*ఒక్క రోజు శిశువుకు అపోలో హాస్పిటల్ లో అరుదైన మెదడు శస్త్ర చికిత్స విజయవంతం* _*- నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అద్భుతం*_ _*- ఒక్క రోజు వయస్సున్న శిశువుకు అత్యంత అరుదైన మెదడు శస్త్ర చికిత్స*_ _*- న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహణ*_ _*- నెల్లూరు నగర చరిత్రలో ఇలాంటి అరుదైన ఆపరేషన్ ఇదే మొదటి సారి*_ _*- పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయిన ఒక్క రోజు వయస్సున్న శిశువు*_ _*- వివరాలు వెల్లడించిన న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ ఆయన బృందం*_ నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అద్భుతం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక్క రోజు వయస్సున్న శిశువుకు అత్యంత అరుదైన మెదడు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మను ప్రసాదించారు. నగరంలోని మరో ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం జరిగిన సమయంలో శిశువుకు మెదడు కుడి భాగంలో భారీగా రక్తస్రావం జరిగింది. దీని వల్ల శిశువుకు ఫిట్స్ (Convulsions), స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆ శిశువును తల్లిదండ్రులు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. CT స్కాన్ పరీక్షల్లో మెదడులోని కీలక భాగాలపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు తేలింది. చికిత్స చేయకపోతే పక్షవాతం రావడం, వెంటిలేటర్పై ఆధారపడటం లేదా మరణం సంభవించే అవకాశం ఉంది. ఆ క్లిష్ట స్థితిలో శిశువును వేరే నగరానికి తరలించడం కూడా ప్రాణాపాయమని వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇంత చిన్న వయసులో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్య నిపుణులు చెబుతుంటారు. తక్షణం మెదడుకు శస్త్ర చికిత్స చేయాలని న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ తల్లిదండ్రులకు తెలియజేయగా వారి అంగీకారంతో నెల్లూరు నగరంలోనే మొదటి సారిగా ఒక్క రోజు వయస్సున్న శిశువుకు '' డీకంప్రెసివ్ క్రానియెక్టమీ '' (Decompressive Craniectomy) మరియు మెదడులో పేరుకుపోయిన రక్తపు గడ్డలను తొలగించే శస్త్రచికిత్సను న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ మరియు ఆయన బృందం విజయవంతంగా నిర్వహించారు. సర్జరీ సమయంలో రక్త నష్టం, గుండె సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ, పీడియాట్రిషియన్లు మరియు అనస్థీషియా నిపుణుల సహకారంతో ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. దీనిపై అపోలో హాస్పిటల్ లో గురువారం న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ ఆయన బృందం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. సర్జరీ అనంతరం శిశువును క్రమంగా వెంటిలేటర్ నుండి తొలగించామని, ప్రస్తుతం బాబు చురుగ్గా ఉన్నాడని, తల్లి పాలు తాగుతున్నాడని, ఎటువంటి పక్షవాత లక్షణాలు లేవని తెలిపారు. ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశామన్నారు. ఈ చికిత్సలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి,పీడియాట్రిషియన్లు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ భరత్, అనస్థీషియా విభాగం హెడ్ డాక్టర్ రాజ మోహన్ రెడ్డి మరియు వారి బృందం కీలక పాత్ర పోషించారని డాక్టర్ వెంకట్ వెల్లడించారు. మరో వైపు తమ బిడ్డ ప్రాణాలతో తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్య బృందానికి జీవిత కాలం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు.
*ఒక్క రోజు శిశువుకు అపోలో హాస్పిటల్ లో అరుదైన మెదడు శస్త్ర చికిత్స విజయవంతం* _*- నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అద్భుతం*_ _*- ఒక్క రోజు వయస్సున్న శిశువుకు అత్యంత అరుదైన మెదడు శస్త్ర చికిత్స*_ _*- న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహణ*_ _*- నెల్లూరు నగర చరిత్రలో ఇలాంటి అరుదైన ఆపరేషన్ ఇదే మొదటి సారి*_ _*- పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయిన ఒక్క రోజు వయస్సున్న శిశువు*_ _*- వివరాలు వెల్లడించిన న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ ఆయన బృందం*_ నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అద్భుతం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక్క రోజు వయస్సున్న శిశువుకు అత్యంత అరుదైన మెదడు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మను ప్రసాదించారు. నగరంలోని మరో ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం జరిగిన సమయంలో శిశువుకు మెదడు కుడి భాగంలో భారీగా రక్తస్రావం జరిగింది. దీని వల్ల శిశువుకు ఫిట్స్ (Convulsions), స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆ శిశువును తల్లిదండ్రులు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. CT స్కాన్ పరీక్షల్లో మెదడులోని కీలక భాగాలపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు తేలింది. చికిత్స చేయకపోతే పక్షవాతం రావడం, వెంటిలేటర్పై ఆధారపడటం లేదా మరణం సంభవించే అవకాశం ఉంది. ఆ క్లిష్ట స్థితిలో శిశువును వేరే నగరానికి తరలించడం కూడా ప్రాణాపాయమని వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇంత చిన్న వయసులో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్య నిపుణులు చెబుతుంటారు. తక్షణం మెదడుకు శస్త్ర చికిత్స చేయాలని న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ తల్లిదండ్రులకు తెలియజేయగా వారి అంగీకారంతో నెల్లూరు నగరంలోనే మొదటి సారిగా ఒక్క రోజు వయస్సున్న శిశువుకు '' డీకంప్రెసివ్ క్రానియెక్టమీ '' (Decompressive Craniectomy) మరియు మెదడులో పేరుకుపోయిన రక్తపు గడ్డలను తొలగించే శస్త్రచికిత్సను న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ మరియు ఆయన బృందం విజయవంతంగా నిర్వహించారు. సర్జరీ సమయంలో రక్త నష్టం, గుండె సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ, పీడియాట్రిషియన్లు మరియు అనస్థీషియా నిపుణుల సహకారంతో ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. దీనిపై అపోలో హాస్పిటల్ లో గురువారం న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ ఆయన బృందం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. సర్జరీ అనంతరం శిశువును క్రమంగా వెంటిలేటర్ నుండి తొలగించామని, ప్రస్తుతం బాబు చురుగ్గా ఉన్నాడని, తల్లి పాలు తాగుతున్నాడని, ఎటువంటి పక్షవాత లక్షణాలు లేవని తెలిపారు. ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశామన్నారు. ఈ చికిత్సలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి,పీడియాట్రిషియన్లు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ భరత్, అనస్థీషియా విభాగం హెడ్ డాక్టర్ రాజ మోహన్ రెడ్డి మరియు వారి బృందం కీలక పాత్ర పోషించారని డాక్టర్ వెంకట్ వెల్లడించారు. మరో వైపు తమ బిడ్డ ప్రాణాలతో తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్య బృందానికి జీవిత కాలం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు.
- ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి1
- వైయస్ఆర్సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ.....1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- Post by Syyed taher1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కూలీలు, మేటీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీ రూ. 600 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- Post by Bondhu Suresh1
- ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1