logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజా సమస్యల పరిష్కారమే జనవాణి లక్ష్యం జనసేన కార్యాలయంలో 8 ఫిర్యాదులు స్వీకరించిన రాజాన వీరసూర్యచంద్ర నాతవరం: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా నాతవరం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా వీరసూర్యచంద్ర ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రహదారులు, ఆస్తి తగాదాలు, విద్యుత్ తదితర సమస్యలకు సంబంధించి మొత్తం ఎనిమిది ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ శాఖల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను జనసేన కార్యాలయం దృష్టికి తీసుకురావాలని, పరిష్కారం కోసం పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాతవరం ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు సూరి శేఖర్, నాయకులు గుడివాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_SETTI SIVA SATYANARAYANA
SETTI SIVA SATYANARAYANA
Local News Reporter నాతవరం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
1 day ago
9ffec359-69a2-4338-902f-afc8a406d854

ప్రజా సమస్యల పరిష్కారమే జనవాణి లక్ష్యం జనసేన కార్యాలయంలో 8 ఫిర్యాదులు స్వీకరించిన రాజాన వీరసూర్యచంద్ర నాతవరం: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా నాతవరం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా వీరసూర్యచంద్ర ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రహదారులు, ఆస్తి తగాదాలు, విద్యుత్ తదితర సమస్యలకు సంబంధించి మొత్తం ఎనిమిది ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ శాఖల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను జనసేన కార్యాలయం దృష్టికి తీసుకురావాలని, పరిష్కారం కోసం పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాతవరం ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు సూరి శేఖర్, నాయకులు గుడివాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రోలుగుంటలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ.... రోలుగుంట, ఆగస్టు 26: ఫ్లోరైడ్‌ ప్రభావిత రోలుగుంటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ దళిత, గిరిజన, పేద మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. వరాహ నదిలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కాలనీలకు తక్షణం ట్యాంకర్ల ద్వారా నీరందించాలని, సీఎస్‌ఆర్‌, డీఎఫ్‌ఎం నిధులతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం నాయకులు కె.గోవిందరావు, వి.నూకరత్నం, వి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    4
    రోలుగుంటలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ....
రోలుగుంట, ఆగస్టు 26: ఫ్లోరైడ్‌ ప్రభావిత రోలుగుంటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ దళిత, గిరిజన, పేద మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. వరాహ నదిలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కాలనీలకు తక్షణం ట్యాంకర్ల ద్వారా నీరందించాలని, సీఎస్‌ఆర్‌, డీఎఫ్‌ఎం నిధులతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం నాయకులు కె.గోవిందరావు, వి.నూకరత్నం, వి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    user_NANI
    NANI
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • విజయనగరం: ధరలు పెరుగుదల నియంత్రించాలి ంచాలి: స్పెషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్.. విజయనగరం జిల్లా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల ప్రభుత్వం, అధికారులు నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయనగరంలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    విజయనగరం: ధరలు పెరుగుదల నియంత్రించాలి ంచాలి: స్పెషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్..
విజయనగరం జిల్లా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల ప్రభుత్వం, అధికారులు నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయనగరంలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    24 min ago
  • బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్‌లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు. ఆన్‌లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్‌రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.
    1
    బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు
విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్‌లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు.
ఆన్‌లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్‌రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
    1
    విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ 
విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
    2
    రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం
సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_Bevara Nagarjuna
    Bevara Nagarjuna
    సాలూరు, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    1
    బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ 
పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన.. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్.. - ⁠వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం. బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.
    1
    బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే  బేబీనాయన..
పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్..
- ⁠వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం.
బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. 
గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.
    user_వెంకీ నాయుడు
    వెంకీ నాయుడు
    Photographer బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అనకాపల్లి జిల్లా: ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామం రోలు గుంటలో.. మంచినీళ్లు ఇవ్వండి చేతులు జోడించి వేడుకుంటున్నాము.. దళితులు బిరుదులు పేద మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీ.. అనకాపల్లి జిల్లా రోలుగుంట కేంద్రంలో కాలనీలో దళితులు. గిరిజనులు. ఇతర పేద మహిళలు ఖాళీ బిందెలతో. మూడు వీధిలో రాలి నిర్వహించడం జరిగింది. వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయాలి CSR. DFM నిధుల నుండి వాటర్ ట్యాంకు ద్వారా నీరు సరఫరా చేయాలి. జిల్లా కలెక్టర్ గారు జోకులు చేసుకోవాలి రోలుగుంట మండలంలో రోలుగుంట తో పాటు నిండుగొండ కే నాయుడుపాలెం కొవ్వూరు.ఎన్ కొత్తూరు. అంట్లపాలెం రాజుపేట ముని పెళ్లి గొల్లపేట గ్రామాలను ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. అప్పటికి 13000 మంది జనాభా రక్షత తాగునీరు అందించడానికి 2004 సంవత్సరంలో3 కోట్ల 50 లక్షల రూపాయలతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఈ నిధులతో జానకిరాంపురం గ్రామం వద్ద వరాహ నదిలో 3 భారీ బోరు బావులు తవ్వించారు. అక్కడినుండి రోలుగుంట లో లక్ష లీటర్లు సామర్థ్యం ఉన్న భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి పైప్లైన్ ద్వారా అందించారు. ఈ పథకం ప్రారంభించి కొద్ది రోజులు సక్రమంగా పనిచేసింది ఇప్పుడు 20 వేల మంది జనాభా పెరిగారు. వరాహ నది బోరుబావుడు చుట్టూ ఇసుక మాఫియా తవ్వడంతో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. దీంతో గ్రామాలకు నీరు సరఫరా బంద్ అయిపోయింది అమృత ధార ( జల్జీవన్ మిషన్)2020-21 ద్వారా ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులు పనులు చేపట్టకపోవడంతో కోటమ్మ ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది తిరిగి కూటమి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన అని చెప్పారు. అధికారులు చెబుతున్నారు. నేటికీ ఫ్లోరిడ్ గ్రామంగా గుర్తించి 23 సంవత్సరాలు అవుతుంది. పాత పైపులు పగిలిపోయాయి. అధికారులు అప్పులు చేసుకొని రిపేర్ చేస్తున్నారు. స్కీం మాత్రం కేటాయించడం లేదు. గ్రామంలో సొంత బోర్లు తీసుకున్న నీరు రావడం లేదు. కనీసం ఫ్లోరైడ్ నీరు కూడా దొరకడం లేదు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ప్రతి గ్రామానికి రక్షత మంచినీరు సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలో చెప్తున్నారు. కనీసం మండల కేంద్రంలో నీరు సరఫరా చేయకపోవడం చాలా అన్యాయం. 12 కుటుంబాల వారు సొంతంగా బోరు తీసుకోవడం జరిగింది. నీరు పడలేదు లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి నీరు రావడం లేదు దళిత గిరిజన ఇతర పేద వీధులన్నిటికీ వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రోలుగుంట నిండుగొండ. కొవ్వూరు రెవిన్యూ పరిధిలో 12 నల్లరాయి క్వారీలు. ఉన్నాయి. పర్యావరణ అనుమతులు గ్రామసభలు పెట్టేటప్పుడు గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. మొక్కలు నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుతాం. మెడికల్ క్యాంప్ పెడతాం సభలో ప్రకటిస్తున్నారు. 20 సంవత్సరాల నుండి ఖాళీ కరాప నిర్వహిస్తున్నారు సి ఎస్ ఆర్ Csr. డిస్ట్రిక్ట్ పండు నిధులు రోలుగుంట మంచినీరికి కేటాయించకపోవడం చాలా అన్యాయం ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ జై గారితో ఫోన్లో మాట్లాడగా వరాహ నదిలో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. నీరు లేదు. చెప్పారు. తక్షణమే దళిత గిరిజన కాలనీకి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు v నూకరత్నం v శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    3
    అనకాపల్లి జిల్లా: ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామం రోలు గుంటలో.. మంచినీళ్లు ఇవ్వండి చేతులు జోడించి వేడుకుంటున్నాము.. దళితులు బిరుదులు పేద మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీ..
అనకాపల్లి జిల్లా రోలుగుంట కేంద్రంలో కాలనీలో దళితులు. గిరిజనులు. ఇతర పేద మహిళలు 
ఖాళీ బిందెలతో. మూడు వీధిలో రాలి నిర్వహించడం జరిగింది.
వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయాలి 
CSR. DFM నిధుల నుండి వాటర్ ట్యాంకు ద్వారా నీరు సరఫరా చేయాలి. జిల్లా కలెక్టర్ గారు జోకులు చేసుకోవాలి 
రోలుగుంట మండలంలో రోలుగుంట తో పాటు నిండుగొండ కే నాయుడుపాలెం కొవ్వూరు.ఎన్ కొత్తూరు. అంట్లపాలెం రాజుపేట
ముని పెళ్లి గొల్లపేట గ్రామాలను ఫ్లోరైడ్  ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. అప్పటికి 13000 మంది జనాభా రక్షత తాగునీరు అందించడానికి 2004 సంవత్సరంలో3 కోట్ల 50 లక్షల  రూపాయలతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఈ నిధులతో జానకిరాంపురం గ్రామం వద్ద వరాహ నదిలో 3 భారీ బోరు బావులు తవ్వించారు. అక్కడినుండి రోలుగుంట లో లక్ష లీటర్లు సామర్థ్యం ఉన్న భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి పైప్లైన్ ద్వారా అందించారు. ఈ పథకం ప్రారంభించి కొద్ది రోజులు సక్రమంగా పనిచేసింది 
ఇప్పుడు  20 వేల మంది జనాభా పెరిగారు. వరాహ నది బోరుబావుడు చుట్టూ ఇసుక మాఫియా తవ్వడంతో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. దీంతో గ్రామాలకు నీరు సరఫరా బంద్ అయిపోయింది 
అమృత ధార ( జల్జీవన్ మిషన్)2020-21 ద్వారా ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులు పనులు చేపట్టకపోవడంతో కోటమ్మ ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది తిరిగి కూటమి  ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన అని చెప్పారు. అధికారులు చెబుతున్నారు.
నేటికీ ఫ్లోరిడ్ గ్రామంగా గుర్తించి 23 సంవత్సరాలు అవుతుంది. పాత పైపులు పగిలిపోయాయి. అధికారులు అప్పులు చేసుకొని రిపేర్ చేస్తున్నారు. స్కీం మాత్రం కేటాయించడం లేదు. గ్రామంలో సొంత బోర్లు తీసుకున్న నీరు రావడం లేదు. కనీసం ఫ్లోరైడ్ నీరు కూడా దొరకడం లేదు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ప్రతి గ్రామానికి రక్షత మంచినీరు సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలో చెప్తున్నారు. కనీసం మండల కేంద్రంలో నీరు సరఫరా చేయకపోవడం చాలా అన్యాయం. 12 కుటుంబాల వారు సొంతంగా బోరు తీసుకోవడం జరిగింది. నీరు పడలేదు లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి నీరు రావడం లేదు 
దళిత గిరిజన ఇతర పేద వీధులన్నిటికీ వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. 
రోలుగుంట నిండుగొండ. కొవ్వూరు రెవిన్యూ పరిధిలో 12 నల్లరాయి క్వారీలు. ఉన్నాయి. పర్యావరణ అనుమతులు గ్రామసభలు పెట్టేటప్పుడు గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. మొక్కలు నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుతాం. మెడికల్ క్యాంప్ పెడతాం సభలో ప్రకటిస్తున్నారు. 20 సంవత్సరాల నుండి ఖాళీ కరాప నిర్వహిస్తున్నారు సి ఎస్ ఆర్  Csr. డిస్ట్రిక్ట్ పండు నిధులు రోలుగుంట మంచినీరికి కేటాయించకపోవడం చాలా అన్యాయం 
ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ జై గారితో ఫోన్లో మాట్లాడగా 
వరాహ నదిలో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. నీరు లేదు. చెప్పారు.
తక్షణమే దళిత గిరిజన కాలనీకి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు v నూకరత్నం v శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.