గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాసు హనుమంతు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్ని పంటలను ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మాత్రం చేతులెత్తేస్తున్నారని బాసు హనుమంతు నాయుడు ఆరోపించారు. పంటల కొనుగోలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. మే 25న కేంద్రం మెడలు వంచుతామని ముఖ్యమంత్రి చేసిన హెచ్చరిక ఏమైందని బాసు హనుమంతు నాయుడు ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతులు అరిగోస పడుతున్నారని, రైతులు ఏడిస్తే రాష్ట్రానికి మంచిది కాదని, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో రైతు బీమా పథకాన్ని ప్రవేశపెడితే, ప్రస్తుత ప్రభుత్వం ప్రీమియం డబ్బులు కూడా కట్టలేని స్థితిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందించడం లేదని, ఎరువుల కోసం యాప్ ఇబ్బందులకు గురిచేస్తోందని, విద్యుత్ సరిగ్గా ఇవ్వకపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని కూడా కొనమని చెప్పడం రైతులను నట్టేట ముంచడమేనని విమర్శించారు. రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్ర కోటల పేరుతో కొనుగోళ్లకు పరిమితులు విధించడం ద్వారా రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేస్తున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంట బోనస్, కొనుగోళ్లు, నీటి సరఫరా, కరెంట్ సరఫరా ఇలా అన్నింటిలో కోతలు పెడుతూ ప్రభుత్వం రైతులకు తీరని ద్రోహం చేస్తోందని బాసు హనుమంతు నాయుడు ఆరోపించారు. వానాకాలం సీజన్ నిధులతో పాటు, పెండింగ్లో ఉన్న మూడు విడతల రైతుభరోసా బకాయిలు మొత్తం రూ.16,545 కోట్లు ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఎంత అంటే అంత ధాన్యం మాత్రమే కొంటామని చెప్పడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శమన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిందిపోయి రైతులను పాతాళంలోకి నెట్టేస్తారా అని ప్రశ్నిస్తూ, కేంద్రంలోని బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని అన్నదాతలను నట్టేట ముంచుతారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 71 సార్లు ఢిల్లీ యాత్రలు చేసినా, పంట కొనుగోళ్లపై ఒక్కసారైనా ప్రస్తావించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కార్ ఇంత దారుణంగా చేతులెత్తేస్తే ఇక 70 లక్షల మంది రైతులకు దిక్కెవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాడె పడేసిన కాంగ్రెస్ సర్కారుకు రైతులు కర్రకాల్సి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ఈ రైతు వ్యతిరేక ముఖ్యమంత్రిని, రైతు ద్రోహి కాంగ్రెస్ సర్కార్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనకపోతే రైతులతో కలిసి బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, జీ. రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీచుపల్లి, సూర్య గౌడ్, రాజారెడ్డి, మోనేష్, సోమశేఖర్ రెడ్డి, శ్రీరాములు, చక్రీధర్ రెడ్డి, తిమ్మప్ప గౌడ్, లక్ష్మారెడ్డి, వీరేష్ గౌడ్, సురేష్, గొనుపాడు మాలిక్, రమేష్, డ్యామ్ శ్రీను, జగదీశ్, రజిని బాబు, నరసింహులు, వెంకటేష్, మహేష్, వీరేష్, రవి, మోహన్, మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాసు హనుమంతు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్ని పంటలను ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మాత్రం చేతులెత్తేస్తున్నారని బాసు హనుమంతు నాయుడు ఆరోపించారు. పంటల కొనుగోలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. మే 25న కేంద్రం మెడలు వంచుతామని ముఖ్యమంత్రి చేసిన హెచ్చరిక ఏమైందని బాసు హనుమంతు నాయుడు ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతులు అరిగోస పడుతున్నారని, రైతులు ఏడిస్తే రాష్ట్రానికి మంచిది కాదని, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో రైతు బీమా పథకాన్ని ప్రవేశపెడితే, ప్రస్తుత ప్రభుత్వం ప్రీమియం డబ్బులు కూడా కట్టలేని స్థితిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందించడం లేదని, ఎరువుల కోసం యాప్ ఇబ్బందులకు గురిచేస్తోందని, విద్యుత్ సరిగ్గా ఇవ్వకపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని కూడా కొనమని చెప్పడం రైతులను నట్టేట ముంచడమేనని విమర్శించారు. రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్ర కోటల పేరుతో కొనుగోళ్లకు పరిమితులు విధించడం ద్వారా రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేస్తున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంట బోనస్, కొనుగోళ్లు, నీటి సరఫరా, కరెంట్ సరఫరా ఇలా అన్నింటిలో కోతలు పెడుతూ ప్రభుత్వం రైతులకు తీరని ద్రోహం చేస్తోందని బాసు హనుమంతు నాయుడు ఆరోపించారు. వానాకాలం సీజన్ నిధులతో పాటు, పెండింగ్లో ఉన్న మూడు విడతల రైతుభరోసా బకాయిలు మొత్తం రూ.16,545 కోట్లు ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఎంత అంటే అంత ధాన్యం మాత్రమే కొంటామని చెప్పడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శమన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిందిపోయి రైతులను పాతాళంలోకి నెట్టేస్తారా అని ప్రశ్నిస్తూ, కేంద్రంలోని బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని అన్నదాతలను నట్టేట ముంచుతారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 71 సార్లు ఢిల్లీ యాత్రలు చేసినా, పంట కొనుగోళ్లపై ఒక్కసారైనా ప్రస్తావించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కార్ ఇంత దారుణంగా చేతులెత్తేస్తే ఇక 70 లక్షల మంది రైతులకు దిక్కెవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాడె పడేసిన కాంగ్రెస్ సర్కారుకు రైతులు కర్రకాల్సి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ఈ రైతు వ్యతిరేక ముఖ్యమంత్రిని, రైతు ద్రోహి కాంగ్రెస్ సర్కార్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనకపోతే రైతులతో కలిసి బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, జీ. రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీచుపల్లి, సూర్య గౌడ్, రాజారెడ్డి, మోనేష్, సోమశేఖర్ రెడ్డి, శ్రీరాములు, చక్రీధర్ రెడ్డి, తిమ్మప్ప గౌడ్, లక్ష్మారెడ్డి, వీరేష్ గౌడ్, సురేష్, గొనుపాడు మాలిక్, రమేష్, డ్యామ్ శ్రీను, జగదీశ్, రజిని బాబు, నరసింహులు, వెంకటేష్, మహేష్, వీరేష్, రవి, మోహన్, మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- వనపర్తి జిల్లాలోని పానగల్ మండలంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మామిడి చెట్లను నరికివేసిన సంఘటన చోటుచేసుకుంది. కేతేపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల మన్యం, రాజు, సురేష్లకు చెందిన మామిడి తోటలో ఈ విధ్వంసం జరిగింది. రాజు తెలిపిన వివరాల ప్రకారం, వారి తోటలో మొత్తం 150 మామిడి చెట్లు ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో 130 మామిడి చెట్లను నరికి ధ్వంసం చేశారు.1
- మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 21వ డివిజన్లోని శ్రీనివాస్ కాలనీ ప్రాంతంలో నివసిస్తున్న జిల్లా పరిషత్ ఉద్యోగి రవీందర్ గౌడ్ ఇంట్లోకి ఈ సాయంత్రం రసల్స్ వైపర్ అనే విషపూరిత పాము ప్రవేశించి ఓ సందులో దాక్కుంది. వెంటనే రవీందర్ గౌడ్ ఈ విషయాన్ని మహబూబ్నగర్ పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ లోకేష్కు తెలియజేశారు. సమాచారం అందుకున్న లోకేష్ వెంటనే అక్కడికి చేరుకొని, తన నైపుణ్యంతో విషపూరిత రసల్స్ వైపర్ (రక్తపింజర) పామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో రవీందర్ గౌడ్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.1
- నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో శనివారం ఆకస్మికంగా కురిసిన వర్షం, గత నాలుగు రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు పెద్ద ఉపశమనాన్నిచ్చింది. ఎండల తీవ్రతకు ఎండిపోతాయని భయపడిన పంట మొలకలు ఈ వానతో తిరిగి జీవం పోసుకుంటాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు, చేతికొచ్చే తరుణంలో ఉన్న మొలకలు ప్రాణం పోసుకుంటాయనే ధీమాతో రైతన్నల కళ్లల్లో ఆనందం వెల్లువిరిసింది. బిజినపల్లి మంగనూరులో పడిన ఈ చినుకు, నిజంగానే పంట మొలకలకు కొత్త జీవితాన్నిచ్చి, రైతన్నల మోమున చిరునవ్వులు పూయించింది.1
- కడప జిల్లాలోని కే. తిమ్మాపురంలో పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంతో పాటు గ్రామంలో రైతు సంబరాలు అట్టహాసంగా జరిగాయి.1
- నంద్యాల కోర్టులో జూలై 11న జరగనున్న మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మనరాజా సూచించారు. శనివారం నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. న్యాయమూర్తి అమ్మనరాజా మాట్లాడుతూ, లోక్ అదాలత్లో రాజీ చేయదగ్గ కేసులను రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజీ మార్గం ద్వారా అమూల్యమైన సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఎక్కువ కేసులను పరిష్కరించడమే లక్ష్యంగా కక్షిదారులు ముందుకు రావాలని కోరారు. లోక్ అదాలత్లో రాజీ కుదిరిన కేసులపై అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నొక్కిచెప్పారు.1
- ఎమ్మిగనూరు నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 76 సంవత్సరాలుగా మదాసి కురువ/మదారి కురువ కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, కన్వర్టెడ్ క్రిస్టియన్ పాస్టర్లకు SC సర్టిఫికెట్లను అంగడిలో పప్పుల బెల్లాలు లాగా పంచిపెడుతూ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. నిజమైన ఎస్సీలైన మదాసి కురువ/మదారి కురువ సోదరులకు SC సర్టిఫికెట్ ఇస్తే, కురుబ/కురుమలు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని ప్రచారం చేయడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. SCలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని సమితి తెలియజేసింది. రాయలసీమ జిల్లాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులను కుల మార్పిడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్సీలోని 58 కులాలు హక్కులను పొందుతూ ముందుకు పోతూ ఉంటే, ఏకైక కులమైనటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులు ఇప్పటివరకు కోల్పోయిన రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించేంతవరకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి పోరాడుతూనే ఉంటుందని ప్రసన్నకుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మద్దిలేటి మదాసి కురువ, సాల్వాడి సురేంద్ర, మహదేవప్ప పవన్, జూలకల్లు మునిష్, సుంకేసుల హుస్సేన్ అప్ప, అలువాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.1
- కూటమి ప్రభుత్వం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్పష్టం చేశారు. నందికొట్కూరులో జరిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య, 'పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ' పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ₹20 వేల చొప్పున మూడు విడతలుగా ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. రైతుల కోసం వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన మరోసారి పేర్కొన్నారు.1
- ఎమ్మిగనూరులోని అంగన్వాడీ కేంద్రంలో ఎమ్మెల్యే ఒక ప్రత్యేక తనిఖీని నిర్వహించారు. ఈ తనిఖీ సందర్బంగా ఎమ్మెల్యే అందరి హృదయాలను గెలుచుకున్నారు.1