logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుంటూరులోని GGH ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆసుపత్రి వార్డు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్ (50) ఈ నెల 23న చికిత్స నిమిత్తం GGH ఆసుపత్రిలో చేరాడు. కాలకృత్యాల కోసం వెళ్లిన శ్రీనివాస్, అక్కడే ఉన్న కిటికీ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్ వృత్తిరీత్యా తాపిమేస్త్రి కాగా, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా అస్పష్టంగా ఉన్నాయి. మృతుడు శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు ఉండగా, ఆయన భార్య గతంలోనే మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

6 hrs ago
user_Journalist SIDDHU
Journalist SIDDHU
Guntur, Andhra Pradesh•
6 hrs ago
5a64827a-5b48-4d2c-bd8d-8fa70217f706
2eb9dc80-3274-4e60-858f-8cc2fa8c8a4b

గుంటూరులోని GGH ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆసుపత్రి వార్డు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్ (50) ఈ నెల 23న చికిత్స నిమిత్తం GGH ఆసుపత్రిలో చేరాడు. కాలకృత్యాల కోసం వెళ్లిన శ్రీనివాస్, అక్కడే ఉన్న కిటికీ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్ వృత్తిరీత్యా తాపిమేస్త్రి కాగా, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా అస్పష్టంగా ఉన్నాయి. మృతుడు శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు ఉండగా, ఆయన భార్య గతంలోనే మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More news from Andhra Pradesh and nearby areas
  • Post by SHOT NEWS
    1
    Post by SHOT NEWS
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    7 hrs ago
  • అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) సీఎండీ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి, ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులు వేసిన అడ్డుక‌ట్ట‌ను త‌క్ష‌ణం తొల‌గించాలని ఏడీసీ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. స్లూయీజ్ గేట్ల లీకేజీ ద్వారా కృష్ణాన‌దిలోని నీటి ప్ర‌వాహం కొండ‌వీటివాగులోనికి వెళ్ల‌కుండా నిరోధించేందుకు ఈ అడ్డుక‌ట్ట వేయబడిందని ఆమె పేర్కొన్నారు. పంపింగ్ స్టేష‌న్‌కు మ‌ర‌మ‌తులు చేసే క్రమంలో, నీటిపారుద‌ల శాఖ అధికారులు కొండ‌వీటివాగులో నీరు ఇన్‌టేక్ పాండ్‌లో క‌ల‌వ‌కుండా ఈ అడ్డుక‌ట్ట వేశారని వివరణ లభించింది. నీటిపారుదల హెడ్ రెగ్యులేటర్‌లో లీకేజీ మరియు ఈ కట్ట కారణంగా కృష్ణా నది నుండి పెనుమాక రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం వెనక్కి ప్రవహించిందని ఏడీసీ ఛీఫ్ ఇంజినీరు బి.న‌ర‌సింహ‌మూర్తి సీఎండీకి వివరించారు. ఉండ‌వ‌ల్లి పంపింగ్ స్టేష‌న్ వ‌ద్ద కృష్ణాన‌దిలో కొండ‌వీటివాగు నీటి ప్ర‌వాహం కలుస్తుంది. ఇక్కడ అడ్డుకట్ట వేయడం వల్ల కృష్ణాన‌దిలో నీరు వెనక్కి వచ్చి, పెనుమాకలో అభివృద్ధి పనులలో ఉన్న రిజర్వాయర్‌లోనికి చేరి నిలిచిందని ఆయన నివేదించారు. ఈ అడ్డుక‌ట్ట బ‌కింగ్‌హాం కెనాల్‌లో వెళ్లాల్సిన కొండ‌వీటివాగు నీరు సైతం నిలిచిపోవడానికి కారణమైంది. ఈ పరిస్థితిపై శ‌నివారం ఏడీసీ ఇంజినీరింగ్ అధికారుల‌తో పంపింగ్ స్టేష‌న్ ప్రాంతాన్ని ప‌రిశీలించిన సీఎండీ, వెంటనే నీటిపారుద‌ల శాఖ అధికారుల‌తో మాట్లాడి, అడ్డుక‌ట్ట‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని ఖ‌చ్చిత‌మైన ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఆమె పెనుమాక రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా నీటి ప్ర‌వాహాన్ని పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున, రాజ‌ధాని అమ‌రావ‌తి గుండా ప్ర‌వ‌హిస్తున్న కొండ‌వీటివాగు, పాల‌వాగుల మ‌ధ్య నిర్మిస్తున్న ర‌హ‌దార్ల వంతెన‌ల వ‌ద్ద నీటి ప్ర‌వాహానికి ఆటంకం లేకుండా అధికారులు వెంటనే చ‌ర్య‌లు చేప‌ట్టాలని కూడా ఆమె ఆదేశించారు. అలాగే, పాల‌వాగు ప్రారంభ‌మ‌య్యే రాయ‌పూడి వ‌ద్ద ఉన్న డైవ‌ర్ష‌న్ ఛానెల్‌ను మరింత లోతుగా తవ్వకం చేయాలని సూచించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్లు ఆర్‌.గోపాల‌కృష్ణారెడ్డి, సీహెచ్‌. ధ‌నుంజ‌య‌, ఎస్ఈ రామ‌మోహ‌న‌రావుతో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
    1
    అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) సీఎండీ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి, ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులు వేసిన అడ్డుక‌ట్ట‌ను త‌క్ష‌ణం తొల‌గించాలని ఏడీసీ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. స్లూయీజ్ గేట్ల లీకేజీ ద్వారా కృష్ణాన‌దిలోని నీటి ప్ర‌వాహం కొండ‌వీటివాగులోనికి వెళ్ల‌కుండా నిరోధించేందుకు ఈ అడ్డుక‌ట్ట వేయబడిందని ఆమె పేర్కొన్నారు.

పంపింగ్ స్టేష‌న్‌కు మ‌ర‌మ‌తులు చేసే క్రమంలో, నీటిపారుద‌ల శాఖ అధికారులు కొండ‌వీటివాగులో నీరు ఇన్‌టేక్ పాండ్‌లో క‌ల‌వ‌కుండా ఈ అడ్డుక‌ట్ట వేశారని వివరణ లభించింది. నీటిపారుదల హెడ్ రెగ్యులేటర్‌లో లీకేజీ మరియు ఈ కట్ట కారణంగా కృష్ణా నది నుండి పెనుమాక రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం వెనక్కి ప్రవహించిందని ఏడీసీ ఛీఫ్ ఇంజినీరు బి.న‌ర‌సింహ‌మూర్తి సీఎండీకి వివరించారు. ఉండ‌వ‌ల్లి పంపింగ్ స్టేష‌న్ వ‌ద్ద కృష్ణాన‌దిలో కొండ‌వీటివాగు నీటి ప్ర‌వాహం కలుస్తుంది. ఇక్కడ అడ్డుకట్ట వేయడం వల్ల కృష్ణాన‌దిలో నీరు వెనక్కి వచ్చి, పెనుమాకలో అభివృద్ధి పనులలో ఉన్న రిజర్వాయర్‌లోనికి చేరి నిలిచిందని ఆయన నివేదించారు. ఈ అడ్డుక‌ట్ట బ‌కింగ్‌హాం కెనాల్‌లో వెళ్లాల్సిన కొండ‌వీటివాగు నీరు సైతం నిలిచిపోవడానికి కారణమైంది.

ఈ పరిస్థితిపై శ‌నివారం ఏడీసీ ఇంజినీరింగ్ అధికారుల‌తో పంపింగ్ స్టేష‌న్ ప్రాంతాన్ని ప‌రిశీలించిన సీఎండీ, వెంటనే నీటిపారుద‌ల శాఖ అధికారుల‌తో మాట్లాడి, అడ్డుక‌ట్ట‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని ఖ‌చ్చిత‌మైన ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఆమె పెనుమాక రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా నీటి ప్ర‌వాహాన్ని పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున, రాజ‌ధాని అమ‌రావ‌తి గుండా ప్ర‌వ‌హిస్తున్న కొండ‌వీటివాగు, పాల‌వాగుల మ‌ధ్య నిర్మిస్తున్న ర‌హ‌దార్ల వంతెన‌ల వ‌ద్ద నీటి ప్ర‌వాహానికి ఆటంకం లేకుండా అధికారులు వెంటనే చ‌ర్య‌లు చేప‌ట్టాలని కూడా ఆమె ఆదేశించారు. అలాగే, పాల‌వాగు ప్రారంభ‌మ‌య్యే రాయ‌పూడి వ‌ద్ద ఉన్న డైవ‌ర్ష‌న్ ఛానెల్‌ను మరింత లోతుగా తవ్వకం చేయాలని సూచించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్లు ఆర్‌.గోపాల‌కృష్ణారెడ్డి, సీహెచ్‌. ధ‌నుంజ‌య‌, ఎస్ఈ రామ‌మోహ‌న‌రావుతో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    7 hrs ago
  • కర్ణాటకలోని హంపిలో యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.
    1
    కర్ణాటకలోని హంపిలో యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ Rolla, Sri Sathya Sai•
    16 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి, రూరల్ మండలాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కుసుమంచి మండలంలోని గణపేశ్వర ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, అలాగే కొండాపురం నుంచి పొన్నెకల్లు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి, వార్డు సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ కోరారు.
    1
    తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి, రూరల్ మండలాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.

కుసుమంచి మండలంలోని గణపేశ్వర ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, అలాగే కొండాపురం నుంచి పొన్నెకల్లు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి, వార్డు సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ కోరారు.
    user_AMSRAS
    AMSRAS
    నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • పని ఒత్తిడి, ఆందోళనల కారణంగా తన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి, ప్రస్తుతం ఆటో డ్రైవర్‍గా జీవనం సాగిస్తున్న ఓ మహిళ గురించి లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. మిథ్లాజ్ స్వయంగా ఆ మహిళ ఆటో ఎక్కి ఆమెతో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ఐటీ మేనేజర్‍గా పని చేసిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఆ ఉద్యోగం మానేసినట్లు ఆ మహిళ చెప్పినట్లు మిథ్లాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేలు సంపాదిస్తున్నారని, అన్నిటికంటే ముఖ్యంగా, ఆటో డ్రైవర్‍గా ఆమె చాలా సంతోషంగా ఉన్నారని వీడియోలో పేర్కొన్నారు. అయితే, ఆ మహిళ ఎక్కడ ఆటో నడుపుతున్నారనే వివరాలను మాత్రం ఆ వీడియోలో చెప్పలేదు.
    1
    పని ఒత్తిడి, ఆందోళనల కారణంగా తన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి, ప్రస్తుతం ఆటో డ్రైవర్‍గా జీవనం సాగిస్తున్న ఓ మహిళ గురించి లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. మిథ్లాజ్ స్వయంగా ఆ మహిళ ఆటో ఎక్కి ఆమెతో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ఐటీ మేనేజర్‍గా పని చేసిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఆ ఉద్యోగం మానేసినట్లు ఆ మహిళ చెప్పినట్లు మిథ్లాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేలు సంపాదిస్తున్నారని, అన్నిటికంటే ముఖ్యంగా, ఆటో డ్రైవర్‍గా ఆమె చాలా సంతోషంగా ఉన్నారని వీడియోలో పేర్కొన్నారు. అయితే, ఆ మహిళ ఎక్కడ ఆటో నడుపుతున్నారనే వివరాలను మాత్రం ఆ వీడియోలో చెప్పలేదు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • ఈరోజు ఏలూరులోని ఆర్ఆర్ పేట వెంకటేశ్వర స్వామి గుడి భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్క భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న సమారాధనలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూలైన్‌ను క్రమశిక్షణతో పాటించారు. ప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. మొత్తంగా, ఈరోజు ఏలూరు ఆర్ఆర్ పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది.
    1
    ఈరోజు ఏలూరులోని ఆర్ఆర్ పేట వెంకటేశ్వర స్వామి గుడి భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్క భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న సమారాధనలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూలైన్‌ను క్రమశిక్షణతో పాటించారు. ప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు.

మొత్తంగా, ఈరోజు ఏలూరు ఆర్ఆర్ పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది.
    user_Vikram
    Vikram
    Bhimadole, Eluru•
    1 hr ago
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నడుస్తోందా లేక కొందరి అవినీతి సామ్రాజ్యంగా మారిందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామరాజ్ హరీష్ కుమార్ తీవ్రంగా ప్రశ్నించారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన, రాష్ట్రంలో దేవాదాయ శాఖకు అసలు మంత్రి ఉన్నారా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తూ, ఒకవేళ ఉంటే ఆయన కేవలం ఒక "కీలుబొమ్మ" లాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత 16 నెలల కాలంలో ఈ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేవుడి సొమ్మును, భూములను రక్షించాల్సిన అధికారులే భక్షకులుగా మారారని ఆరోపణలు చేస్తూ, గత 16 నెలల కాలంలోనే వందల ఎకరాల దేవాదాయ భూములకు నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఓసిలు ఇచ్చిన ఘోర కలియుగాన్ని చూస్తున్నామని హరీష్ కుమార్ అన్నారు. ప్రస్తుత దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ రానున్న రోజుల్లో మరికొన్ని వేల ఎకరాల దేవుడి భూములకు ఎన్‌ఓసిలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తి కమిషనర్‌గా, ఏడీసీ-1గా, ఏడీసీ-2గా మూడు ఉన్నత పదవులను అనుభవిస్తూ దేవాదాయ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని ఆలయాల్లో దేవుళ్లకు జరగాల్సిన కైంకర్యాల్లో తీవ్ర లోపాలు జరుగుతున్నాయని, ఎన్నో చోట్ల దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసినా ప్రభుత్వానికి చలనం లేదని హరీష్ కుమార్ విమర్శించారు. భక్తులకు పెట్టే అన్నదానాల్లో సైతం నాణ్యత లోపించి, అవినీతి రాజ్యమేలుతోందని ఆయన అన్నారు. వయసులో పెద్దవారు, దేవుడిపై ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన మంత్రిని చూస్తే జాలేస్తోందని, దేవాదాయ శాఖకు సంబంధించిన ఏ కార్యక్రమంలో చూసినా కమిషనర్ రామచంద్ర మోహనే కనిపిస్తున్నారని, మంత్రి ఉనికి ఎక్కడా కనిపించడం లేదని భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారని ఆయన తెలిపారు. గత 16 నెలల కాలంలో దేవాదాయ శాఖలో జరిగిన భూముల ఎన్‌ఓసిలు, ఉద్యోగాల ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించాలని కామరాజ్ హరీష్ కుమార్ డిమాండ్ చేశారు. రానున్న గోదావరి పుష్కరాలు, కృష్ణా నది పుష్కరాల పర్యవేక్షణకు తక్షణమే దేవాదాయ శాఖ తరపున ఒక సమర్థుడైన ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాలని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోదావరి పుష్కరాల్లో జరిగిన చేదు అనుభవాలను గుర్తుచేశారు. ప్రస్తుత కమిషనర్ రామచంద్ర మోహన్‌పై తక్షణమే న్యాయపరమైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవినీతిపై స్పందించకపోతే, దేవుడిని నమ్మే ఒక సాధారణ భక్తుడిగా హైకోర్టును ఆశ్రయించి అయినా సరే న్యాయపరమైన విచారణ జరిగేలా చూస్తామని హెచ్చరించారు. దేవుడి సొమ్మును దోచుకుంటున్న వారిపై విచారణ జరిపించేంత వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
    1
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నడుస్తోందా లేక కొందరి అవినీతి సామ్రాజ్యంగా మారిందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామరాజ్ హరీష్ కుమార్ తీవ్రంగా ప్రశ్నించారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన, రాష్ట్రంలో దేవాదాయ శాఖకు అసలు మంత్రి ఉన్నారా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తూ, ఒకవేళ ఉంటే ఆయన కేవలం ఒక "కీలుబొమ్మ" లాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత 16 నెలల కాలంలో ఈ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

దేవుడి సొమ్మును, భూములను రక్షించాల్సిన అధికారులే భక్షకులుగా మారారని ఆరోపణలు చేస్తూ, గత 16 నెలల కాలంలోనే వందల ఎకరాల దేవాదాయ భూములకు నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఓసిలు ఇచ్చిన ఘోర కలియుగాన్ని చూస్తున్నామని హరీష్ కుమార్ అన్నారు. ప్రస్తుత దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ రానున్న రోజుల్లో మరికొన్ని వేల ఎకరాల దేవుడి భూములకు ఎన్‌ఓసిలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తి కమిషనర్‌గా, ఏడీసీ-1గా, ఏడీసీ-2గా మూడు ఉన్నత పదవులను అనుభవిస్తూ దేవాదాయ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని ఆలయాల్లో దేవుళ్లకు జరగాల్సిన కైంకర్యాల్లో తీవ్ర లోపాలు జరుగుతున్నాయని, ఎన్నో చోట్ల దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసినా ప్రభుత్వానికి చలనం లేదని హరీష్ కుమార్ విమర్శించారు. భక్తులకు పెట్టే అన్నదానాల్లో సైతం నాణ్యత లోపించి, అవినీతి రాజ్యమేలుతోందని ఆయన అన్నారు. వయసులో పెద్దవారు, దేవుడిపై ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన మంత్రిని చూస్తే జాలేస్తోందని, దేవాదాయ శాఖకు సంబంధించిన ఏ కార్యక్రమంలో చూసినా కమిషనర్ రామచంద్ర మోహనే కనిపిస్తున్నారని, మంత్రి ఉనికి ఎక్కడా కనిపించడం లేదని భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారని ఆయన తెలిపారు.

గత 16 నెలల కాలంలో దేవాదాయ శాఖలో జరిగిన భూముల ఎన్‌ఓసిలు, ఉద్యోగాల ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించాలని కామరాజ్ హరీష్ కుమార్ డిమాండ్ చేశారు. రానున్న గోదావరి పుష్కరాలు, కృష్ణా నది పుష్కరాల పర్యవేక్షణకు తక్షణమే దేవాదాయ శాఖ తరపున ఒక సమర్థుడైన ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాలని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోదావరి పుష్కరాల్లో జరిగిన చేదు అనుభవాలను గుర్తుచేశారు. ప్రస్తుత కమిషనర్ రామచంద్ర మోహన్‌పై తక్షణమే న్యాయపరమైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవినీతిపై స్పందించకపోతే, దేవుడిని నమ్మే ఒక సాధారణ భక్తుడిగా హైకోర్టును ఆశ్రయించి అయినా సరే న్యాయపరమైన విచారణ జరిగేలా చూస్తామని హెచ్చరించారు. దేవుడి సొమ్మును దోచుకుంటున్న వారిపై విచారణ జరిపించేంత వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    9 hrs ago
  • కామారెడ్డి జిల్లాలోని మగ్దుంపూర్‌లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న సామ్ సంగ్ ఫోన్ ఎండ వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. వేసవిలో ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలోని మగ్దుంపూర్‌లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న సామ్ సంగ్ ఫోన్ ఎండ వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.

వేసవిలో ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.