నల్గొండలో కరాటే సమ్మర్ క్యాంపు పోస్టర్ ఆవిష్కరించిన ఈ హీరో సుమన్ తల్వార్ ఈనెల 17వ తేదీన షావలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా వారి సమ్మర్ క్యాంప్ బ్రోచర్ ఆవిష్కరణ కరాటే లెజెండ్ హన్షీ డాక్టర్ సుమన్ తల్వార్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఇలా క్యాంప్ నిర్వహిస్తూ మార్షల్ ఆర్ట్స్ విద్యను ప్రతి ఒక్కరికి అందించాలన్న వారి ప్రయత్నాన్ని అందరూ ఒక అవకాశంగా భావించి ఈ వేసవి సెలవుల్లో కొంత సమయం మార్షల్ ఆర్ట్స్ విద్యకు కేటాయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అలాగే షావలిన్ షోటోఖాన్ వారిని ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నందుకుగాను అభినందించారు. సమ్మర్ క్యాంప్ వివరాలు: ఏప్రిల్ 23 నుండి జూన్ 2 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. క్యాంప్ నిర్వహించు స్థలాలు : 1. ద మాస్టర్ హై స్కూల్ , వివేకానంద విగ్రహం దగ్గర హైదరాబాద్ రోడ్, నల్గొండ. ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6:00 గంటల వరకు. 2. సందీప్ హై స్కూల్, దేవరకొండ రోడ్, నల్గొండ. ప్రతిరోజు ఉదయం 6:00 నుండి 7:00 గంటల వరకు. 3. సెయింట్ ఆల్ఫన్స్ హై స్కూల్, నల్గొండ. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8:00 గంటల వరకు. 4. శ్రీ చైతన్య హై స్కూల్, అశోక్ నగర్ సాగర్ (X) రోడ్, నల్గొండ. ప్రతిరోజు ఉదయం 8:00 నుండి 9:00 గంటల వరకు. బ్లాక్ బెల్ట్ 7th డాన్ ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇండియా సీనియర్ ఎగ్జామినర్ నాంపల్లి కనకారావు మాట్లాడుతూ సమ్మర్ క్యాంపు నిర్వహించి అందరికీ విద్యని అందజేయాలన్నా మా ఈ ఉద్దేశాన్ని అలాగే మార్షల్ ఆర్ట్స్ విద్యను అభ్యసించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. తదుపరి వివరాల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్ : 98495 28349, 80966 27608
నల్గొండలో కరాటే సమ్మర్ క్యాంపు పోస్టర్ ఆవిష్కరించిన ఈ హీరో సుమన్ తల్వార్ ఈనెల 17వ తేదీన షావలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా వారి సమ్మర్ క్యాంప్ బ్రోచర్ ఆవిష్కరణ కరాటే లెజెండ్ హన్షీ డాక్టర్ సుమన్ తల్వార్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఇలా క్యాంప్ నిర్వహిస్తూ మార్షల్ ఆర్ట్స్ విద్యను ప్రతి ఒక్కరికి అందించాలన్న వారి ప్రయత్నాన్ని అందరూ ఒక అవకాశంగా భావించి ఈ వేసవి సెలవుల్లో కొంత సమయం మార్షల్ ఆర్ట్స్ విద్యకు కేటాయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అలాగే షావలిన్ షోటోఖాన్ వారిని ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నందుకుగాను అభినందించారు. సమ్మర్ క్యాంప్ వివరాలు: ఏప్రిల్ 23 నుండి జూన్ 2 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. క్యాంప్ నిర్వహించు స్థలాలు : 1. ద మాస్టర్ హై స్కూల్ , వివేకానంద విగ్రహం
దగ్గర హైదరాబాద్ రోడ్, నల్గొండ. ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6:00 గంటల వరకు. 2. సందీప్ హై స్కూల్, దేవరకొండ రోడ్, నల్గొండ. ప్రతిరోజు ఉదయం 6:00 నుండి 7:00 గంటల వరకు. 3. సెయింట్ ఆల్ఫన్స్ హై స్కూల్, నల్గొండ. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8:00 గంటల వరకు. 4. శ్రీ చైతన్య హై స్కూల్, అశోక్ నగర్ సాగర్ (X) రోడ్, నల్గొండ. ప్రతిరోజు ఉదయం 8:00 నుండి 9:00 గంటల వరకు. బ్లాక్ బెల్ట్ 7th డాన్ ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇండియా సీనియర్ ఎగ్జామినర్ నాంపల్లి కనకారావు మాట్లాడుతూ సమ్మర్ క్యాంపు నిర్వహించి అందరికీ విద్యని అందజేయాలన్నా మా ఈ ఉద్దేశాన్ని అలాగే మార్షల్ ఆర్ట్స్ విద్యను అభ్యసించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. తదుపరి వివరాల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్ : 98495 28349, 80966 27608
- నల్లగొండ టూ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యలు... మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ రాఘవరావు... నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్తో వివాహం జరిగింది... భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు... ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం,అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు... టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగవంతం... “నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది” అంటూ తీవ్రంగా వేధించినట్లు కేసులో వెల్లడింపు... వేధింపులు తట్టుకోలేక 18-04-2026 ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఐశ్వర్య ఆత్మహత్య.. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు... BNS సెక్షన్లు 95, 108 కింద నేరం నమోదు చేసిన పోలీసులు... నిందితుడు వర్రే లింగయ్య (45)ను ఈరోజు ఉదయం అతని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు... సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచేందుకు రిమాండ్కు తరలింపు.. కోడలిపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక...1
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- Post by Tagore1
- జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు1
- జనగాం జిల్లా:పాలకుర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ను పరిశీలించిన రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- హైదరాబాద్ యూసుఫ్గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీ గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు రాగ సుధ జొన్నాడ (MSc, BEd, MBA) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని “ఉద్యోగాలు/ప్లేస్మెంట్లకు అవసరమైన నైపుణ్యాలు” అనే అంశంపై సమగ్రంగా వివరించారు. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సాధించడానికి అభ్యాస నైపుణ్యాలు (Aptitude), రీజనింగ్, లాజికల్ థింకింగ్తో పాటు బలమైన సాంకేతిక పరిజ్ఞానం (Technical Knowledge) చాలా అవసరమని తెలిపారు. సానుకూల ఆలోచనలు (Positive Thinking) వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా కెరీర్ పురోగతికి కూడా ఎంతో సహాయపడతాయని వివరించారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని అందుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సరైన ఇమెయిల్ ఎటికెట్, డ్రెస్ ఎటికెట్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె సూచించారు. పరీక్షలకు క్రమబద్ధంగా సిద్ధమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఉండే వివిధ రౌండ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో AI టూల్స్ ప్రాముఖ్యతను కూడా వివరించి, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చివరగా, లక్ష్య సాధనలో భాగంగా ప్రాధాన్యతల జాబితా (Priority List) రూపొందించుకోవడం మరియు సమయ నిర్వహణ (Time Management) పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.4
- మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సంక్షేమ వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరిమిట్ట మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు వసతి గృహాల్లో పారిశుధ్యం, ఆరోగ్యం, మైనర్ రిపేర్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.1