భద్రాచలానికి పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల పొంచి ఉన్న ముంపు ముప్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వీడి వాస్తవాలను ప్రజల ముందుంచాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాచలంలోని సీపీఐ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రవికుమార్ మాట్లాడారు. గోదావరి ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారీ అధికార యంత్రాంగం హడావుడి చేయడం, వరదలు తగ్గగానే సమస్యను గాలికొదిలేయడం పరిపాటిగా మారిందని వారు తీవ్రంగా విమర్శించారు. రాబోయే వరదలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కదిలి ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంతో భద్రాచలం, పరిసర ప్రాంతాలకు ఎంతమేర ముంపు ప్రమాదం ఉందనే అంశంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, శాస్త్రీయ నివేదికలు, బ్యాక్వాటర్ లెక్కలను దాచిపెట్టకుండా బహిర్గతం చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం నెట్టడం మాని శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్చరించారు. వరదల నుంచి భద్రాచలాన్ని రక్షించాల్సిన కరకట్ట నిర్మాణం అసంపూర్తిగా ఉండటం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమన్న నాయకులు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, పట్టణం నుంచి మారుమూల ఏజెన్సీ గ్రామాల వరకు నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, గిరిజన గ్రామాలు విషజ్వరాల గుప్పిట్లో చిక్కుకున్న తర్వాత వైద్య బృందాలను పరుగులు పెట్టించడం కాకుండా ముందస్తుగానే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వొద్దని, కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న పనుల్లో రాజీకి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు నరాటి ప్రసాద్, కంచర్ల జమలయ్య, కంభం మెట్టు శ్రీను, మా రెడ్డి శివాజీ, మీసాల భాస్కరరావు, ఎస్వీఎస్ నాయుడు, భద్రాద్రి వెంకటేశ్వరరావు, మహేష్, సాధన పల్లి సతీష్, వేణు, గుంజ రామారావు, సత్తినేడు సాయిరాం, రుద్ర బ్రదర్స్, చింతల రామరాజు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలానికి పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల పొంచి ఉన్న ముంపు ముప్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వీడి వాస్తవాలను ప్రజల ముందుంచాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాచలంలోని సీపీఐ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రవికుమార్ మాట్లాడారు. గోదావరి ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారీ అధికార యంత్రాంగం హడావుడి చేయడం, వరదలు తగ్గగానే సమస్యను గాలికొదిలేయడం పరిపాటిగా మారిందని వారు తీవ్రంగా విమర్శించారు. రాబోయే వరదలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కదిలి ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంతో భద్రాచలం, పరిసర ప్రాంతాలకు ఎంతమేర ముంపు ప్రమాదం ఉందనే అంశంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, శాస్త్రీయ నివేదికలు, బ్యాక్వాటర్ లెక్కలను దాచిపెట్టకుండా బహిర్గతం చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం నెట్టడం మాని శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్చరించారు. వరదల నుంచి భద్రాచలాన్ని రక్షించాల్సిన కరకట్ట నిర్మాణం అసంపూర్తిగా ఉండటం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమన్న నాయకులు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, పట్టణం నుంచి మారుమూల ఏజెన్సీ గ్రామాల వరకు నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, గిరిజన గ్రామాలు విషజ్వరాల గుప్పిట్లో చిక్కుకున్న తర్వాత వైద్య బృందాలను పరుగులు పెట్టించడం కాకుండా ముందస్తుగానే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వొద్దని, కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న పనుల్లో రాజీకి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు నరాటి ప్రసాద్, కంచర్ల జమలయ్య, కంభం మెట్టు శ్రీను, మా రెడ్డి శివాజీ, మీసాల భాస్కరరావు, ఎస్వీఎస్ నాయుడు, భద్రాద్రి వెంకటేశ్వరరావు, మహేష్, సాధన పల్లి సతీష్, వేణు, గుంజ రామారావు, సత్తినేడు సాయిరాం, రుద్ర బ్రదర్స్, చింతల రామరాజు తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని, ఆ పార్టీకి 117 అసెంబ్లీ స్థానాలు కాదు కదా కనీసం 7 స్థానాలు కూడా రావని స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడించి, మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడం పక్కా అని ధీమా వ్యక్తమవుతోంది.1
- తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు. అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్లో హైదరాబాద్కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.4
- ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం రేవంత్, కేటీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపాలని కేటీఆర్ కోరుతున్నారని, ఆయన కన్నెపల్లి వెళ్ళిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రేవంత్ హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే మేడిగడ్డ కట్ట తెగిపోయి, భద్రాచలం ప్రాంతమే ఉండదని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీనివల్ల 44 గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాద్రి రాముడే లేకుండా పోతారని పేర్కొన్నారు. కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భద్రాచలాన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.3
- ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పర్వతమ్మగూడెం గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని, గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా మరియు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుందో వివరించి అవగాహన కల్పించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. గ్రామ భద్రతలో, నేరాల నియంత్రణలో మరియు నేరస్థుల గుర్తింపులో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ ధరిస్తామని మరియు గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు చేయించారు. గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలుపుతూ, ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్కు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.1
- భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి JVR OCP సమీపంలో HMS కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి, నూతన కార్యాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.1