logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ​గణపురం:తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు హఫీజ్ ఆధ్వర్యంలో నిర్వహించగా మండల పార్టీ అధ్యక్షుడు మోతె కర్ణాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు,మాజీ సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణ చంద్ర రెడ్డి లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీ జే పాటలు,కార్యకర్తల జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ​తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు రామంచ భద్రయ్య,పెంచాల రవీందర్,కట్ల ప్రశాంతి శంకరయ్య,తోట మానస శ్రీనివాస్,పల్లెబోయిన సదయ్య, రజియా, మాజీ ఎంపీటీసీలు మంద అశోక్ రెడ్డి,కొయ్యల భద్రయ్య,నగరంపల్లి ఉపసర్పంచ్ దాంసాని శ్రీకాంత్,నాయకులు బొట్ల స్వామి,గంజి జన్నయ్య, పేరాల దేవేందర్ రావు, పిన్నింటి శ్రీనివాస్ రావు,పబ్బ రవి, మామిండ్ల సాంబయ్య, శ్రీకాంత్,పాశికంటి రామకృష్ణ, అంజద్ పాష ,గాజర్ల చింటూ, భాస్కర్ రావు,కొడారి ఓదెలు, ఇమ్రాన్,వాజిద్,తాళ్లపెల్లి సాయి,మార్క సాయి,శంకు, గ్రామ శాఖల అధ్యక్షులు ఎడెల్లి మల్లారెడ్డి,చెన్నబోయిన కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

8 hrs ago
user_User8677 గొర్రె ఎల్లయ్య యాదవ్
User8677 గొర్రె ఎల్లయ్య యాదవ్
Farmer Ghanpur (Mulug), Jayashankar Bhupalapally•
8 hrs ago
c29e7c3f-cd09-42dc-b86a-ecedddb18dd8

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ​గణపురం:తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు హఫీజ్ ఆధ్వర్యంలో నిర్వహించగా మండల పార్టీ అధ్యక్షుడు మోతె కర్ణాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు,మాజీ సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణ చంద్ర రెడ్డి లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీ జే పాటలు,కార్యకర్తల జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ​తెలంగాణ రాష్ట్ర

519b8c62-b49a-40a0-b196-b550edf26ae0

సాధకుడు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు రామంచ భద్రయ్య,పెంచాల రవీందర్,కట్ల ప్రశాంతి శంకరయ్య,తోట మానస శ్రీనివాస్,పల్లెబోయిన సదయ్య, రజియా, మాజీ ఎంపీటీసీలు మంద అశోక్ రెడ్డి,కొయ్యల భద్రయ్య,నగరంపల్లి ఉపసర్పంచ్ దాంసాని శ్రీకాంత్,నాయకులు బొట్ల స్వామి,గంజి జన్నయ్య, పేరాల దేవేందర్ రావు, పిన్నింటి శ్రీనివాస్ రావు,పబ్బ రవి, మామిండ్ల సాంబయ్య, శ్రీకాంత్,పాశికంటి రామకృష్ణ, అంజద్ పాష ,గాజర్ల చింటూ, భాస్కర్ రావు,కొడారి ఓదెలు, ఇమ్రాన్,వాజిద్,తాళ్లపెల్లి సాయి,మార్క సాయి,శంకు, గ్రామ శాఖల అధ్యక్షులు ఎడెల్లి మల్లారెడ్డి,చెన్నబోయిన కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Motam Rajesh
    1
    Post by Motam Rajesh
    user_Motam Rajesh
    Motam Rajesh
    Grain Importer ములుగు, ములుగు, తెలంగాణ•
    23 hrs ago
  • ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
    1
    ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    12 hrs ago
  • ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు... రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర... మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.... ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం. ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు. ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు. ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు. తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు. కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ... తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం. రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది. రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము. తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.... ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్. దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    1
    ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు...
రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర...
మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి....
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ....
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు.
కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం.
ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు.
ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు.
ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు.
తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు.
కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం.
మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ...
తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం.
రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది.
రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము.
తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది.
ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ....
ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది.
తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు.
రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు.
బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు.
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్.
దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు
నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    user_Venkatgoud kallepu
    Venkatgoud kallepu
    Singer రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
    2
    తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    18 hrs ago
  • తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది. 👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా? 👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
    2
    తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు
తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది.
👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా?
👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా?
అన్నది వేచి చూడాల్సిందే.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    20 hrs ago
  • వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. అన్ని చోట్లా ఛైర్మన్ పదవులను దక్కించుకుని స్థానిక సంస్థల రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. ఛైర్మన్ పీఠాల కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఘర్షణల నేపథ్యంలో వాయిదా పడిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్‌కు ఛైర్మన్ స్థానాలు దక్కాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    1
    వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. అన్ని చోట్లా ఛైర్మన్ పదవులను దక్కించుకుని స్థానిక సంస్థల రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. ఛైర్మన్ పీఠాల కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
ఘర్షణల నేపథ్యంలో వాయిదా పడిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్‌కు ఛైర్మన్ స్థానాలు దక్కాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ టీచర్ గా మారారు.‌ పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టి పాఠాలు చెప్పారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియా లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో  విద్యార్థులు శిక్షణ పొందుతుండగా, ఇంచార్జి కలెక్టర్ వారితో మాట్లాడారు.‌ వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబందించిన సెలబస్ పూర్తి అయిందా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి  అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలు పై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇంచార్జి కలెక్టర్ ఆకాంక్షించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ టీచర్ గా మారారు.‌ పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టి పాఠాలు చెప్పారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియా లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో  విద్యార్థులు శిక్షణ పొందుతుండగా, ఇంచార్జి కలెక్టర్ వారితో మాట్లాడారు.‌ వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబందించిన సెలబస్ పూర్తి అయిందా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి  అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలు పై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇంచార్జి కలెక్టర్ ఆకాంక్షించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • వరంగల్ మండలం వర్ధన్నపేటలో రోడ్డు వెడల్పు చేయకుండా డివైడర్ ఏర్పాటు చేయడంతో మరో లారీ ప్రమాదానికి గురైంది. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో అనేక వాహనాలు ప్రమాదాలకు గురై ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
    1
    వరంగల్ మండలం వర్ధన్నపేటలో రోడ్డు వెడల్పు చేయకుండా డివైడర్ ఏర్పాటు చేయడంతో మరో లారీ ప్రమాదానికి గురైంది. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో అనేక వాహనాలు ప్రమాదాలకు గురై ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.