నల్గొండ మండలం నర్సింగ్ భట్ల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్” కార్యక్రమం...... నల్గొండ మండలం నర్సింగ్ భట్ల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్” కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత మరియు ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. గ్రామంలో తాగునీటి సమస్యలు, రోడ్ల మరమ్మతులు, పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజలు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని గ్రామ పెద్దలు సూచించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని బస్ స్టాప్ పరిసరాలు, ప్రధాన వీధులు మరియు ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది స్వయంగా చెత్తను తొలగించి, ఊడ్చి పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. పరిశుభ్రమైన గ్రామం ఉంటేనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టిన ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా నర్సింగ్ భట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండ మండలం నర్సింగ్ భట్ల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్” కార్యక్రమం...... నల్గొండ మండలం నర్సింగ్ భట్ల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్” కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత మరియు ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. గ్రామంలో తాగునీటి సమస్యలు, రోడ్ల మరమ్మతులు, పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజలు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని గ్రామ పెద్దలు సూచించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని బస్ స్టాప్ పరిసరాలు, ప్రధాన వీధులు మరియు ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది స్వయంగా చెత్తను తొలగించి, ఊడ్చి పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. పరిశుభ్రమైన గ్రామం ఉంటేనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టిన ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా నర్సింగ్ భట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ హైదరాబాద్ రోడ్డులోని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం... అతివేగంతో దూసుకొచ్చిన కారు... ప్రమాదంలో ఓ మహిళా, ఓ యువకుడు ప్రాణాపాయస్థితిలో... ద్విచక్ర వాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిపై దూసుకెళ్లిన కారు... మున్సిపల్ మహిళా కార్మికురాలి రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం.. స్కూటీపై వెళ్తున్న యువకుడికి తలకు తీవ్ర గాయం.. యువకుడి పరిస్థితి ప్రాణాపాయంగా ఉన్నట్లు సమాచారం.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.. ద్విచక్ర వాహనదారుడికి సీరియస్ కావడంతో ఐకాన్ హాస్పిటల్కు తరలింపు.. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపణ.. కారు డ్రైవర్ని అదుపులో తీసుకొని విచారిస్తున్న టూ టౌన్ పోలీసులు... *ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.*3
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్! బాధితుల కోసం దీక్ష..కవితను, విశారదన్ మహరాజ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.దీక్షలో ఆమెతో పాటు డీఎస్సీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ మరియు ఇతర ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా దీక్ష కొనసాగించిన వీరిని, మంగళవారం ఉదయం పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు వీరిని హైదరాబాద్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.1
- వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.1
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్హౌస్ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మల్లన్నసాగర్కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Termites existence, not to be ignored, love your home.1
- రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగిస్తున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి*_1