha1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి బ్యారేజీ పరిస్థితి, జరిగిన నష్టం, మరమ్మతులు మరియు పునరుద్ధరణ పనుల పురోగతిపై సీఎం అధికారులతో వివరంగా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ భద్రత, నీటి నిర్వహణ, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.1
- జగిత్యాల వేదికగా జరిగిన కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ పై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ జైత్రయాత్ర సభ కాదు, జీవన్ రెడ్డి చేరిక మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన బిఆర్ఎస్ లో చేరినంత మాత్రాన కాంగ్రెస్ కు నష్టం ఉండదు.. బిఆర్ఎస్ కు లాభం జరగదన్నారు. జగిత్యాల లో మీడియాతో మాట్లాడిన ఆయన, జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ లో ముసలం పుట్టినట్లు తెలుస్తుందన్నారు.అందుకే హరీష్ రావు జగిత్యాల సభకు హాజరుకాలేదని ప్రచారం జరుగుతుందన్నారు. హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి బిజేపి టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుందని, ఇప్పటికే కవిత వెళ్ళిపోయారని...మీరు వెళ్ళొద్దని హరీష్ రావు ను కోరుతున్నట్లు తెలుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసిఆర్ హరీష్ రావును ఉరితీయాలని జీవన్ రెడ్డి కోరారని అలాంటి వ్యక్తిని బిఆర్ఎస్ లో చేర్చుకోవడం హాస్యాస్పదమన్నారు. జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ చీలిక పుడుతుందని చెప్పారు. హరీష్ రావు తోపాటు పలువురు ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తనను ఏ బ్రీడ్ ఎమ్మెల్యే అంటున్న కేటీఆర్, గతంలో కాంగ్రెస్ తో పెట్టుకున్న మీరు రాజకీయంగా ఏ బ్రీడ్ అని ప్రశ్నించారు. అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాని మా తాతలు నుంచే మా కుటుంబ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.4
- Post by Merugu Rajitha1