సమానత్వపు దిక్సూచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా LLM డిపార్టుమెంటు విద్యార్థుల ఆధ్వర్యంలో ఘన నివాళి మరియు నేను - రాజ్యాంగం పుస్తకాల పంపిణి... అంబేద్కర్ జయంతి సందర్భంగా sk యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట అంబేద్కర్, బుద్ధుడు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా విష్వక్సేన వినోద్ గారు రాసిన నేను - రాజ్యాంగం అనే పుస్తకం ను విద్యార్థులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా LLM విద్యార్థులు అబ్బాస్ మరియు హరిత మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని, ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నా, అవాంతరాలను దాటుకుని విజ్ఞానం ఒక్కటే మార్గమని పట్టుదలతో కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డాక్టరేట్ పట్టాలు పొందారు అని అదే క్రమంలో తన యొక్క విజ్ఞానం ఈ దేశ ప్రజానీకానికి ఉపయోగపడాలని అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక అసమానతలు లేకుండా ప్రజాస్వామ్య బద్ధమైన వ్యవస్థలో ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ కలిగిందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే అని అన్నారు. ఈరోజు భారత ప్రజాస్వామ్యం వ్యవస్థలో నిమ్న వర్గాల ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారన్నా లేదా వ్యవస్థలో మాట్లాడుతున్నారన్నా ఆ చైతన్యం కేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వల్లనే అన్నారు. అంబేద్కర్ కేవలం నిమ్న వర్గాలకు మాత్రమే కాకుండా బహుజనులు, శ్రామికులు, మహిళల కోసం పోరాడారు అన్నారు. హిందూ కోడ్ బిల్లు కోసం ఆయన మంత్రి పదవికే రాజీనామా చేశారని వారు పేర్కొన్నారు. కావున అంబేద్కర్ స్ఫూర్తితో యువత పోరాటం చేయాలని, సమాన రాజకీయ స్వేచ్ఛను, విద్య, ఉపాధి హక్కులందరికి కలిగే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరింత అవగాహన చేసుకుని సవర్ధవంతమైన సమాన హక్కుల సమాధానంగా ప్రతి విద్యార్థి ఎదిగినప్పుడే అంబేద్కర్ కి ఘనమైన నివాళిని అన్నారు ఈ కార్యక్రమంలో గోపాల్, అన్వర్, జబివూల్లా మరియు యూనివర్సిటీ విద్యార్పాతులు పాల్గొన్నారు.
సమానత్వపు దిక్సూచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా LLM డిపార్టుమెంటు విద్యార్థుల ఆధ్వర్యంలో ఘన నివాళి మరియు నేను - రాజ్యాంగం పుస్తకాల పంపిణి... అంబేద్కర్ జయంతి సందర్భంగా sk యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట అంబేద్కర్, బుద్ధుడు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా విష్వక్సేన వినోద్ గారు రాసిన నేను - రాజ్యాంగం అనే పుస్తకం ను విద్యార్థులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా LLM విద్యార్థులు అబ్బాస్ మరియు హరిత మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని, ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నా, అవాంతరాలను దాటుకుని విజ్ఞానం ఒక్కటే మార్గమని పట్టుదలతో కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డాక్టరేట్ పట్టాలు పొందారు అని అదే క్రమంలో తన యొక్క విజ్ఞానం ఈ దేశ ప్రజానీకానికి ఉపయోగపడాలని అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక అసమానతలు లేకుండా ప్రజాస్వామ్య బద్ధమైన వ్యవస్థలో ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ కలిగిందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే అని అన్నారు. ఈరోజు భారత ప్రజాస్వామ్యం వ్యవస్థలో నిమ్న వర్గాల ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారన్నా లేదా వ్యవస్థలో మాట్లాడుతున్నారన్నా ఆ చైతన్యం కేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వల్లనే అన్నారు. అంబేద్కర్ కేవలం నిమ్న వర్గాలకు మాత్రమే కాకుండా బహుజనులు, శ్రామికులు, మహిళల కోసం పోరాడారు అన్నారు. హిందూ కోడ్ బిల్లు కోసం ఆయన మంత్రి పదవికే రాజీనామా చేశారని వారు పేర్కొన్నారు. కావున అంబేద్కర్ స్ఫూర్తితో యువత పోరాటం చేయాలని, సమాన రాజకీయ స్వేచ్ఛను, విద్య, ఉపాధి హక్కులందరికి కలిగే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరింత అవగాహన చేసుకుని సవర్ధవంతమైన సమాన హక్కుల సమాధానంగా ప్రతి విద్యార్థి ఎదిగినప్పుడే అంబేద్కర్ కి ఘనమైన నివాళిని అన్నారు ఈ కార్యక్రమంలో గోపాల్, అన్వర్, జబివూల్లా మరియు యూనివర్సిటీ విద్యార్పాతులు పాల్గొన్నారు.
- వైయస్ఆర్సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ.....1
- ✒️- ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్కు రైలు ఎక్కాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు. ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు1
- Post by Bondhu Suresh1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే టిడిపి విధానం - కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు. - మలి విడతగా నేడు 67 అన్న క్యాంటీన్ల ప్రారంభం. - అన్న క్యాంటీన్లు రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తున్నాయి. - గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసింది. - కోవూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీకి పునాది అని, ఆ ఆశయ సాధనలో భాగంగానే పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. అన్న క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి అక్కడే భోజనం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నాడు అన్న ఎన్టీఆర్ ఇచ్చిన కూడు, గూడు, గుడ్డ నినాదమే నేడు పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్ఫూర్తినిచ్చిందన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వీటిని పునరుద్ధరించి రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు.కోవూరులో అన్నా క్యాంటీన్ లేదని గతంలో చాలా బాధపడేదానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో నేడు ఇక్కడ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాల నుంచి ఆసుపత్రి పనుల కోసం, ఇతర అవసరాల కోసం కోవూరు వచ్చే పేదలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సేవలో ముందుంటానని ఆమె స్పష్టం చేశారు. తనకు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.4
- ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley1