Shuru
Apke Nagar Ki App…
పర్వతాపూర్లో మొక్కల పంపిణీ.. పచ్చని పర్యావరణానికి సర్పంచ్ బోయ అశోక్ పిలుపు కొందుర్గు మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామంలో పచ్చని పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోయ అశోక్ మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు స్వచ్ఛమైన గాలిని అందించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ కాశ్ జంగయ్య, వార్డు సభ్యులు సునీల్, సుజాత టీచర్, హరీశ్, వి.ఓ. పరమేశ్వరి, ధర వెంకటయ్య, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొని మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు.
S M S R R
పర్వతాపూర్లో మొక్కల పంపిణీ.. పచ్చని పర్యావరణానికి సర్పంచ్ బోయ అశోక్ పిలుపు కొందుర్గు మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామంలో పచ్చని పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోయ అశోక్ మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు స్వచ్ఛమైన గాలిని అందించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ కాశ్ జంగయ్య, వార్డు సభ్యులు సునీల్, సుజాత టీచర్, హరీశ్, వి.ఓ. పరమేశ్వరి, ధర వెంకటయ్య, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొని మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు.
More news from తెలంగాణ and nearby areas
- దౌల్తాబాద్: వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.......... దౌల్తాబాద్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు వాగులు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్ల దగ్గరకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం మన తెలుగు రాష్ట్రాలకు శుభ సూత్రం ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆనందం ఆంధ్రాలో ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం తెలంగాణలోని తెలుగు ప్రజలు కూడా ఆనందంతో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు మన తెలుగు విమానయాన శాఖ మంత్రి ఉండటం మన తెలుగు రాష్ట్రానికి అతిపెద్ద మరో విమానాశ్రయం రావడం శుభ సూచకమని తెలియజేస్తున్నారు త్వరలో మన తెలంగాణలో కూడా అతిపెద్ద విమానాశ్రయం వరంగల్ జిల్లాలో ప్రారంభమవుతుందని తెలంగాణకు ఇది కూడా ఒక వరమవుతుందని ఉత్తరాంధ్ర రావు అభివృద్ధి చెందినట్లు ఉత్తర తెలంగాణ కూడా అభివృద్ధి అవుతుందని స్థానికులు అనుకుంటున్నారు తెలంగాణలోని తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కూడా దీన్ని సంతోషం వ్యక్తం చేశారు వచ్చే 2028 సంవత్సరంలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే డబ్బులు ఇంజన్ సర్కార్ పనులు మరింత వేగం సొంతంగా జరిగి తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం అని తెలియజేశారు అనేక పరిశ్రమలు1
- గ్రామాభివృద్ధిపై చిన్న శంకరంపేటలో గ్రామసభ, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చిన్న శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో శనివారం నిర్వహించిన గ్రామసభలో గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలోని అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరుస్తామని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.1
- నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగ దేవమ్మ గుడి నైట్ నైట్ మట్టి కొడుతున్నారు ఇటుక బట్టీలకు మట్టి అమ్ముతున్నారు అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను1
- 2027లో పోలవరం పూర్తి చేస్తాము: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2027లో పోలవరం పూర్తి చేస్తాము ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2028లో అమరావతి ఫేజ్–1 పూర్తి చేస్తాము అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.1
- బూరుగుపల్లిలో గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాలకు సర్వం సిద్ధం పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాల మహోత్సవం ఆదివారం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటు భక్తుల రాకపోకలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. బోనాల వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొని కోటమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పిలుపునిచ్చారు.1
- గద్దెనెక్కిoచిన మేము గద్దెనుoడి దిoచగలము కూడా అంటూ చైర్మన్ కు ఎంఐఎం ప్రెసిడెంట్ అత్తర్ అహ్మద్ స్ట్రాంగ్ వార్నింగ్ జహీరాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ ప్రకoపనులు మిత్రపక్షం ఎంఐఎం నుంచే చైర్మన్ కు షాక్ జహీరాబాద్ మున్సిపల్ రాజకీయంల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది తమ మద్దతుతో చైర్మన్ పీఠం ఎక్కిన కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ యూనుస్ ఇప్పుడు తమనె విస్మరిస్తూన్నరoటూ ఎంఐఎం పార్టీ జహీరాబాద్ ఇంచార్జ్ అత్తర్ అహ్మద్ బహిరంగంగా విరుచుకు పడ్డారు 8వ వార్డ్ కౌన్సిలర్ సోనీ ఇర్మీయా ఆధ్వర్యంలో వార్డులో పర్యటించిన అత్తర్ అహ్మద్ వార్డులోని అధ్వాన్నoగా పరిస్థితిని స్వయంగా పరిశీలించారు1