సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ఒక వరంగా మారిందని మాజీ మంత్రి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఏ. చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనారోగ్యానికి గురై సొంత ఖర్చులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు, ఆ బిల్లులను ప్రభుత్వానికి సమర్పించి ఈ సహాయాన్ని పొందవచ్చని ఆయన తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు జహీరాబాద్, న్యాల్కల్, కోహిర్ మరియు ఝరాసంగం మండలాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 11,27,500 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోహిర్ మున్సిపల్ ఛైర్మన్ అశోక్ కుమార్, స్థానిక మండల అధ్యక్షులు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు మరియు సర్పంచులు పాల్గొన్నారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. లబ్ధిదారులలో షైక్ మునీరుద్దీన్, సయ్యద్ కయ్యుమ్, ఎక్కెళ్లి కమలమ్మ, నాగ్ శెట్టి, అజామ్, పోతాల శేఖర్, పూజారి చంద్రకాంత్, గొల్ల శేఖర్, పట్టి శకుంతల, జి. కిష్టయ్య, సయ్యద్ ఆమెర్, మోహ. అమీరుద్దీన్, మ్యాతరి సంగీత, ఎండి. మున్నవార్, తహరి విమలమ్మ, కొత్తూర్ పద్మమ్మ, పోతురాజ్ నవీన్ కుమార్, ముక్కన్నగారి మానమ్మ, హసీనా, గొల్ల పెంటమ్మ, ఎండి. గౌస్, సుల్తాన్ సుమిత్రమ్మ, బండమిది కనకరాజు మరియు ఎస్పీ. సంతోష్ ఉన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ఒక వరంగా మారిందని మాజీ మంత్రి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఏ. చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనారోగ్యానికి గురై సొంత ఖర్చులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు, ఆ బిల్లులను ప్రభుత్వానికి సమర్పించి ఈ సహాయాన్ని పొందవచ్చని ఆయన తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు జహీరాబాద్, న్యాల్కల్, కోహిర్ మరియు ఝరాసంగం మండలాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 11,27,500 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోహిర్ మున్సిపల్ ఛైర్మన్ అశోక్ కుమార్, స్థానిక మండల అధ్యక్షులు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు మరియు సర్పంచులు పాల్గొన్నారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. లబ్ధిదారులలో షైక్ మునీరుద్దీన్, సయ్యద్ కయ్యుమ్, ఎక్కెళ్లి కమలమ్మ, నాగ్ శెట్టి, అజామ్, పోతాల శేఖర్, పూజారి చంద్రకాంత్, గొల్ల శేఖర్, పట్టి శకుంతల, జి. కిష్టయ్య, సయ్యద్ ఆమెర్, మోహ. అమీరుద్దీన్, మ్యాతరి సంగీత, ఎండి. మున్నవార్, తహరి విమలమ్మ, కొత్తూర్ పద్మమ్మ, పోతురాజ్ నవీన్ కుమార్, ముక్కన్నగారి మానమ్మ, హసీనా, గొల్ల పెంటమ్మ, ఎండి. గౌస్, సుల్తాన్ సుమిత్రమ్మ, బండమిది కనకరాజు మరియు ఎస్పీ. సంతోష్ ఉన్నారు.
- మెదక్ జిల్లా రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్లో శనివారం ప్రయాణికుల సహనం పరీక్షకు గురైంది. సమయానికి బస్సులు రాకపోవడంతో గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో ఆగ్రహించిన ప్రయాణికులు మొదట బస్టాండ్ ప్రాంగణంలోనే ధర్నాకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచూ బస్సులు ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బస్సులను సమయపాలనతో నడిపించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.1
- తెలంగాణలో కరువు వస్తున్న నేపథ్యంలో పంటలకు, రైతులకు నీళ్ళు ఎలా అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద సమాధానం ఇచ్చారు. ఏముంది వాళ్ళను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు.1
- సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని బొల్లారం ప్రాంతంలో ప్రస్తుతం ఓటర్ల ప్రత్యేక పరిశీలన (SIR – Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు (BLOs) ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. అయితే, చాలా మందికి ఈ ఫారం ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఫారాలను అందుకున్న ఓటర్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. బీఎల్ఓల నుంచి ఫారం అందుకున్న రెండు రోజుల్లోపు దానిని పూర్తిగా పూర్తి చేసి తిరిగి వారికే అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే సహాయం అందుబాటులో ఉంది. దీని కోసం బొల్లారంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లేదా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాలను సంప్రదించి సహాయం పొందవచ్చు.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలో బయోటెక్ పరిశ్రమ కోసం టాప్సే (Topse) సంస్థ తన అధునాతన టర్న్కీ ప్రాసెస్ సొల్యూషన్స్ను ప్రదర్శించింది.1
- కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో వర్షాల కోసం రైతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ సంతోష్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రామంలోని ప్రతి రైతు నిండు కుండలతో నీటిని తీసుకువచ్చి, ఊరిలోని దేవతలకు ఆ నీటిని పోస్తూ వర్షాలు కురవాలని వేడుకున్నారు. వర్షం కోసం పుల్కల్ గ్రామంలోనే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాలు కురిస్తేనే అన్నదాతలు ఆనందంగా ఉంటారని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు.1
- తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.1
- చిలిపిచేడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలోని ఎరువుల దుకాణాన్ని ఎమ్మార్వో శివప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా బస్తాల పంపిణీ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించాలని, పంపిణీలో పారదర్శకత పాటిస్తూ ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని డీలర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల కోసం వచ్చిన రైతులతో మాట్లాడిన ఎమ్మార్వో, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ఫారాలు నింపి ఓటరు వివరాలను సరిచేసుకోవాలని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.1
- వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పేకాట స్థావరంపై దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేక ముక్కలతో పాటు రూ. 35,570 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లాలో పేకాట, జూదం వంటి ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ బృందం నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.1