చేనేత పథకాల అమలులో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం నేతన్న భరోసా, నేతన్న పొదుపు బకాయి నిధులను వెంటనే విడుదల చెయ్యాలి మోత్కూర్ మండలం పాలడుగు గ్రామంలో చేనేత కార్మికులతో కలసి గుండు వెంకటనర్సు మాట్లాడుతూ...గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న పొదుపు పథకం ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నప్పటికి, అమలులో జాప్యం చేస్తుందని, చేనేతకార్మికులకు వచ్చిన వేతనంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కార్మికులు పొదుపు ఖాతా RD వన్ బ్యాంకు ఖాతల్లో జమ చేస్తున్నప్పటికి, ప్రభుత్వం జమ చేయవలసిన RD టూ నిధులను సంవత్సర కాలంగా బ్యాంకు ఖాతల్లో జమచేయకుండా కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు నేతన్న భరోసా క్రింద, ప్రతినెల నేత కార్మికునికి నెలకు రూ 2000లు అనుబంధ కార్మికునికి వెయ్యి చొప్పున వారి ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించి, ఏడాదికి నాలుగు విడతల్లో అమలు చేస్తామని, ఇప్పటి వరకు కేవలం ఒక్క విడత డబ్బులు నేతకార్మికునికి రూ 4500/లు అనుబంధ కార్మికునికి రూ 1500 లు మాత్రమే కార్మికుల ఖాతల్లో జమ చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నేతన్న భరోసా, నేతన్న పొదుపు లకు సంబంధించిన బకాయి నిధులను విడుదలచేసి కార్మికులు ఖాతల్లో జమ చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు జెల్ల నాందేవ్, వడ్డేపల్లి లక్ష్మణ్, జెల్ల సత్యనారాయణ, చింతకింది సోమరాజు పాల్గొన్నారు.
చేనేత పథకాల అమలులో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం నేతన్న భరోసా, నేతన్న పొదుపు బకాయి నిధులను వెంటనే విడుదల చెయ్యాలి మోత్కూర్ మండలం పాలడుగు గ్రామంలో చేనేత కార్మికులతో కలసి గుండు వెంకటనర్సు మాట్లాడుతూ...గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న పొదుపు పథకం ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నప్పటికి, అమలులో జాప్యం చేస్తుందని, చేనేతకార్మికులకు వచ్చిన వేతనంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కార్మికులు పొదుపు ఖాతా RD వన్ బ్యాంకు ఖాతల్లో జమ చేస్తున్నప్పటికి, ప్రభుత్వం జమ చేయవలసిన RD టూ నిధులను సంవత్సర కాలంగా బ్యాంకు ఖాతల్లో జమచేయకుండా కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు నేతన్న భరోసా క్రింద, ప్రతినెల నేత కార్మికునికి నెలకు రూ 2000లు అనుబంధ కార్మికునికి వెయ్యి చొప్పున వారి ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించి, ఏడాదికి నాలుగు విడతల్లో అమలు చేస్తామని, ఇప్పటి వరకు కేవలం ఒక్క విడత డబ్బులు నేతకార్మికునికి రూ 4500/లు అనుబంధ కార్మికునికి రూ 1500 లు మాత్రమే కార్మికుల ఖాతల్లో జమ చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నేతన్న భరోసా, నేతన్న పొదుపు లకు సంబంధించిన బకాయి నిధులను విడుదలచేసి కార్మికులు ఖాతల్లో జమ చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు జెల్ల నాందేవ్, వడ్డేపల్లి లక్ష్మణ్, జెల్ల సత్యనారాయణ, చింతకింది సోమరాజు పాల్గొన్నారు.
- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.1
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- భారత దేశంలో 5 శక్తి పీఠాలలో ఒకటిగా మన ఆలేరు నియోజకవర్గం లోని కొలనుపాక కోటిలింగాల శివుడు భారతదేశంలోనే ఐదు శివశక్తి పీఠాలు అందులో ఒకటిగా మన భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాక లో ఉన్న కోటిలింగాల శివుడు ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి1
- భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.1