*మున్సిపల్ అభివృద్ధికి పెద్దపీట: రూ. 158 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపల్ బడ్జెట్ ప్రతిపాదనలు పత్రికా ప్రకటన మార్చి 31, 2026_ఆదిలాబాదు: * పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించి, మొత్తం రూ. 157.97 కోట్లతో (సుమారు రూ. 158 కోట్లు) అంచనా ఆదాయ వ్యయాలకు కౌన్సిల్ ఆమోదంతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పురోభివృద్ధిలో బడ్జెట్ అత్యంత కీలకమని, గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నామో సమీక్షించుకుంటూ, కొత్త సంవత్సరానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అమృత్ పథకం కాలపరిమితిని మరో ఏడాది పొడిగించినట్లు, దీని ద్వారా పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, మంచినీటి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా కార్మికుల జీతాలు, వాహనాల నిర్వహణ కోసం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించినట్లు వివరించారు. గ్రీన్ బడ్జెట్ కింద మున్సిపల్ చట్టం ప్రకారం 10% నిధులను పచ్చదనం పెంచడానికి కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వ గ్రాంట్లు, మున్సిపల్ సొంత ఆదాయం మధ్య సమతుల్యత పాటిస్తూ పారదర్శకమైన బడ్జెట్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిల్ సభ్యులు బడ్జెట్ అంశాలపై చర్చించి, వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక అమలులో వార్డు కౌన్సిలర్లు చురుకైన పాత్ర పోషించాలని, జిల్లా యంత్రాంగం తరపున మున్సిపాలిటీకి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, వార్డుల వారీగా వెనుకబడిన ప్రాంతాలు, విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు స్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నామని, మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ వనరులైన ఆస్తి పన్ను, నల్లా పన్ను ఖాళీ స్థలాల పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అందరి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ రోహిత్, వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
*మున్సిపల్ అభివృద్ధికి పెద్దపీట: రూ. 158 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపల్ బడ్జెట్ ప్రతిపాదనలు పత్రికా ప్రకటన మార్చి 31, 2026_ఆదిలాబాదు: * పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించి, మొత్తం రూ. 157.97 కోట్లతో (సుమారు రూ. 158 కోట్లు) అంచనా ఆదాయ వ్యయాలకు కౌన్సిల్ ఆమోదంతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పురోభివృద్ధిలో బడ్జెట్ అత్యంత కీలకమని, గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నామో సమీక్షించుకుంటూ, కొత్త సంవత్సరానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మున్సిపాలిటీ
ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అమృత్ పథకం కాలపరిమితిని మరో ఏడాది పొడిగించినట్లు, దీని ద్వారా పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, మంచినీటి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా కార్మికుల జీతాలు, వాహనాల నిర్వహణ కోసం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించినట్లు వివరించారు. గ్రీన్ బడ్జెట్ కింద మున్సిపల్ చట్టం ప్రకారం 10% నిధులను పచ్చదనం పెంచడానికి కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వ గ్రాంట్లు, మున్సిపల్ సొంత ఆదాయం మధ్య సమతుల్యత పాటిస్తూ పారదర్శకమైన బడ్జెట్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిల్ సభ్యులు బడ్జెట్ అంశాలపై చర్చించి, వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ప్రజాపాలన - ప్రగతి
ప్రణాళిక అమలులో వార్డు కౌన్సిలర్లు చురుకైన పాత్ర పోషించాలని, జిల్లా యంత్రాంగం తరపున మున్సిపాలిటీకి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, వార్డుల వారీగా వెనుకబడిన ప్రాంతాలు, విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు స్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నామని, మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ వనరులైన ఆస్తి పన్ను, నల్లా పన్ను ఖాళీ స్థలాల పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అందరి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ రోహిత్, వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- చండీయాగాన్నికీ భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి హోమం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యగలరని పిలుపునిస్తున్న చండీ యాగం నిర్వాహకులు శ్రీ కృష్ణ స్వామి గారు... పాత ఉట్నూర్ 16వ వార్డు సభ్యులు టెకం.రేఖ2
- నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే రమేష్ (టీచర్) పదవి విరమణ సందర్భంగా ఆయన నివాసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరై టీచర్ రమేష్ ని శాలువాతో సన్మానించి వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.1
- లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుండి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.1
- Post by Solanke Ravi4
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సీపీఎం నేతలు అంతర్జాతీయ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, యుద్ధం వెంటనే ఆపి శాంతి చర్చలు ప్రారంభించాలని కోరారు. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత్ వంటి దేశాలు దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.2
- Attapur Police arrested four youths for performing dangerous bike stunts and rash driving near Aramghar Road on March 27, 2026. A case has been registered under relevant BNS and MV Act sections. The accused were produced before the court and remanded to judicial custody on March 31, 2026.1
- *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి* కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు4
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అర్ధరాత్రి భారీ వర్షం దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జన్నారం, పలు గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావతమైంది. ఉరుములు, మెరుపులు భారీ ఈదురుగాళ్లతో వర్షం పడుతోంది. దీంతో చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు అరగంటకు పైగా భారీ ఈదురుగాలులతో వర్షం పడినట్టు సమాచారం అందుతుంది..మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. నష్టం వివరాలు ఇంకా అందాల్సి ఉంది.1