Shuru
Apke Nagar Ki App…
రోడ్డు సదుపాయం కోసం పాడేరు ఐటీడీఏ వద్ద చింతపల్లి మండలం జలగలగడ్డ వాసులు 6 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా అధికారుల్లో కనీస చలనం లేదు. గతంలో కలెక్టర్లు తక్షణమే స్పందించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం ఆదివాసులకు తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుత దీక్షలు చేస్తున్న గిరిజనులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Shyam
రోడ్డు సదుపాయం కోసం పాడేరు ఐటీడీఏ వద్ద చింతపల్లి మండలం జలగలగడ్డ వాసులు 6 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా అధికారుల్లో కనీస చలనం లేదు. గతంలో కలెక్టర్లు తక్షణమే స్పందించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం ఆదివాసులకు తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుత దీక్షలు చేస్తున్న గిరిజనులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుండగా ఆమెను అడ్డుకోకుండా భర్త వీడియో తీసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజంపేట మండలం బోయినపల్లికి చెందిన రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి చెందింది. దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కృష్ణవేణి ఉరి వేసుకుంటానని బెదిరించగా, ఎలా ఉరి వేసుకోవాలో భర్త శ్రీనివాసులు చెప్పినట్లు సమాచారం. అనంతరం ఆమె ఉరి వేసుకునే ప్రయత్నం చేయగా అడ్డుకోవాల్సిన భర్త ఆమెను ఆపకుండా వీడియో తీసినట్లు బంధువులు తెలిపారు. తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని కృష్ణవేణి ఉరి పడి మృతి చెందినట్లు సమాచారం. కాగా శ్రీనివాసులకు కృష్ణవేణి రెండో భార్యగా బంధువులు చెబుతున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు అతనిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న రాజంపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నౌపడ టెక్కలి మిలియ పుట్టి ప్రధాన రహదారి పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు ఈ పనుల్లో భాగంగా రహదారి పనులు సర్వంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.2
- రాజధాని లేని రాష్ట్రం ఉన్నదంటే అది కేవలం ఏపీనే అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గురువారం జగ్గంపేట (M) కాట్రగుల్లపల్లిలో నిర్వహించిన రచ్చబండలో ఆమె ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రం చేతిలో చిప్ప తప్ప ఏమి లేదన్నారు. కేంద్రం అప్పులు ఇస్తుందే తప్ప నిధులు ఇవ్వట్లేదన్నారు. పోలవరంను ఎందుకు ఖూనీ చేస్తున్నారని కేంద్రాన్ని పార్లమెంట్లో నిలదీసే ఒక్క ఎంపీ కూడా లేడని దుమ్మెత్తిపోశారు1
- ఎండాకాలంలో పక్షులకు నీళ్లు పెట్టండి1
- Post by Venkata laxmi Kothapalli4
- కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజులుగా వివాదాస్పదంగా మారిన జనసేన పార్టీ జెండా అంశం ఉత్కంఠభరితంగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణతో కలిసి జెండాను ఎగురవేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జెండా ఏర్పాటు చేయడంపై రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైఎస్ఆర్సిపి నేతల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా, రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, “జనసేన జెండాపై ఎవరైనా చెయ్యేస్తే జనసైనికులు, వీర మహిళలు చూస్తూ ఊరుకోరు” అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో జనసేన తన బలం చూపిందని, పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.4
- 10 నెలలు పాలనలో రూ.10కోట్లతో అభివృద్ధి: బేబినాయన1
- రాజమండ్రి ఎస్.కె.వి.టి ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వి.పార్వతి పాల్గొని మాట్లాడుతూ.. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వాటి ధర, నాణ్యత, పరిమాణం, తయారీ, గడువు తేదీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు జి.అనంతరావు, ఏఎస్ఓ నాగాంజనేయులు పాల్గొన్నారు.1
- fire1