అంబటి పై కేసు నమోదు అయ్యి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది మళ్లీ జైలుకు వెళ్తాడు గుంటూరు... కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై అసభ్యంగా ఏఐ వీడియో పెట్టిన అంబటి రాంబాబు పై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు ఫిర్యాదు చేసిన టిడిపి జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు,న్యాయవాదులు *పిల్లి మాణిక్యాలరావు కామెంట్స్* అంబటి రాంబాబు వ్యవహార శైలి రోజురోజుకు విచ్చల విడిగా మారింది ప్రజా సమస్యలపై పొరడితే నాయకులు అవుతారు అంతే కాని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ని తిడితే గొప్ప నాయకుడు అవ్వడు భరి తెగించి అంబటి మాట్లాడుతున్నాడు పెమ్మసానికి సంకెళ్లు వేసి వీడియో చేపించి పెట్టాడు అత్యధిక ఓట్లతో గెలిచిన వ్యక్తి పై బలుపు తో ఇలాంటి వీడియో లు అంబటి చేపిస్తున్నాడు నేరాలు అంటే మహిళలను అసభ్యంగా మాట్లాడడం అవమానకరంగా మాట్లాడడం 16 నెలలు జైల్లో ఉన్న మీ నాయకుడు మీద చేసుకో జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి ఇలాంటి ఇలాంటి వీడియో లు పెట్టడం ఆవమానకరం
అంబటి పై కేసు నమోదు అయ్యి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది మళ్లీ జైలుకు వెళ్తాడు గుంటూరు... కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై అసభ్యంగా ఏఐ వీడియో పెట్టిన అంబటి రాంబాబు పై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు ఫిర్యాదు చేసిన టిడిపి జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు,న్యాయవాదులు *పిల్లి మాణిక్యాలరావు కామెంట్స్* అంబటి రాంబాబు వ్యవహార శైలి రోజురోజుకు విచ్చల విడిగా మారింది ప్రజా సమస్యలపై పొరడితే నాయకులు అవుతారు అంతే కాని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ని తిడితే గొప్ప నాయకుడు అవ్వడు భరి తెగించి అంబటి మాట్లాడుతున్నాడు పెమ్మసానికి సంకెళ్లు వేసి వీడియో చేపించి పెట్టాడు అత్యధిక ఓట్లతో గెలిచిన వ్యక్తి పై బలుపు తో ఇలాంటి వీడియో లు అంబటి చేపిస్తున్నాడు నేరాలు అంటే మహిళలను అసభ్యంగా మాట్లాడడం అవమానకరంగా మాట్లాడడం 16 నెలలు జైల్లో ఉన్న మీ నాయకుడు మీద చేసుకో జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి ఇలాంటి ఇలాంటి వీడియో లు పెట్టడం ఆవమానకరం
- ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్,ఏ పి బీజేఏ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ1
- ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.1
- బస్సు సౌకర్యం కల్పించడంతో ఎమ్మెల్యేకు పాలాభిషేకం,....... నడిగూడెం: కోదాడ నుంచి నడిగూడెం మీదుగా మోతే వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, నడిగూడెం సర్పంచ్ దున్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.1
- కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ప్రజాదర్బార్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.1
- కార్మికుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రభుత్వాన్ని కోరారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనేకసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమం చేపట్టామన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.1
- నేలకొండపల్లి మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల (BC) బాలికల వసతి గృహాన్ని తహసీల్దార్ రాంప్రసాద్ సందర్శించారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల (BC) బాలికల వసతి గృహాన్ని తహసీల్దార్ రాంప్రసాద్ సందర్శించారు. విద్యార్థినుల మధ్య కూర్చొని భోజనం చేస్తూ,వారికి అందుతున్న విద్యా, వసతి వివరాలను ఆరా తీశారు. మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సౌజన్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు1
- కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులు ఆర్డీవో కార్యాలయంలో ధర్నా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్లకు,కార్మికులకు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆవులయ్య మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు కనీస వేతనం 26,000 కల్పించి, ఆరోగ్య భీమా కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టానికైనా వెనకాడ బొమని హెచ్చరించారు.1
- *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 మూడు ప్రధాన పార్టీలకు మూడు షేర్ల నీళ్ళు తాగించింది అప్పుడే మర్చిపోయారా..??? ఒకవేళ మర్చిపోయి ఉంటే...ఈ సారి మూడు చెరువుల నీళ్ళు తాగడానికి సిద్ధంగా ఉండండి🌊🌊🌊 WGL- NLG-KMM గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వార్ వన్ సైడ్...అది తీన్మార్ మల్లన్న సైడ్🔥1
- సుబ్లేడు ఎస్సీ మాల శ్మశానవాటికకు 40 ఏళ్లుగా రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గo సుబ్లేడు ఎస్సీ మాల శ్మశానవాటికకు 40 ఏళ్లుగా రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షుడు మందడి ఇజ్రాయెల్ కోరారు. బుధవారం ఆయన శ్మశానవాటికను సందర్శించి, మంత్రి పొంగులేటి శ్రీనివాల్రెడ్డి స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.1