logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భక్తిశ్రద్ధలతో కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన అంజన్న స్వాములు!! జన్నారం మండలంలోని కామన్ పల్లి మరియు దేవునిగూడ గ్రామాల నుండి 16 మంది హనుమాన్ దీక్షాధారులు మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు.​గత కొన్ని రోజులుగా కఠినమైన నియమాలతో హనుమాన్ దీక్షలు చేపట్టిన స్వాములు,ఈరోజు ఉదయం గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామస్తులు,కుటుంబ సభ్యుల సమక్షంలో ‘జై బోలో హనుమాన్..జై జై కొండగట్టు అంజన్న’ అంటూ ఆకాశం మిన్నంటేలా జై నినాదాలు చేస్తూ తమ పాదయాత్రను ప్రారంభించారు.​ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ..ప్రతి ఏటా ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నామని,సుమారు వంద కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో అంజన్న నామస్మరణే తమకు తోడుగా ఉంటుందని తెలిపారు.ఈ పాదయాత్రలో పాల్గొన్న స్వాములకు గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.మార్గమధ్యలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పెద్దలు మరియు యువకులు తగిన ఏర్పాట్లు చేశారు.​ఈ కార్యక్రమంలో కామన్ పల్లి,దేవునిగూడ గ్రామాల దీక్షాధారులు భానుప్రసాద్,సాయి,మారుతి,శాంతి,అనిల్,శివ,సాయి,మధుకర్,బద్దెష్,సాయి శివ,హరీష్,అంజి,మల్లికార్జున్,ప్రసాద్,అరుణ్,మహేష్,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

1 hr ago
user_Ganesh Reporter
Ganesh Reporter
Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
1 hr ago
08d50c89-90a2-45eb-9d1d-f313e75d7e94

భక్తిశ్రద్ధలతో కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన అంజన్న స్వాములు!! జన్నారం మండలంలోని కామన్ పల్లి మరియు దేవునిగూడ గ్రామాల నుండి 16 మంది హనుమాన్ దీక్షాధారులు మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు.​గత కొన్ని రోజులుగా కఠినమైన నియమాలతో హనుమాన్ దీక్షలు చేపట్టిన స్వాములు,ఈరోజు ఉదయం గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామస్తులు,కుటుంబ సభ్యుల సమక్షంలో ‘జై బోలో హనుమాన్..జై జై కొండగట్టు అంజన్న’ అంటూ ఆకాశం మిన్నంటేలా జై నినాదాలు చేస్తూ తమ పాదయాత్రను ప్రారంభించారు.​ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ..ప్రతి ఏటా ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నామని,సుమారు వంద కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో అంజన్న నామస్మరణే తమకు తోడుగా ఉంటుందని తెలిపారు.ఈ పాదయాత్రలో పాల్గొన్న స్వాములకు గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.మార్గమధ్యలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పెద్దలు మరియు యువకులు తగిన ఏర్పాట్లు చేశారు.​ఈ కార్యక్రమంలో కామన్ పల్లి,దేవునిగూడ గ్రామాల దీక్షాధారులు భానుప్రసాద్,సాయి,మారుతి,శాంతి,అనిల్,శివ,సాయి,మధుకర్,బద్దెష్,సాయి శివ,హరీష్,అంజి,మల్లికార్జున్,ప్రసాద్,అరుణ్,మహేష్,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుండి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.
    1
    లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుండి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    30 min ago
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సీపీఎం నేతలు అంతర్జాతీయ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, యుద్ధం వెంటనే ఆపి శాంతి చర్చలు ప్రారంభించాలని కోరారు. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత్ వంటి దేశాలు దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
    2
    కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సీపీఎం నేతలు అంతర్జాతీయ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, యుద్ధం వెంటనే ఆపి శాంతి చర్చలు ప్రారంభించాలని కోరారు. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత్ వంటి దేశాలు దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • Attapur Police arrested four youths for performing dangerous bike stunts and rash driving near Aramghar Road on March 27, 2026. A case has been registered under relevant BNS and MV Act sections. The accused were produced before the court and remanded to judicial custody on March 31, 2026.
    1
    Attapur Police arrested four youths for performing dangerous bike stunts and rash driving near Aramghar Road on March 27, 2026. A case has been registered under relevant BNS and MV Act sections. The accused were produced before the court and remanded to judicial custody on March 31, 2026.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    1 hr ago
  • *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి* కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్‌తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్‌పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    4
    *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి*
కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ 
కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్  ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్‌తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్‌పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    user_దయా మదన్
    దయా మదన్
    Metpalli, Jagitial•
    10 hrs ago
  • bellampallii mandal bhuchiyapalli villege madi na ku pinchan vastaledu narige raj kumar my name Naku govarnament nundi shayam kavali daya CHESI Naku govarnament shayam cheyali koruthuna ma villege lo Gala sarpanch garu shayam cheyyalani koruthunna
    1
    bellampallii mandal bhuchiyapalli villege madi na ku pinchan vastaledu narige raj kumar my name Naku govarnament nundi shayam kavali daya CHESI Naku govarnament shayam cheyali koruthuna  ma villege lo Gala sarpanch garu shayam cheyyalani koruthunna
    user_Narige Rajkumar
    Narige Rajkumar
    Actor బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    23 min ago
  • నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే రమేష్ (టీచర్) పదవి విరమణ సందర్భంగా ఆయన నివాసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరై టీచర్ రమేష్ ని శాలువాతో సన్మానించి వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.
    1
    నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే రమేష్ (టీచర్) పదవి విరమణ సందర్భంగా ఆయన నివాసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరై టీచర్ రమేష్ ని శాలువాతో సన్మానించి వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Neradigonda, Adilabad•
    1 hr ago
  • కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.
    1
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన  కవ్వంపల్లి రవి  ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి 
చంపి వేయడంతో వెంటనే  రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా
సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్  చేరుకొని  దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు
రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అర్ధరాత్రి భారీ వర్షం దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జన్నారం, పలు గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావతమైంది. ఉరుములు, మెరుపులు భారీ ఈదురుగాళ్లతో వర్షం పడుతోంది. దీంతో చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు అరగంటకు పైగా భారీ ఈదురుగాలులతో వర్షం పడినట్టు సమాచారం అందుతుంది..మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. నష్టం వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
    1
    జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అర్ధరాత్రి భారీ వర్షం దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జన్నారం, పలు గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావతమైంది. ఉరుములు, మెరుపులు భారీ ఈదురుగాళ్లతో వర్షం పడుతోంది. దీంతో చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు అరగంటకు పైగా భారీ ఈదురుగాలులతో వర్షం పడినట్టు సమాచారం అందుతుంది..మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. నష్టం వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.