కాటారంలో ఎరువుల విక్రయ విధానాలపై అవగాహన సదస్సు........ కాటారం, జూలై 31: ఎరువుల విక్రయాలను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ యాప్ వినియోగంపై కాటారం రైతు వేదికలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి హాజరై, ఎరువుల విక్రయాల్లో అమలు చేయాల్సిన నూతన విధివిధానాలను వివరించారు. ప్రతి ఎరువుల డీలర్ సెంట్రల్ యాప్ను తప్పనిసరిగా వినియోగిస్తూ విక్రయాలు, నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరిగి రైతులకు సకాలంలో అందుబాటు మెరుగుపడుతుందని తెలిపారు. సదస్సులో మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), కాటారం మండలంలోని ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులు సూచించారు.
కాటారంలో ఎరువుల విక్రయ విధానాలపై అవగాహన సదస్సు........ కాటారం, జూలై 31: ఎరువుల విక్రయాలను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ యాప్ వినియోగంపై కాటారం రైతు వేదికలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి హాజరై, ఎరువుల విక్రయాల్లో అమలు చేయాల్సిన నూతన విధివిధానాలను వివరించారు. ప్రతి ఎరువుల డీలర్ సెంట్రల్ యాప్ను తప్పనిసరిగా వినియోగిస్తూ విక్రయాలు, నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరిగి రైతులకు సకాలంలో అందుబాటు మెరుగుపడుతుందని తెలిపారు. సదస్సులో మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), కాటారం మండలంలోని ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులు సూచించారు.
- బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.1
- *ములుగు:* చావుతో పోరాడుతూ అనంతలోకాలకు చేరుకున్న BRS సీనియర్ నాయకుడు, నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.1
- స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.1
- నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు... తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆయన మరణవార్తతో గులాబీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలిస్తుండటంతో.. అశేష జనవాహిని నర్సంపేట వైపు కదలివస్తోంది. తమ ప్రియతమ నాయకుడిని ఆఖరిసారి చూసుకునేందుకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు.నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో వేచి చూస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా తోటి ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అంటూ నర్సంపేట నినాదాలతో మారుమోగుతోంది.2
- జగిత్యాల జిల్లాలో వర్షం ఎఫెక్ట్ తో కూలిన ఇళ్ళు...బాధితులను ఆదుకోవాలని అధికారులను కోరిన జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లోని పెంబట్ల కోనపూర్ గ్రామాలలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మాజీమంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పర్యటించారు. అధిక వర్షానికి కూలిపోయిన ఇళ్ళను పరిశీలించారు. MRO, RDO తో ఫోన్ లో మాట్లాడారు. ఇల్లు పూర్తిగా కూలితే నష్ట పరిహారం ఎంత వస్తుందని అడిగారు. జీవో ప్రకారం ఎంత ఉంటే అంత పూర్తిగా ఇల్లు కూలినందుకు నష్టపరిహారం అందజేయాలని సూచించారు . ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ఇల్లు కూలినందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఇల్లు మంజూరు అయ్యేలా అధికారులతో మాట్లాడి చేపిస్తామని తెలిపారు.4
- సింగరేణి పరిరక్షణకు కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం :BMS గత BRS ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి లో జోక్యం కారణంగా నష్ట పోతుందని bms నాయకులు ఆరోపించారు.1
- విద్యుత్ షార్ట్సర్క్యూట్తో ఫోటోగ్రాఫర్ ఇంట్లో అగ్నిప్రమాదం ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన ఫోటోగ్రాఫర్ చెన్నంరాజు నివాసంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్కు వ్యాపించడంతో పేలుడు చోటుచేసుకుని ఇంట్లోని గృహోపకరణాలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.1