మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ : *జన్మదినాన్ని సేవా దినోత్సవంగా మార్చిన డా. రూప్లాల్ బానోత్.. రేపు ఉచిత వైద్య సేవలు* *జన్మదినాన్ని సేవా దినోత్సవంగా మార్చిన డా. రూప్లాల్ బానోత్.. రేపు ఉచిత వైద్య సేవలు* మహబూబాబాద్, జూలై 31: ప్రముఖ వైద్యులు, జయ హాస్పిటల్ వ్యవస్థాపకులు,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డా. రూప్లాల్ బానోత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 1న (రేపు) మహబూబాబాద్ ప్రజలకు ప్రత్యేక ఉచిత వైద్య సేవలను అందించనున్నారు. సమాజ సేవే నిజమైన జన్మదిన వేడుక అనే సందేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జయ హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. అలాగే ఈసీజీ (ECG), ల్యాబ్ పరీక్షలు, ఎక్స్రే సేవలపై 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరింది. 1990లో మహబూబాబాద్లో జయ హాస్పిటల్ను స్థాపించిన డా. రూప్లాల్ బానోత్ గత 37 సంవత్సరాలుగా నాణ్యమైన, అందుబాటు వైద్య సేవలను అందిస్తూ వేలాది మంది రోగులకు ఆరోగ్య భరోసాగా నిలిచారు. సేవాభావం, నిబద్ధత, మానవతా దృక్పథంతో వైద్య వృత్తిని కొనసాగిస్తూ జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. వైద్య సేవలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) మహబూబాబాద్ శాఖకు ఆరు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా (ప్రెసిడెంట్గా) సమర్థవంతంగా సేవలందించారు. ఆయన నాయకత్వంలో శాఖ విశిష్ట సేవలు అందించడంతో IMA బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డుతో పాటు నేషనల్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం IMA తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వైద్య రంగానికి విశేష సేవలు అందిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి గురువారం, శనివారం పక్షవాతం, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులతో పాటు 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఉచిత ఓపీ సేవలను నిరంతరాయంగా అందిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా మారాయి. రోగిని కుటుంబ సభ్యుడిలా భావిస్తూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో డా. రూప్లాల్ బానోత్ మహబూబాబాద్ జిల్లాలో విశ్వసనీయ వైద్యుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అందిస్తున్న వైద్య, సామాజిక సేవలు అనేక మంది వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు కొనియాడుతున్నారు. జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా ఉంచి సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డా. రూప్లాల్ బానోత్కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. *– నిమ్మనగంటి అనిల్ బాబు* *డోర్నకల్ మండలం, షురూ న్యూస్*
మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ : *జన్మదినాన్ని సేవా దినోత్సవంగా మార్చిన డా. రూప్లాల్ బానోత్.. రేపు ఉచిత వైద్య సేవలు* *జన్మదినాన్ని సేవా దినోత్సవంగా మార్చిన డా. రూప్లాల్ బానోత్.. రేపు ఉచిత వైద్య సేవలు* మహబూబాబాద్, జూలై 31: ప్రముఖ వైద్యులు, జయ హాస్పిటల్ వ్యవస్థాపకులు,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డా. రూప్లాల్ బానోత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 1న (రేపు) మహబూబాబాద్ ప్రజలకు ప్రత్యేక ఉచిత వైద్య సేవలను అందించనున్నారు. సమాజ సేవే నిజమైన జన్మదిన వేడుక అనే సందేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జయ హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. అలాగే ఈసీజీ (ECG), ల్యాబ్ పరీక్షలు, ఎక్స్రే సేవలపై 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరింది. 1990లో మహబూబాబాద్లో జయ హాస్పిటల్ను స్థాపించిన డా. రూప్లాల్ బానోత్ గత 37 సంవత్సరాలుగా నాణ్యమైన, అందుబాటు వైద్య సేవలను అందిస్తూ వేలాది మంది రోగులకు ఆరోగ్య భరోసాగా నిలిచారు. సేవాభావం, నిబద్ధత, మానవతా దృక్పథంతో వైద్య వృత్తిని కొనసాగిస్తూ జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. వైద్య సేవలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) మహబూబాబాద్ శాఖకు ఆరు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా (ప్రెసిడెంట్గా) సమర్థవంతంగా సేవలందించారు. ఆయన నాయకత్వంలో శాఖ విశిష్ట సేవలు అందించడంతో IMA బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డుతో పాటు నేషనల్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం IMA తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వైద్య రంగానికి విశేష సేవలు అందిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి గురువారం, శనివారం పక్షవాతం, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులతో పాటు 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఉచిత ఓపీ సేవలను నిరంతరాయంగా అందిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా మారాయి. రోగిని కుటుంబ సభ్యుడిలా భావిస్తూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో డా. రూప్లాల్ బానోత్ మహబూబాబాద్ జిల్లాలో విశ్వసనీయ వైద్యుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అందిస్తున్న వైద్య, సామాజిక సేవలు అనేక మంది వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు కొనియాడుతున్నారు. జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా ఉంచి సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డా. రూప్లాల్ బానోత్కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. *– నిమ్మనగంటి అనిల్ బాబు* *డోర్నకల్ మండలం, షురూ న్యూస్*
- *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 మూడు ప్రధాన పార్టీలకు మూడు షేర్ల నీళ్ళు తాగించింది అప్పుడే మర్చిపోయారా..??? ఒకవేళ మర్చిపోయి ఉంటే...ఈ సారి మూడు చెరువుల నీళ్ళు తాగడానికి సిద్ధంగా ఉండండి🌊🌊🌊 WGL- NLG-KMM గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వార్ వన్ సైడ్...అది తీన్మార్ మల్లన్న సైడ్🔥1
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.1
- భారతదేశం కర్ణాటక తుమాకూరు జిల్లా : *గోల్డ్ షాపులో చోరీ.. దొంగ ఎవరో తెలిస్తే షాక్! ఎలుక బొరియలో రూ.10 లక్షల బంగారు ఆభరణాలు..* *గోల్డ్ షాపులో చోరీ.. దొంగ ఎవరో తెలిస్తే షాక్! ఎలుక బొరియలో రూ.10 లక్షల బంగారు ఆభరణాలు..* జూలై 31 | షురూ న్యూస్ కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బంగారు నగల దుకాణంలో ఆభరణాలు కనిపించకపోవడంతో మొదట సిబ్బంది దొంగతనం జరిగిందని భావించారు. పోలీసులకు ఫిర్యాదు చేసేముందు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. సీసీటీవీ దృశ్యాల్లో ఓ ఎలుక ఒక్కోసారి ఒక్కో బంగారు ఉంగరం, చిన్న చిన్న ఆభరణాలను నోటితో పట్టుకుని తన బొరియలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో సిబ్బంది ఎలుక బొరియను తవ్వి చూడగా అందులో 10 బంగారు ఉంగరాలు, 3 బంగారు చైన్లు సహా సుమారు రూ.10 లక్షల విలువైన ఆభరణాలు లభించాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే ఆభరణాలన్నీ తిరిగి దొరికాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలుకలు మెరిసే వస్తువులు, చిన్న పరిమాణంలో ఉండే వస్తువులను తమ బొరియల్లోకి తీసుకెళ్లే అలవాటు కొన్నిసార్లు చూపుతాయి. అవి వాటి విలువను తెలుసుకుని కాకుండా, సహజ ప్రవృత్తి కారణంగా ఇలా తీసుకెళ్తాయని చెబుతున్నారు. ఈ ఘటన బంగారు దుకాణాల్లో సీసీటీవీ నిఘా ఎంత కీలకమో మరోసారి నిరూపించింది. సీసీటీవీ లేకపోయి ఉంటే ఇది నిజమైన దొంగతనంగా భావించి దర్యాప్తు మరింత క్లిష్టంగా మారేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. *— నిమ్మ నగంటి అనిల్ బాబు* * డోర్నకల్ రిపోర్టర్, షురూ న్యూస్*1
- ముల్కలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.2 లక్షల నగదు సహా విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. జిల్లా:భద్రాద్రికొత్తగూడెం సెంటర్:అశ్వారావుపేట స్లగ్: షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం.. లక్షల ఆస్థి నష్టం యాంకర్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.2 లక్షల నగదు సహా విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. మూకమామిడి గ్రామానికి చెందిన ఊకె రాజులు పూరిల్లు తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడగా, ఇల్లు పూర్తిగా కాలిపోయింది. రూ.2 లక్షల నగదు, రెండు క్వింటాళ్ల బియ్యం, టీవీ, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న సర్పంచ్ ఆదిలక్ష్మి, గ్రామ యువత బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.1