కమ్యూనిస్టు సిద్ధాంత విత్త ఖరారు జోహార్ వర్ధంతి ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకున్నారు కారల్ మార్క్స్ వర్ధంతి. ( మే 5, 1818 - మార్చి14, 1883) జంపన్న మార్క్సిజం ఆవిర్భావ నేపథ్యం 18వ శతాబ్దం మలి భాగము నుండి 19వ శతాబ్దం మధ్య వరకు వాయువ్య యూరప్ అమెరికా ప్రాంతాలలో పెట్టుబడిదారీ విధానం నాటకీయంగాను విప్లవకరంగాను వృద్ధి చెందింది. ఈ కాలంలోనే ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన గొప్ప పరిణామాలుగా ఇంగ్లాండ్ లో జరిగిన 1789 పారిశ్రామిక విప్లవం,ప్రెంచి ఇంగ్లాండ్ వగైరా దేశాలలో జరిగిన ప్రజాస్వామిక విప్లవాలు కొనసాగిన కాలం. ఆనాడు ప్రబలమైనదిగా ఉండిన భూస్వామ్య విధానం పైన పెట్టుబడిదారీ విధానం తిరుగులేని విజయం సాధించింది. పశ్చిమ యూరప్ ప్రభుత్వాల ప్రత్యేకించి బ్రిటిష్ వారి ప్రపంచ అధిపత్యము ఏర్పడిన కాలమది. ఆ అధిపత్యం పెట్టుబడిదారీ దేశాలలో విప్లవ కరమైన సామాజిక ఆర్థిక పరివర్తనకు దారి తీసింది. అంతేకాదు అది ప్రపంచంలోని పురాతన నాగరికతలు సామ్రాజ్యాలు పెద్ద సంఖ్యలో లొంగిపోవడానికి లేదా కుప్పకూలిపోవడానికి కూడా దారితీసింది. భారతదేశం బ్రిటిష్ గవర్నర్ల పాలన కింద ఉండే ఒక రాష్ట్రంగా మారిపోయింది .ఇస్లామిక్ దేశాలు సంక్షోభంలోకి తోసి వేయబడ్డాయి. 1839- 42 మధ్య కాలంలో గొప్ప చైనా సామ్రాజ్యం సైతం పాశ్చాత్య దోపిడికి తలుపులు తెరవవలసిన స్థితికి నెట్టబడింది.పెట్టుబడి దారీ వ్యాపారపు పురోగమనానికి మరే అడ్డంకి లేకుండా పోయింది. వారు ప్రతి వెనుకబడిన దేశాన్ని వలసలుగా మార్చుకొని పెట్టుబడి దారి వలస సామ్రాజ్య ఆధిపత్యం నెలకొల్పిన కాలం. ప్రపంచ వ్యాప్తంగా ఎదురులేని అధికారంతో విర్ర వీగుతున్న బూర్జువా వర్గాన్ని ప్రతిఘటించ డానికి ,దానిని ఓడించేటటువంటి కార్మిక వర్గ శక్తుల సంఘటిత పోరాటానికి ,కమ్యునిస్ట్ సిద్ధాంత ఆవిర్భావానికి కూడా దారితీసాయి. మానవ చరిత్రలో అతి గొప్ప మార్పులు సంభవిస్తూ కొన్ని పాశ్చాత్య పెట్టుబడిదారీ రాజ్యాలు ప్రపంచం పై పెత్తనాన్ని నెలకొల్పుతూ ఉన్న కాలములో మార్క్సిజం పుట్టింది . మార్క్సిజం పుట్టుకకు కారణమైన వస్తు గత పరిస్థితులను ఎత్తిచూపుతూ కామ్రేడ్ మావో ఇలా అన్నాడు. "చరిత్రలో చాలా దీర్ఘకాలం పాటు మానవులు సమాజ చరిత్ర గురించిన అవగాహనలో అనివార్యంగానే ఏకపక్ష అవగాహనకు పరిమితమైపోయారు. దీనికి కారణం దోపిడి వర్గాల పక్షపాత బుద్ధి ఎల్లప్పుడూ చరిత్రను వక్రీకరించడం ఒకటైతే , చిన్న తరహా ఉత్పత్తి మానవుల దృక్పథాన్ని పరిమితం చేయడం రెండవ కారణం .బ్రహ్మాండమైన ఉత్పత్తి శక్తుల ( భారీ పరిశ్రమల)తో పాటు ఆధునికమైన కార్మిక వర్గం ఆవిర్భవించిన తర్వాతనే మానవుడు సమాజ అభివృద్ధిని గురించి సమగ్రమైన చారిత్రక అవగాహననుసంపాదించు కోగలిగాడు. ఆ జ్ఞానాన్ని ఒక విజ్ఞాన శాస్త్రంగా మార్క్సిజం అనే విజ్ఞాన శాస్త్రంగా మలుచుకోగలిగాడు." మార్క్స్ జీవిత విశేషాలు మార్క్స్ 1818 మే 5న జర్మనీ దేశానికి చెందిన రైన్ రాష్ట్రంలోని టీయర్ నగరంలో జన్మించాడు తండ్రి న్యాయవాది . మార్క్స్ మొదటగా న్యాయ శాస్త్రం చదివినాడు .చరిత్ర తత్వశాస్త్రంపై ప్రధానంగా తన అధ్యయనాన్ని కేంద్రీకరించాడు. తత్వశాస్త్ర సిద్ధాంతాలపై రచనలు కొనసాగిస్తూ ఒక పత్రికకు సైతం చీఫ్ ఎడిటర్ గా పనిచేసినాడు.తన అధ్యయనంలో ప్రపంచాన్ని గతి తార్కిక భౌతిక వాద దృక్పథంతో పరిశీలించిన ఫలితంగానే మార్క్స్ ప్రపంచ శ్రామిక వర్గ మహోపాధ్యాయుడుగా మారినాడు. మార్క్స్ తన ప్రేమికురాలు అయిన జెన్నీవాన్ వెస్ట్ ఫాలిన్ 1843 లో వివాహం చేసుకున్నప్పటి నుండి జెన్నీ అన్ని రకాల బలమైన తోడ్పాటుతో మాత్రమే మార్క్స్ సిద్దాంతాలు అభివృద్ధి చేయగలిగినాడు 1844లో మార్క్ ఎంగెల్స్ లు పారిస్ లో కలిసి అత్యంత కార్మిక వర్గ మిత్రులుగా చివరి వరకు కొనసాగినారు. 1847 మార్క్స్ ఎంగెల్స్ లు కమ్యూనిస్టు లీగ్ ప్రచార సంఘంలో చేరినారు 1847వ సంవత్సరములో కమ్యూనిస్టు ప్రణాళిక సమర్పించినారు . మార్క్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంగెల్స్ తో 1864లో అంతర్జాతీయ కార్మిక సంఘం స్థాపించి కమ్యూనిజం ప్రచారం ,కార్మిక ,కమ్యునిస్ట్ సంస్థల నిర్మాణ కృషి చేసినారు. మార్క్స్ ఎంతో నికృష్ట జీవితాన్ని గడిపాడు ఎంగెల్స్ సహాయం చేయబట్టి గాని లేకపోతే పెట్టుబడి గ్రంథాన్ని పూర్తి చేయకపోవడమే కాక ఆర్థికలేమితో ముందే చనిపోయేవాడు. మార్క్స్ ఎంగెల్స్ సహాయంతో మార్క్సిజం అనే కార్మిక వర్గ విజ్ఞాన శాస్త్రం రూపొందింది. మార్క్స్ ఎంగెల్స్ రచనలే మార్క్సిజంగా మార్క్స్ తో ఎంగెల్స్ చేసిన గొప్ప చేర్పులు విడదీసి చూడరానివి ఎంగెల్స్ తో కలిసే మార్క్స్ తన సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచాడు. చరిత్ర పరిణామ క్రమం గురించి తత్వవేత్తల్లో వెనుకటి కాలం నుంచి దైవము ఆశించే దాన్ని బట్టొ ,దైవంశ సంభూతులైన రాజు, మత గురువుల ఇష్టా ఇష్టాన్ని బట్టి మానవాతిత శక్తులను బట్టి సాగుతుందని భావ వాద దృక్పథం ప్రబలంగా వుంది.ఇదే భావ వాద దృక్పథం తో ప్రజలను తర తరాలుగా దోపిడీ చేస్తున్నది. మానవ చరిత్ర పరిణామానికి ప్రధాన భౌతిక కారణంగా శ్రమ సంబంధాల నుంచి పుట్టుకొచ్చేదిగానే ఉంటుంది అని మార్క్స్ బహిర్గత పరిచినాడు. చరిత్ర గురించిన భౌతికవాద భావనను కనుగొనేందుకు సామాజిక అభివృద్ధి చలన నియమాలు ఏమిటి అనే గతితార్కిక పద్ధతిని కనుగొన్నారు. పెట్టుబడిదారీ విధానంలో వర్గ వైరుధ్యాలతో సహా ఆ విధానపు చలన నియమాలను దోపిడి మూలాన్ని బట్టబయలు చేసినారు. శ్రమ దోపిడికి కారణమైన అదనపు విలువ సిద్ధాంతాన్ని ఆవిష్కరించి కార్మిక వర్గ రాజకీయ అర్థ శాస్త్రం అభివృద్ధి చేశారు. వర్గ పోరాట సిద్ధాంతం పునాదిగా శాస్త్రీయ సోషలిజాన్ని అభివృద్ధి చేశారు. కార్మిక వర్గపు పోరాట వ్యూహము ఎత్తుగడలను నియంత్రించే సూత్రాలను రూపొందించారు. కార్మిక వర్గం పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోసి తనను తాను విముక్తం కావించుకోవాలంటే అది తన సొంత కార్మిక వర్గ పార్టీని ఏర్పరుచుకోవాలని మార్స్ ఎంగెల్స్ లు ప్రబోధించినారు. కార్మిక వర్గ పార్టీ అంటే కమ్యునిస్ట్ పార్టీ పెట్టుబడి దారి వర్గానికి వ్యతిరేక పార్టీ గానే వుంటూ రైతులు ఉద్యోగులు వగైరా శ్రామిక వర్గ ప్రజల మధ్య బలమైన ఐక్య సంఘటన ఏర్పడాలని చెప్పినారు. వర్గ సమాజంలో ఉత్పత్తి శక్తులకు ఉత్పత్తి సంబంధాలకు మధ్య ఉండే వైరుధ్యం వర్గ వైరుధ్యంగా ప్రతి పలిస్తుందని వారు నిరూపించారు. ఈ వర్గ పోరాటమే సమాజానికి శోదక శక్తిగా పనిచేస్తుంది .అందువల్లనే వారు ప్రపంచ చరిత్ర అంటే వర్గ పోరాటాల చరిత్రని వర్ణించారు .కార్మిక వర్గం సమాజం లోని సకల శ్రామిక వర్గాలతో ఐక్యత ద్వారా మానవ సమాజాన్ని అన్ని రకాల దోపిడి అసమానతల నుండి విముక్తి చేయడానికి వర్గ పోరాట శాస్త్రాన్ని రచించినారు. బానిస సమాజం నుండి కమ్యూనిజం వరకు మానవ సమాజపు అభివృద్ధి క్రమంలో రాజ్యం ఎలా పుట్టి అభివృద్ధి చెంది అంతరించిపోతుందో మార్క్స్ ఎంగెల్స్ లు వివరించారు." ఆధునిక రాజ్యం యొక్క పరిపాలన విభాగం అంటే మొత్తంగా బూర్జువా వర్గం యొక్క ఉమ్మడి కార్యకలాపాలను చక్కబెట్టే ఒక కమిటీ తప్ప మరేమీ కాదు" అని కమ్యూనిస్టు ప్రణాళికలో చేసిన ప్రకటన పెట్టుబడి దారి వర్గం పై వివిధ బూర్జువా పార్టీ ల పై ఖచ్చితమైన శ్రామిక వర్గ వైఖరి వెల్లడించారు. మార్క్సిజం అంటే తత్వశాస్త్రం (గతి తార్కిక భౌతిక వాదం )రాజకీయ అర్థశాస్త్రం (పెట్టుబడి) శాస్త్రీయ సోషలిజం, శ్రామిక వర్గ పోరాటాల ఎత్తుగడల సమగ్ర సమహారం. మార్క్స్ రచనలు వందల కొలది వున్నప్పటికీ మార్క్స్ బోధనలోని అతి ముఖ్యమైన అంశాలను క్లుప్తంగా ఏడు శీర్షికల కింద లెనిన్ విభజించి నాడు. 1)భౌతిక వాద తత్వశాస్త్రం 2) గతి తర్కం 3) చారిత్రక భౌతిక వాదం 4) వర్గ పోరాటం 5)మార్క్స్ ఆర్థిక సిద్ధాంతం 6) సోషలిజం 7)కార్మిక వర్గ పోరాట ఎత్తుగడలు. మార్క్స్ జీవితంలో ఆఖరి కొద్ది సంవత్సరాలు అనేక వ్యాధులతో బాధ పడ్డాడు. అవి అతని రాజకీయ, రచనా వ్యాసంగానికి ఆటంకంగా పరిణమించాయి. దానితో మార్క్స్ తాను రచించదలచుకున్న వాటిలో కొన్నింటిని రచించలేక పోయి చివరకు లండన్ లోనే మార్చి 14, 1883 న మరణించాడు. మార్క్స్ సమాధి వద్ద ఎంగెల్స్ చేసిన ప్రసంగంలో. డార్విన్ ఏ విధంగానైతే జీవ ప్రకృతి యొక్క అభివృద్ధి నియమాన్ని కనుగొన్నాడో సరిగ్గా అదే విధంగా మార్క్స్ మానవ చరిత్ర యొక్క అభివృద్ధి నియమాన్ని కనుగొన్నాడు. మార్క్స్ కనిపెట్టిన సమగ్రమైన శాస్త్రీయమైన చారిత్రక భౌతిక వాద సిద్ధాంతం అంతవరకు చరిత్ర గురించి ఉనికిలో ఉన్న అన్ని రకాల తప్పుడు సిద్ధాంతాలను చావు దెబ్బ కొట్టింది. కారల్ మార్క్స్ ఒక గొప్ప మానవ విజ్ఞాన శాస్త్రవేత్త .అన్నింటికంటే ముఖ్యంగా ఆయన గొప్పశ్రామిక విప్లవవాది.ఆయన మానవ సమాజ విముక్తి పథ నిర్దేశకుడు. 19వ శతాబ్దం మానవ సమాజానికి సమర్పించిన ఒక మహోన్నత మానవుడు. పెట్టుబడిదారీ సమాజాన్ని కూల్చివేయడానికి ఆధునిక శ్రామిక వర్గ విముక్తికి తోడ్పడడమే ఆయన జీవిత పరమోద్దేశం. ఆయన పేరు యుగయుగాల దాకా అమరంగా ఉంటుంది .అలాగే ఆ కృషి కూడా చిరస్థాయిగా ఉంటుంది. అదనపు విలువ ఆవిష్కారంతో సమకాలిన పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని శాసించే ప్రత్యేక గతి నియమాన్ని మార్క్స్ కనుగొనడంలో చరిత్రలో మొదటి సారిగా వెలుగు ప్రసరించబడింది. కామ్రేడ్ మార్క్స్ పరిశోధన జరిపిన ప్రతి రంగంలోనూ ,తాత్విక ,చారిత్రక, ఆర్థిక ,సామాజిక వర్గ పోరాట రంగాల్లోని ప్రతి ఒక్క విషయంపై కూడా ఆయన స్వతంత్రమైన లోతైన ఆవిష్కరణ చేశాడు . "మార్క్సిజము అంటే ప్రకృతి మానవ సమాజాల అభివృద్ధిని నియంత్రించే నియమాల విజ్ఞాన శాస్త్రం .దోపిడికి పీడనకు గురయ్యే ప్రజారాశుల విప్లవ శాస్త్రం. సకల దేశాలలో సోషలిజానికి విజయాన్ని సాధించే శాస్త్రం కమ్యూనిస్టు సమాజాన్ని నిర్మించే శాస్త్రం". కామ్రేడ్ స్టాలిన్. "మార్క్సిజం నిర్జీవమైన పిడివాదం కాదు పరిపూర్ణమైన తయారై సిద్ధంగా ఉన్న మార్పు చెందని సిద్ధాంతం కాదు ఆచరణకు అది సజీవ మార్గదర్శి "కామ్రేడ్ లెనిన్. కార్మిక కమ్యూనిస్టు ఉద్యమాలు నేడు అనేక బలహీనతలతో వెనుకంజలో ఉండడానికి గల కారణాలని మార్క్సిజము దృష్టి కోణం నుండి సమీక్షించుకొని శ్రామిక వర్గ అధికారం కోసం ప్రజలను సోషలిస్టు చైతన్యం వంతం చేయడమే నేటి ప్రధాన కర్తవ్యం. కమ్యూనిస్ట్ సిద్ధాంత వేత్త కారల్ మార్క్స్ కు జోహార్లు. మార్చ్ 14-2026 జంపన్న (డెమొక్రటిక్ సోషలిస్టు నాయకుడు)
కమ్యూనిస్టు సిద్ధాంత విత్త ఖరారు జోహార్ వర్ధంతి ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకున్నారు కారల్ మార్క్స్ వర్ధంతి. ( మే 5, 1818 - మార్చి14, 1883) జంపన్న మార్క్సిజం ఆవిర్భావ నేపథ్యం 18వ శతాబ్దం మలి భాగము నుండి 19వ శతాబ్దం మధ్య వరకు వాయువ్య యూరప్ అమెరికా ప్రాంతాలలో పెట్టుబడిదారీ విధానం నాటకీయంగాను విప్లవకరంగాను వృద్ధి చెందింది. ఈ కాలంలోనే ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన గొప్ప పరిణామాలుగా ఇంగ్లాండ్ లో జరిగిన 1789 పారిశ్రామిక విప్లవం,ప్రెంచి ఇంగ్లాండ్ వగైరా దేశాలలో జరిగిన ప్రజాస్వామిక విప్లవాలు కొనసాగిన కాలం. ఆనాడు ప్రబలమైనదిగా ఉండిన భూస్వామ్య విధానం పైన పెట్టుబడిదారీ విధానం తిరుగులేని విజయం సాధించింది. పశ్చిమ యూరప్ ప్రభుత్వాల ప్రత్యేకించి బ్రిటిష్ వారి ప్రపంచ అధిపత్యము ఏర్పడిన కాలమది. ఆ అధిపత్యం పెట్టుబడిదారీ దేశాలలో విప్లవ కరమైన సామాజిక ఆర్థిక పరివర్తనకు దారి తీసింది. అంతేకాదు అది ప్రపంచంలోని పురాతన నాగరికతలు సామ్రాజ్యాలు పెద్ద సంఖ్యలో లొంగిపోవడానికి లేదా కుప్పకూలిపోవడానికి కూడా దారితీసింది. భారతదేశం బ్రిటిష్ గవర్నర్ల పాలన కింద ఉండే ఒక రాష్ట్రంగా మారిపోయింది .ఇస్లామిక్ దేశాలు సంక్షోభంలోకి తోసి వేయబడ్డాయి. 1839- 42 మధ్య కాలంలో గొప్ప చైనా సామ్రాజ్యం సైతం పాశ్చాత్య దోపిడికి తలుపులు తెరవవలసిన స్థితికి నెట్టబడింది.పెట్టుబడి దారీ వ్యాపారపు పురోగమనానికి మరే అడ్డంకి లేకుండా పోయింది. వారు ప్రతి వెనుకబడిన దేశాన్ని వలసలుగా మార్చుకొని పెట్టుబడి దారి వలస సామ్రాజ్య ఆధిపత్యం నెలకొల్పిన కాలం. ప్రపంచ వ్యాప్తంగా ఎదురులేని అధికారంతో విర్ర వీగుతున్న బూర్జువా వర్గాన్ని ప్రతిఘటించ డానికి ,దానిని ఓడించేటటువంటి కార్మిక వర్గ శక్తుల సంఘటిత పోరాటానికి ,కమ్యునిస్ట్ సిద్ధాంత ఆవిర్భావానికి కూడా దారితీసాయి. మానవ చరిత్రలో అతి గొప్ప మార్పులు సంభవిస్తూ కొన్ని పాశ్చాత్య పెట్టుబడిదారీ రాజ్యాలు ప్రపంచం పై పెత్తనాన్ని నెలకొల్పుతూ ఉన్న కాలములో మార్క్సిజం పుట్టింది . మార్క్సిజం పుట్టుకకు కారణమైన వస్తు గత పరిస్థితులను ఎత్తిచూపుతూ కామ్రేడ్ మావో ఇలా అన్నాడు. "చరిత్రలో చాలా దీర్ఘకాలం పాటు మానవులు సమాజ చరిత్ర గురించిన అవగాహనలో అనివార్యంగానే ఏకపక్ష అవగాహనకు పరిమితమైపోయారు. దీనికి కారణం దోపిడి వర్గాల పక్షపాత బుద్ధి ఎల్లప్పుడూ చరిత్రను వక్రీకరించడం ఒకటైతే , చిన్న తరహా ఉత్పత్తి మానవుల దృక్పథాన్ని పరిమితం చేయడం రెండవ కారణం .బ్రహ్మాండమైన ఉత్పత్తి శక్తుల ( భారీ పరిశ్రమల)తో పాటు ఆధునికమైన కార్మిక వర్గం ఆవిర్భవించిన తర్వాతనే మానవుడు సమాజ అభివృద్ధిని గురించి సమగ్రమైన చారిత్రక అవగాహననుసంపాదించు కోగలిగాడు. ఆ జ్ఞానాన్ని ఒక విజ్ఞాన శాస్త్రంగా మార్క్సిజం అనే విజ్ఞాన శాస్త్రంగా మలుచుకోగలిగాడు." మార్క్స్ జీవిత విశేషాలు మార్క్స్ 1818 మే 5న జర్మనీ దేశానికి చెందిన రైన్ రాష్ట్రంలోని టీయర్ నగరంలో జన్మించాడు తండ్రి న్యాయవాది . మార్క్స్ మొదటగా న్యాయ శాస్త్రం చదివినాడు .చరిత్ర తత్వశాస్త్రంపై ప్రధానంగా తన అధ్యయనాన్ని కేంద్రీకరించాడు. తత్వశాస్త్ర సిద్ధాంతాలపై రచనలు కొనసాగిస్తూ ఒక పత్రికకు సైతం చీఫ్ ఎడిటర్ గా పనిచేసినాడు.తన అధ్యయనంలో ప్రపంచాన్ని గతి తార్కిక భౌతిక వాద దృక్పథంతో పరిశీలించిన ఫలితంగానే మార్క్స్ ప్రపంచ శ్రామిక వర్గ మహోపాధ్యాయుడుగా మారినాడు. మార్క్స్ తన ప్రేమికురాలు అయిన జెన్నీవాన్ వెస్ట్ ఫాలిన్ 1843 లో వివాహం చేసుకున్నప్పటి నుండి జెన్నీ అన్ని రకాల బలమైన తోడ్పాటుతో మాత్రమే మార్క్స్ సిద్దాంతాలు అభివృద్ధి చేయగలిగినాడు 1844లో మార్క్ ఎంగెల్స్ లు పారిస్ లో కలిసి అత్యంత కార్మిక వర్గ మిత్రులుగా చివరి వరకు కొనసాగినారు. 1847 మార్క్స్ ఎంగెల్స్ లు కమ్యూనిస్టు లీగ్ ప్రచార సంఘంలో చేరినారు 1847వ సంవత్సరములో కమ్యూనిస్టు ప్రణాళిక సమర్పించినారు . మార్క్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంగెల్స్ తో 1864లో అంతర్జాతీయ కార్మిక సంఘం స్థాపించి కమ్యూనిజం ప్రచారం ,కార్మిక ,కమ్యునిస్ట్ సంస్థల నిర్మాణ కృషి చేసినారు. మార్క్స్ ఎంతో నికృష్ట జీవితాన్ని గడిపాడు ఎంగెల్స్ సహాయం చేయబట్టి గాని లేకపోతే పెట్టుబడి గ్రంథాన్ని పూర్తి చేయకపోవడమే కాక ఆర్థికలేమితో ముందే చనిపోయేవాడు. మార్క్స్ ఎంగెల్స్ సహాయంతో మార్క్సిజం అనే కార్మిక వర్గ విజ్ఞాన శాస్త్రం రూపొందింది. మార్క్స్ ఎంగెల్స్ రచనలే మార్క్సిజంగా మార్క్స్ తో ఎంగెల్స్ చేసిన గొప్ప చేర్పులు విడదీసి చూడరానివి ఎంగెల్స్ తో కలిసే మార్క్స్ తన సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచాడు. చరిత్ర పరిణామ క్రమం గురించి తత్వవేత్తల్లో వెనుకటి కాలం నుంచి దైవము ఆశించే దాన్ని బట్టొ ,దైవంశ సంభూతులైన రాజు, మత గురువుల ఇష్టా ఇష్టాన్ని బట్టి మానవాతిత శక్తులను బట్టి సాగుతుందని భావ వాద దృక్పథం ప్రబలంగా వుంది.ఇదే భావ వాద దృక్పథం తో ప్రజలను తర తరాలుగా దోపిడీ చేస్తున్నది. మానవ చరిత్ర పరిణామానికి ప్రధాన భౌతిక కారణంగా శ్రమ సంబంధాల నుంచి పుట్టుకొచ్చేదిగానే ఉంటుంది అని మార్క్స్ బహిర్గత పరిచినాడు. చరిత్ర గురించిన భౌతికవాద భావనను కనుగొనేందుకు సామాజిక అభివృద్ధి చలన నియమాలు ఏమిటి అనే గతితార్కిక పద్ధతిని కనుగొన్నారు. పెట్టుబడిదారీ విధానంలో వర్గ వైరుధ్యాలతో సహా ఆ విధానపు చలన నియమాలను దోపిడి మూలాన్ని బట్టబయలు చేసినారు. శ్రమ దోపిడికి కారణమైన అదనపు విలువ సిద్ధాంతాన్ని ఆవిష్కరించి కార్మిక వర్గ రాజకీయ అర్థ శాస్త్రం అభివృద్ధి చేశారు. వర్గ పోరాట సిద్ధాంతం పునాదిగా శాస్త్రీయ సోషలిజాన్ని అభివృద్ధి చేశారు. కార్మిక వర్గపు పోరాట వ్యూహము ఎత్తుగడలను నియంత్రించే సూత్రాలను రూపొందించారు. కార్మిక వర్గం పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోసి తనను తాను విముక్తం కావించుకోవాలంటే అది తన సొంత కార్మిక వర్గ పార్టీని ఏర్పరుచుకోవాలని మార్స్ ఎంగెల్స్ లు ప్రబోధించినారు. కార్మిక వర్గ పార్టీ అంటే కమ్యునిస్ట్ పార్టీ పెట్టుబడి దారి వర్గానికి వ్యతిరేక పార్టీ గానే వుంటూ రైతులు ఉద్యోగులు వగైరా శ్రామిక వర్గ ప్రజల మధ్య బలమైన ఐక్య సంఘటన ఏర్పడాలని చెప్పినారు. వర్గ సమాజంలో ఉత్పత్తి శక్తులకు ఉత్పత్తి సంబంధాలకు మధ్య ఉండే వైరుధ్యం వర్గ వైరుధ్యంగా ప్రతి పలిస్తుందని వారు నిరూపించారు. ఈ వర్గ పోరాటమే సమాజానికి శోదక శక్తిగా పనిచేస్తుంది .అందువల్లనే వారు ప్రపంచ చరిత్ర అంటే వర్గ పోరాటాల చరిత్రని వర్ణించారు .కార్మిక వర్గం సమాజం లోని సకల శ్రామిక వర్గాలతో ఐక్యత ద్వారా మానవ సమాజాన్ని అన్ని రకాల దోపిడి అసమానతల నుండి విముక్తి చేయడానికి వర్గ పోరాట శాస్త్రాన్ని రచించినారు. బానిస సమాజం నుండి కమ్యూనిజం వరకు మానవ సమాజపు అభివృద్ధి క్రమంలో రాజ్యం ఎలా పుట్టి అభివృద్ధి చెంది అంతరించిపోతుందో మార్క్స్ ఎంగెల్స్ లు వివరించారు." ఆధునిక రాజ్యం యొక్క పరిపాలన విభాగం అంటే మొత్తంగా బూర్జువా వర్గం యొక్క ఉమ్మడి కార్యకలాపాలను చక్కబెట్టే ఒక కమిటీ తప్ప మరేమీ కాదు" అని కమ్యూనిస్టు ప్రణాళికలో చేసిన ప్రకటన పెట్టుబడి దారి వర్గం పై వివిధ బూర్జువా పార్టీ ల పై ఖచ్చితమైన శ్రామిక వర్గ వైఖరి వెల్లడించారు. మార్క్సిజం అంటే తత్వశాస్త్రం (గతి తార్కిక భౌతిక వాదం )రాజకీయ అర్థశాస్త్రం (పెట్టుబడి) శాస్త్రీయ సోషలిజం, శ్రామిక వర్గ పోరాటాల ఎత్తుగడల సమగ్ర సమహారం. మార్క్స్ రచనలు వందల కొలది వున్నప్పటికీ మార్క్స్ బోధనలోని అతి ముఖ్యమైన అంశాలను క్లుప్తంగా ఏడు శీర్షికల కింద లెనిన్ విభజించి నాడు. 1)భౌతిక వాద తత్వశాస్త్రం 2) గతి తర్కం 3) చారిత్రక భౌతిక వాదం 4) వర్గ పోరాటం 5)మార్క్స్ ఆర్థిక సిద్ధాంతం 6) సోషలిజం 7)కార్మిక వర్గ పోరాట ఎత్తుగడలు. మార్క్స్ జీవితంలో ఆఖరి కొద్ది సంవత్సరాలు అనేక వ్యాధులతో బాధ పడ్డాడు. అవి అతని రాజకీయ, రచనా వ్యాసంగానికి ఆటంకంగా పరిణమించాయి. దానితో మార్క్స్ తాను రచించదలచుకున్న వాటిలో కొన్నింటిని రచించలేక పోయి చివరకు లండన్ లోనే మార్చి 14, 1883 న మరణించాడు. మార్క్స్ సమాధి వద్ద ఎంగెల్స్ చేసిన ప్రసంగంలో. డార్విన్ ఏ విధంగానైతే జీవ ప్రకృతి యొక్క అభివృద్ధి నియమాన్ని కనుగొన్నాడో సరిగ్గా అదే విధంగా మార్క్స్ మానవ చరిత్ర యొక్క అభివృద్ధి నియమాన్ని కనుగొన్నాడు. మార్క్స్ కనిపెట్టిన సమగ్రమైన శాస్త్రీయమైన చారిత్రక భౌతిక వాద సిద్ధాంతం అంతవరకు చరిత్ర గురించి ఉనికిలో ఉన్న అన్ని రకాల తప్పుడు సిద్ధాంతాలను చావు దెబ్బ కొట్టింది. కారల్ మార్క్స్ ఒక గొప్ప మానవ విజ్ఞాన శాస్త్రవేత్త .అన్నింటికంటే ముఖ్యంగా ఆయన గొప్పశ్రామిక విప్లవవాది.ఆయన మానవ సమాజ విముక్తి పథ నిర్దేశకుడు. 19వ శతాబ్దం మానవ సమాజానికి సమర్పించిన ఒక మహోన్నత మానవుడు. పెట్టుబడిదారీ సమాజాన్ని కూల్చివేయడానికి ఆధునిక శ్రామిక వర్గ విముక్తికి తోడ్పడడమే ఆయన జీవిత పరమోద్దేశం. ఆయన పేరు యుగయుగాల దాకా అమరంగా ఉంటుంది .అలాగే ఆ కృషి కూడా చిరస్థాయిగా ఉంటుంది. అదనపు విలువ ఆవిష్కారంతో సమకాలిన పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని శాసించే ప్రత్యేక గతి నియమాన్ని మార్క్స్ కనుగొనడంలో చరిత్రలో మొదటి సారిగా వెలుగు ప్రసరించబడింది. కామ్రేడ్ మార్క్స్ పరిశోధన జరిపిన ప్రతి రంగంలోనూ ,తాత్విక ,చారిత్రక, ఆర్థిక ,సామాజిక వర్గ పోరాట రంగాల్లోని ప్రతి ఒక్క విషయంపై కూడా ఆయన స్వతంత్రమైన లోతైన ఆవిష్కరణ చేశాడు . "మార్క్సిజము అంటే ప్రకృతి మానవ సమాజాల అభివృద్ధిని నియంత్రించే నియమాల విజ్ఞాన శాస్త్రం .దోపిడికి పీడనకు గురయ్యే ప్రజారాశుల విప్లవ శాస్త్రం. సకల దేశాలలో సోషలిజానికి విజయాన్ని సాధించే శాస్త్రం కమ్యూనిస్టు సమాజాన్ని నిర్మించే శాస్త్రం". కామ్రేడ్ స్టాలిన్. "మార్క్సిజం నిర్జీవమైన పిడివాదం కాదు పరిపూర్ణమైన తయారై సిద్ధంగా ఉన్న మార్పు చెందని సిద్ధాంతం కాదు ఆచరణకు అది సజీవ మార్గదర్శి "కామ్రేడ్ లెనిన్. కార్మిక కమ్యూనిస్టు ఉద్యమాలు నేడు అనేక బలహీనతలతో వెనుకంజలో ఉండడానికి గల కారణాలని మార్క్సిజము దృష్టి కోణం నుండి సమీక్షించుకొని శ్రామిక వర్గ అధికారం కోసం ప్రజలను సోషలిస్టు చైతన్యం వంతం చేయడమే నేటి ప్రధాన కర్తవ్యం. కమ్యూనిస్ట్ సిద్ధాంత వేత్త కారల్ మార్క్స్ కు జోహార్లు. మార్చ్ 14-2026 జంపన్న (డెమొక్రటిక్ సోషలిస్టు నాయకుడు)
- మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం బజరంగ్దళ్ పరిషత్ ఆధ్వర్యంలో లవ్ జిహాద్ వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు మేల్కొనండి జిహాద్ వలలో పడకండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం గోరక్ష చేయాలని గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమకు వినతిపదిక సమర్పించారు.1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- Post by Shyam sunder Yadav Pulapally1
- పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.1
- Bharat Institutions Pharmacy Mein Placement Ka Jalwa: Apollo Pharmacies Drive Mein 60 Students Select, Hetero Labs Mein Bhi 8 Ko Mila Mauka Hashtags: #BharatInstitutions #PharmacyPlacements #CampusDrive #ApolloPharmacies #HeteroLabs #HyderabadJobs #BPharmStudents #PlacementSuccess #CareerOpportunity #StudentAchievement #PharmacyCareer #CampusPlacement2026 #EducationNews #JobAlertIndia #FuturePharmacists1
- *रायपुर उपखंड क्षेत्र मैं RTI कार्यकर्ता से दुर्व्यवहार,सूचना मांगने पर ग्राम विकास अधिकारी की दादागिरी, ग्राम पंचायत कार्यालय से कार्यकर्ता को धक्के देकर निकाला बाहर, रायपुर के झूठा ग्राम पंचायत का मामला, वीडियो सोशल मीडिया पर वायरल, क्षेत्र वासियों से ऐसे लापहरवा अधिकारी पर कारवाही की मांग की ।*1
- సదాశివపేట మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి1
- భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి ఈ క్రింది కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది: 1. డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 2. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 3. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిట్నెస్ మేనేజ్ మెంట్ 4. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్ట్రెంత్ అండ్ స్పోర్ట్స్ కండిషనింగ్ 5. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 6. మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 7. ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ సైన్స్) ৪. ఎం,ఏ ( యోగ) 9. ఎంఎసత ఎం 10. ఎం.ఏ. (క్రీడా జర్నలిజం) 11. ఫిట్నెస్ నిర్వహణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కావున ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హత, ఫీజు మరియు ఇతర పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను పరిశీలించాలని మరియు ఏవైనా ఇతర సందేహాలకు 0751,4000887 ఫోన్ నంబర్ ను సంప్రదించగలరని తెలిపారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి జి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.1