అంబేద్కర్ జయంతి రోజున దళితుల ఇళ్లకు వెలుగులు.. ఎమ్మెల్యే పరిటాల సునీత* *కనగానపల్లి మండలం శివపురం గ్రామంలో పీఎం సూర్య ఘర్ యూనిట్ల ప్రారంభం* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం పరితపించిన అంబేద్కర్ జయంతి రోజున దళితుల ఇళ్లకు కొత్త వెలుగులు వచ్చాయి. కనగానపల్లి మండలం శివపురం గ్రామంలో పీఎం సూర్య ఘర్ - పథకం కింద సోలార్ యూనిట్లను ఆమె ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పరిటాల సునీతకు స్థానిక టిడిపి నాయకులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తప్పెట్లు మేళ తాళాలు, టపాసులు కాలుస్తూ, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆమె గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కనకదాసు విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. శివపురంలో 30లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన 3 సి.సి రోడ్లు ప్రారంభించారు. శివపురం కొట్టాలలో 90లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన 2 సి.సి రోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనగానపల్లి మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే కనగానపల్లికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. సబ్ స్టేషన్లు, సిసి రోడ్లు గతంలో ఎప్పుడు లేని విధంగా నిర్మించినట్లు చెప్పారు. పిఎం సూర్యా ఘర్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీ ద్వారా సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయన్నారు. రెండేళ్ల క్రితం వరకు కరెంట్ బిల్లులు ఎంత వచ్చేవో అందరికీ తెలిసిందేనన్నారు. కరెంట్ బిల్లులు చూడాలంటేనే భయం వేసేదని .. అవి ముట్టుకుంటే షాక్ కొట్టేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఆ భారాన్ని ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. పైగా కరెంట్ ఛార్జీలు తగ్గించేలా కూడా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అయినప్పటికీ మనం విద్యుత్ ఛార్జీలు చెల్లించకుండా మన ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య ఘర్ అనే పథకాన్ని తీసుకొచ్చాయన్నారు. గృహాలతో పాటు ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర వాటిపై సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేసుకుంటే మనకు పూర్తిస్థాయిలో ఉచిత విద్యుత్ అందడమే కాకుండా... తిరిగి ప్రభుత్వానికి విక్రయించే పరిస్థితి కూడా ఉందనన్నారు. నెలకు 120 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తే 1000కి పైగా బిల్లు వస్తోందని.. అయితే సోలార్ రూఫ్టాప్తో 338కి ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. పీఎం సూర్యఘర్ యోజన కింద 1కిలో వాట్స్ అయితే ఖర్చులో 30వేల వరకు సబ్సిడీ, 2కిలో వాట్స్ కు 60వేలు, 3కిలో వాట్స్ కి 78వేల వరకు సబ్సిడీ ఉంటుందన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకైతే పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో మొత్తం 18వందలకు పైగా ఇళ్లపైన దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు ఇది పూర్తిగా ఉచితంగా ఉంటుందని అందుకే అంబేద్కర్ జయంతి రోజున వారికి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఇలాంటవి అందజేస్తున్నట్లు వచ్చారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రకాష్ రెడ్డి పేరూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా... ఇప్పుడు మా పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 లోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే తట్టెడు మట్టి ఎత్తకుండా రూపాయి రైతులకు పరిహారం అందించకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. గత ఐదేళ్లలో ఎన్నిసార్లు పేరూరు ప్రాజెక్టుకు నీరు అందించారో సమాధానం చెప్పాలని నిలదీశారు. మీరు చేసిన తప్పిదాలతో రైతులు పరిహారం కోసం ఇన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని త్వరలోనే రైతులకు పరిహారం అందిస్తామని... ప్రాజెక్టు కూడా ఏడాదిలోపు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు...
అంబేద్కర్ జయంతి రోజున దళితుల ఇళ్లకు వెలుగులు.. ఎమ్మెల్యే పరిటాల సునీత* *కనగానపల్లి మండలం శివపురం గ్రామంలో పీఎం సూర్య ఘర్ యూనిట్ల ప్రారంభం* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం పరితపించిన అంబేద్కర్ జయంతి రోజున దళితుల ఇళ్లకు కొత్త వెలుగులు వచ్చాయి. కనగానపల్లి మండలం శివపురం గ్రామంలో పీఎం సూర్య ఘర్ - పథకం కింద సోలార్ యూనిట్లను ఆమె ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పరిటాల సునీతకు స్థానిక టిడిపి నాయకులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తప్పెట్లు మేళ తాళాలు, టపాసులు కాలుస్తూ, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆమె గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కనకదాసు విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. శివపురంలో 30లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన 3 సి.సి రోడ్లు ప్రారంభించారు. శివపురం కొట్టాలలో 90లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన 2 సి.సి రోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనగానపల్లి మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే కనగానపల్లికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. సబ్ స్టేషన్లు, సిసి రోడ్లు గతంలో ఎప్పుడు లేని విధంగా నిర్మించినట్లు చెప్పారు. పిఎం సూర్యా ఘర్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీ ద్వారా సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయన్నారు. రెండేళ్ల క్రితం వరకు కరెంట్ బిల్లులు ఎంత వచ్చేవో అందరికీ తెలిసిందేనన్నారు. కరెంట్ బిల్లులు చూడాలంటేనే భయం వేసేదని .. అవి ముట్టుకుంటే షాక్ కొట్టేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఆ భారాన్ని ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. పైగా కరెంట్ ఛార్జీలు తగ్గించేలా కూడా
సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అయినప్పటికీ మనం విద్యుత్ ఛార్జీలు చెల్లించకుండా మన ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య ఘర్ అనే పథకాన్ని తీసుకొచ్చాయన్నారు. గృహాలతో పాటు ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర వాటిపై సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేసుకుంటే మనకు పూర్తిస్థాయిలో ఉచిత విద్యుత్ అందడమే కాకుండా... తిరిగి ప్రభుత్వానికి విక్రయించే పరిస్థితి కూడా ఉందనన్నారు. నెలకు 120 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తే 1000కి పైగా బిల్లు వస్తోందని.. అయితే సోలార్ రూఫ్టాప్తో 338కి ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. పీఎం సూర్యఘర్ యోజన కింద 1కిలో వాట్స్ అయితే ఖర్చులో 30వేల వరకు సబ్సిడీ, 2కిలో వాట్స్ కు 60వేలు, 3కిలో వాట్స్ కి 78వేల వరకు సబ్సిడీ ఉంటుందన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకైతే పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో మొత్తం 18వందలకు పైగా ఇళ్లపైన దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు ఇది పూర్తిగా ఉచితంగా ఉంటుందని అందుకే అంబేద్కర్ జయంతి రోజున వారికి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఇలాంటవి అందజేస్తున్నట్లు వచ్చారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రకాష్ రెడ్డి పేరూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా... ఇప్పుడు మా పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 లోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే తట్టెడు మట్టి ఎత్తకుండా రూపాయి రైతులకు పరిహారం అందించకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. గత ఐదేళ్లలో ఎన్నిసార్లు పేరూరు ప్రాజెక్టుకు నీరు అందించారో సమాధానం చెప్పాలని నిలదీశారు. మీరు చేసిన తప్పిదాలతో రైతులు పరిహారం కోసం ఇన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని త్వరలోనే రైతులకు పరిహారం అందిస్తామని... ప్రాజెక్టు కూడా ఏడాదిలోపు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు...
- ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి1
- మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు బ్రోచర్ విడుదల1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- చిత్తూరు జిల్లా...కుప్పం కుప్పంలో రాజకీయ ఉద్రిక్తత రాప్తాడు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గిరీష్ రెడ్డి అరెస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు పైసోషల్ మీడియాలో అవినీతి ఆరోపణలు చేసినందుకు చర్యలు కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 76/2026 కింద పలు సెక్షన్లతో కేసు నమోదు 196(1), 352, 353(2), 336(1), 340(2), 61(2), 111 (76 ITA 2000-2008) ప్రకారం కూడా కేసు నమోదు అరెస్ట్ అనంతరం నిందితుడిని కుప్పం కోర్టుకు తరలించిన పోలీసులు కేసు వాదనలు వినిపించేందుకు విజయవాడ నుంచి వైసీపీ పార్టీ లాయర్ పోన్నవోలు కోర్టు వద్ద భారీగా వైసీపీ నాయకుల సమీకరణ చిత్తూరు వైసీపీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భరత్, మండల నాయకులు, కార్యకర్తలు హాజరు కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ వాతావరణం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసిన పోలీసులు1
- Post by Bondhu Suresh1
- వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది1
- హిందూ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త... మహారాష్ట్రలోని నాసిక్ లో హిందూ అమ్మాయిని టార్గెట్ చేసిన జిహాదీలు..1
- ✒️- ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్కు రైలు ఎక్కాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు. ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£1
- ఎమ్మిగనూరులో స్కూల్ అభివృద్ధికి శ్రీకారం – తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ1