భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు రైతులకు సాగు పెట్టుబడికి అవసరమైన ఆర్థిక తోడ్పాటును సకాలంలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. రైతులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగు పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం విడతల వారీగా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,78,828 మంది రైతుల ఖాతాల్లో రూ.318.42 కోట్ల నిధులను జమ చేయడం ద్వారా ఈ పంపిణీ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఈ నిధుల పంపిణీని ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకింగ్ శాఖల సమన్వయంతో పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా, రైతు బీమా, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, సాగునీటి సౌకర్యాల కల్పన వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సాగు పెట్టుబడిపై ఆర్థిక భరోసా కల్పించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో జమయ్యే నిధులను బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ బకాయిలు, సేవా ఛార్జీలు లేదా ఇతర బకాయిల పేరుతో నిలుపుదల చేయడం, డెబిట్ చేయడం లేదా సర్దుబాటు చేయరాదని కలెక్టర్ అంకిత్ బ్యాంకు అధికారులను కఠినంగా ఆదేశించారు. ప్రభుత్వం రైతుల సాగు పెట్టుబడి కోసం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం పూర్తి మొత్తంలో రైతుల వినియోగానికి అందుబాటులో ఉండేలా అన్ని బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు భరోసా నిధులపై ఎలాంటి అనధికారిక కోతలు విధించకుండా, ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని రైతులకు పూర్తిగా అందేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు రైతులకు సాగు పెట్టుబడికి అవసరమైన ఆర్థిక తోడ్పాటును సకాలంలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. రైతులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగు పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం విడతల వారీగా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,78,828 మంది రైతుల ఖాతాల్లో రూ.318.42 కోట్ల నిధులను జమ చేయడం ద్వారా ఈ పంపిణీ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఈ నిధుల పంపిణీని ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకింగ్ శాఖల సమన్వయంతో పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా, రైతు బీమా, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, సాగునీటి సౌకర్యాల కల్పన వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సాగు పెట్టుబడిపై ఆర్థిక భరోసా కల్పించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో జమయ్యే నిధులను బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ బకాయిలు, సేవా ఛార్జీలు లేదా ఇతర బకాయిల పేరుతో నిలుపుదల చేయడం, డెబిట్ చేయడం లేదా సర్దుబాటు చేయరాదని కలెక్టర్ అంకిత్ బ్యాంకు అధికారులను కఠినంగా ఆదేశించారు. ప్రభుత్వం రైతుల సాగు పెట్టుబడి కోసం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం పూర్తి మొత్తంలో రైతుల వినియోగానికి అందుబాటులో ఉండేలా అన్ని బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు భరోసా నిధులపై ఎలాంటి అనధికారిక కోతలు విధించకుండా, ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని రైతులకు పూర్తిగా అందేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
- తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని, ఆ పార్టీకి 117 అసెంబ్లీ స్థానాలు కాదు కదా కనీసం 7 స్థానాలు కూడా రావని స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడించి, మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడం పక్కా అని ధీమా వ్యక్తమవుతోంది.1
- తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు. అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్లో హైదరాబాద్కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.4
- ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం రేవంత్, కేటీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపాలని కేటీఆర్ కోరుతున్నారని, ఆయన కన్నెపల్లి వెళ్ళిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రేవంత్ హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే మేడిగడ్డ కట్ట తెగిపోయి, భద్రాచలం ప్రాంతమే ఉండదని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీనివల్ల 44 గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాద్రి రాముడే లేకుండా పోతారని పేర్కొన్నారు. కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భద్రాచలాన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.3
- ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పర్వతమ్మగూడెం గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని, గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా మరియు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుందో వివరించి అవగాహన కల్పించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. గ్రామ భద్రతలో, నేరాల నియంత్రణలో మరియు నేరస్థుల గుర్తింపులో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ ధరిస్తామని మరియు గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు చేయించారు. గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలుపుతూ, ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్కు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.1
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహన్ రావు (గాంధి) వైఎస్సార్సీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జగన్ మోహన్ రెడ్డి కుట్రలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఒక మంచి ఆలోచనతో దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, ఆ అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని రామ మోహన్ రావు పేర్కొన్నారు. కుల రాజకీయాలు, మత రాజకీయాలను ప్రేరేపించి, గ్రామ స్థాయి వరకు అల్లర్లు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని, హద్దులు దాటి పరుష పదజాలంతో ఎదుటి వ్యక్తులను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూనే, ప్రతిపక్షాలు చేస్తున్న కుల, మత రాజకీయాలను ఎండగట్టాలని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.1
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి JVR OCP సమీపంలో HMS కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి, నూతన కార్యాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.1