logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జమ్మలమడుగు- ప్రొద్దుటూరు రహదారిలోని చలివెందుల సబ్స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూరగాయల వ్యాపారి దూదేకుల శీలన్న (65) మృతి చెందారు. ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న గూడ్స్ ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ దూదేకుల రెడ్డప్ప తీవ్రంగా గాయపడగా, ఆయనను 108 అంబులెన్స్ ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

6 hrs ago
user_LAKKU SIVA SANKAR reddy
LAKKU SIVA SANKAR reddy
Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
6 hrs ago
eee0dd27-9d8c-4cdd-a8ef-035b13b03a88

జమ్మలమడుగు- ప్రొద్దుటూరు రహదారిలోని చలివెందుల సబ్స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూరగాయల వ్యాపారి దూదేకుల శీలన్న (65) మృతి చెందారు. ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న గూడ్స్ ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ దూదేకుల రెడ్డప్ప తీవ్రంగా గాయపడగా, ఆయనను 108 అంబులెన్స్ ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ నూతన టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా డీసీసీబీ ఛైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డికి సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన వర్గీయులు, అనుచరులు బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో బాణాసంచా పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా రితేశ్ రెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు మంచూరి సూర్యనారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ఆయన అనుచరులు బద్వేలులో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
    1
    వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ నూతన టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా డీసీసీబీ ఛైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డికి సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన వర్గీయులు, అనుచరులు బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో బాణాసంచా పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.

గతంలో ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా రితేశ్ రెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు మంచూరి సూర్యనారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ఆయన అనుచరులు బద్వేలులో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ఈ భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబ నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, బాలికల విద్య, బాధ్యతాయుతమైన తల్లిదండ్రత్వం మరియు సమతుల్య జనాభా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఈ ఏడాది నిర్దేశించిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. "పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం", "పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. జననాల మధ్య సరైన విరామం, మాతా–శిశు సంక్షేమం, మహిళల ఆరోగ్యం మరియు లింగ సమానత్వంపై ప్రజలను చైతన్యపరచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎన్‌సీడీ–సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. కళాధర్, డిపిహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు వైద్యాధికారులు డాక్టర్ సుమదుర, డాక్టర్ గాయత్రి, సీహెచ్‌ఓ శివరామ్, సూపర్‌వైజర్ రామమోహన్, అలాగే ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ఈ భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబ నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, బాలికల విద్య, బాధ్యతాయుతమైన తల్లిదండ్రత్వం మరియు సమతుల్య జనాభా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఈ ఏడాది నిర్దేశించిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. "పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం", "పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. జననాల మధ్య సరైన విరామం, మాతా–శిశు సంక్షేమం, మహిళల ఆరోగ్యం మరియు లింగ సమానత్వంపై ప్రజలను చైతన్యపరచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎన్‌సీడీ–సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. కళాధర్, డిపిహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు వైద్యాధికారులు డాక్టర్ సుమదుర, డాక్టర్ గాయత్రి, సీహెచ్‌ఓ శివరామ్, సూపర్‌వైజర్ రామమోహన్, అలాగే ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) 75వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
    1
    ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) 75వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
    user_G VENKATESH YADAV
    G VENKATESH YADAV
    Ambulance service ఎస్.మైదుకూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం గ్రామంలోని పురాతన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఆలయానికి చెందిన విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఆలయంలో ఒకపక్క అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, దేవాదాయ (ఎండోమెంట్) శాఖ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కారణంగా స్వామివారి మాన్యాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే నంబర్ల పరిధిలో ఎకరాల కొద్దీ భూమి కబ్జాకు గురైనట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి. కబ్జాకు గురైన భూముల వివరాల ప్రకారం, శాఖరాజుపల్లిలోని సర్వే నంబర్ 261లో 2 ఎకరాలకు పైగా, నేకనాపురం పరిధిలోని సర్వే నంబర్ 177లో 1 ఎకరా 16 సెంట్లు, సర్వే నంబర్ 36లో 23 సెంట్లు భూమి ఆక్రమణకు గురయ్యాయి. అలాగే వంతాటిపల్లె పరిధిలో సర్వే నంబర్ 157లో 58 సెంట్లు, సర్వే నంబర్ 164లో 38 సెంట్లు, సర్వే నంబర్ 185లో 1 ఎకరా 80 సెంట్లు భూమి అన్యాక్రాంతమైంది. పేర్కొన్న వివరాలే కాకుండా, రంగనాథ స్వామి ఆలయానికి చెందిన మరికొన్ని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నట్లు సమాచారం.
    1
    వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం గ్రామంలోని పురాతన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఆలయానికి చెందిన విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఆలయంలో ఒకపక్క అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, దేవాదాయ (ఎండోమెంట్) శాఖ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కారణంగా స్వామివారి మాన్యాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే నంబర్ల పరిధిలో ఎకరాల కొద్దీ భూమి కబ్జాకు గురైనట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి.

కబ్జాకు గురైన భూముల వివరాల ప్రకారం, శాఖరాజుపల్లిలోని సర్వే నంబర్ 261లో 2 ఎకరాలకు పైగా, నేకనాపురం పరిధిలోని సర్వే నంబర్ 177లో 1 ఎకరా 16 సెంట్లు, సర్వే నంబర్ 36లో 23 సెంట్లు భూమి ఆక్రమణకు గురయ్యాయి. అలాగే వంతాటిపల్లె పరిధిలో సర్వే నంబర్ 157లో 58 సెంట్లు, సర్వే నంబర్ 164లో 38 సెంట్లు, సర్వే నంబర్ 185లో 1 ఎకరా 80 సెంట్లు భూమి అన్యాక్రాంతమైంది. పేర్కొన్న వివరాలే కాకుండా, రంగనాథ స్వామి ఆలయానికి చెందిన మరికొన్ని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నట్లు సమాచారం.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    11 hrs ago
  • వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా సూర్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సూర్యనారాయణ రెడ్డి నియామకంతో బద్వేలు ప్రాంతంలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ నియామక వార్త తెలియగానే బద్వేలు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు బద్వేలు నాలుగు రోడ్ల కూడలి వద్దకు భారీగా చేరుకున్నారు. అక్కడ వారు పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ విజయోత్సవం జరుపుకున్నారు. సూర్యనారాయణ రెడ్డి నాయకత్వానికి జై కొడుతూ నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి.
    4
    వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా సూర్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సూర్యనారాయణ రెడ్డి నియామకంతో బద్వేలు ప్రాంతంలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఈ నియామక వార్త తెలియగానే బద్వేలు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు బద్వేలు నాలుగు రోడ్ల కూడలి వద్దకు భారీగా చేరుకున్నారు. అక్కడ వారు పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ విజయోత్సవం జరుపుకున్నారు. సూర్యనారాయణ రెడ్డి నాయకత్వానికి జై కొడుతూ నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసులు అసాంఘిక శక్తులపై ముమ్మర దాడులు నిర్వహించారు. మదనపల్లెలోని ఒకటవ టౌన్ పరిధిలోని ఒక గోడౌన్‌పై నాలుగు ప్రత్యేక బృందాలు మెరుపుదాడి చేశాయి. ఈ దాడిలో యువతను నిర్వీర్యం చేస్తున్న కూల్ లిప్ సహా భారీగా నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సంబేపల్లి పరిధిలో రెండు చోట్ల, పీలేరు పరిధిలో రెండు చోట్ల పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు జరిపారు. మొత్తం నాలుగు పేకాట శిబిరాల నుంచి 28 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.80,690 నగదును స్వాధీనం చేసుకున్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతూ మత్తు పదార్థాలు విక్రయించినా, పేకాట తదితర జూదాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు.
    1
    అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసులు అసాంఘిక శక్తులపై ముమ్మర దాడులు నిర్వహించారు. మదనపల్లెలోని ఒకటవ టౌన్ పరిధిలోని ఒక గోడౌన్‌పై నాలుగు ప్రత్యేక బృందాలు మెరుపుదాడి చేశాయి. ఈ దాడిలో యువతను నిర్వీర్యం చేస్తున్న కూల్ లిప్ సహా భారీగా నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే సంబేపల్లి పరిధిలో రెండు చోట్ల, పీలేరు పరిధిలో రెండు చోట్ల పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు జరిపారు. మొత్తం నాలుగు పేకాట శిబిరాల నుంచి 28 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.80,690 నగదును స్వాధీనం చేసుకున్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతూ మత్తు పదార్థాలు విక్రయించినా, పేకాట తదితర జూదాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలంలోని చలమారెడ్డి పల్లె గ్రామంలో త్రాగునీటి చేతిపంపు (బోరు) గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. ఈ పంపు గ్రామ ప్రజలందరికీ ప్రధాన నీటి వనరుగా ఉండటంతో, అది పాడైపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చేతిపంపు మరమ్మతుల కోసం అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, స్పందన నిధులు లేదా పంచాయతీ నిధులను ఉపయోగించి యుద్ధ ప్రాతిపదికన పంపును బాగు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలంలోని చలమారెడ్డి పల్లె గ్రామంలో త్రాగునీటి చేతిపంపు (బోరు) గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. ఈ పంపు గ్రామ ప్రజలందరికీ ప్రధాన నీటి వనరుగా ఉండటంతో, అది పాడైపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ చేతిపంపు మరమ్మతుల కోసం అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, స్పందన నిధులు లేదా పంచాయతీ నిధులను ఉపయోగించి యుద్ధ ప్రాతిపదికన పంపును బాగు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    18 hrs ago
  • ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ కావడంతో, వైద్యులు తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్స సుమారు మూడున్నర గంటలపాటు కొనసాగింది. 2016లో జరిగిన గాయాలకు తోడు, పోరాట యాత్ర నుండి గత ఎన్నికల ప్రచారం వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన చేతులు పట్టి లాగడం వల్ల ఈ రొటేటర్ కఫ్ గాయాలు తీవ్రతరమయ్యాయని సమాచారం.
    1
    ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ కావడంతో, వైద్యులు తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్స సుమారు మూడున్నర గంటలపాటు కొనసాగింది.

2016లో జరిగిన గాయాలకు తోడు, పోరాట యాత్ర నుండి గత ఎన్నికల ప్రచారం వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన చేతులు పట్టి లాగడం వల్ల ఈ రొటేటర్ కఫ్ గాయాలు తీవ్రతరమయ్యాయని సమాచారం.
    user_ఆకుల చంద్రమోహన్
    ఆకుల చంద్రమోహన్
    సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.