logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం సందర్భంగా ప్రధాన వేదిక సమీపం లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ప్రధాని కార్యక్రమానికి ముందు నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, తప్పెటగుళ్లు, గరగలు, డప్పు వాయిద్యాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. గుంటూరు, చిత్తూరు, అమలాపురం, శ్రీకాకుళం, కృష్ణ, విజయవాడ, విశాఖపట్నం జిల్లాల నుండి విచ్చేసిన కళాకారులు తమ ప్రదర్శనల తో ప్రేక్షకులను రంజింపజేశారు.

1 hr ago
user_Kumar
Kumar
Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
9142bb1a-7858-4aa6-bfd6-2af7d2d8ad15
d4640bed-df3e-4e2e-9541-3532009ab244

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం సందర్భంగా ప్రధాన వేదిక సమీపం లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ప్రధాని కార్యక్రమానికి ముందు నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, తప్పెటగుళ్లు, గరగలు, డప్పు వాయిద్యాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. గుంటూరు, చిత్తూరు, అమలాపురం, శ్రీకాకుళం, కృష్ణ, విజయవాడ, విశాఖపట్నం జిల్లాల నుండి విచ్చేసిన కళాకారులు తమ ప్రదర్శనల తో ప్రేక్షకులను రంజింపజేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే... నేడు గుమ్మడికాయ కట్టిందీ మనమే 2015లో ప్రధాని మోదీ నాయకత్వంలో భోగాపురం విమానాశ్రయం ప్రకటించాం. అనుమతులు తెచ్చి 2019లో శంకుస్థాపన చేశాం భోగాపురం విమానాశ్రయానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే... నేడు గుమ్మడికాయ కట్టిందీ మనమే రెండేళ్లలో ఉత్తరాంధ్రకు 189 ప్రాజెక్టులతో 6.13 లక్షల పెట్టుబడులు తెచ్చాం. ఇవి పూర్తైతే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి
    1
    నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే... నేడు గుమ్మడికాయ కట్టిందీ మనమే
2015లో ప్రధాని మోదీ నాయకత్వంలో భోగాపురం విమానాశ్రయం ప్రకటించాం. అనుమతులు తెచ్చి 2019లో శంకుస్థాపన చేశాం
భోగాపురం విమానాశ్రయానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే... నేడు గుమ్మడికాయ కట్టిందీ మనమే
రెండేళ్లలో ఉత్తరాంధ్రకు 189 ప్రాజెక్టులతో 6.13 లక్షల పెట్టుబడులు తెచ్చాం. ఇవి పూర్తైతే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్మికులు గజపతినగరంలో కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం కార్మిక సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల సాధన కోసం జీవితాంతం అనేక పోరాటాలు చేసిన ప్రజానాయకుడు అల్తి అప్పలనాయుడని కొనియాడారు. కార్మిక సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఓమ్మి రమణ, పురం అప్పారావు, బెల్లాన శ్రీను, కోట అప్పారావు, కర్రి సురేష్, కనిమెరక శేషగిరి, తమ్మినేని కృష్ణ, లెంక ఆది, మంత్రి రామారావు తదితరులు పాల్గొన్నారు.
    1
    కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్మికులు 
గజపతినగరంలో కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం కార్మిక సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల సాధన కోసం జీవితాంతం అనేక పోరాటాలు చేసిన ప్రజానాయకుడు అల్తి అప్పలనాయుడని కొనియాడారు. కార్మిక సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఓమ్మి రమణ, పురం అప్పారావు, బెల్లాన శ్రీను, కోట అప్పారావు, కర్రి సురేష్, కనిమెరక శేషగిరి, తమ్మినేని కృష్ణ, లెంక ఆది, మంత్రి రామారావు తదితరులు పాల్గొన్నారు.
    user_Venkata Satyanarayana
    Venkata Satyanarayana
    Vizianagaram, Andhra Pradesh•
    5 hrs ago
  • నెల్లిమర్ల నగరం నుండి 18 బస్సులలో భోగాపురానికి ప్రజలు ఉత్సాహంగా .. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ప్రజలు శనివారం ఉదయం 18 బస్సులలో బోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉత్సాహంగా బయలుదేరారు. నగర కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సహకారంతో నగర ప్రజలను బస్సులలో ఎక్కించి తీసుకు వెళ్లడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. విజయనగరం జిల్లాకి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయo ప్రారంభోత్సవం కాబోతుండటంతోనే ప్రజలు ఆనందంగా బయలుదేరుతున్నామని అన్నారు.
    1
    నెల్లిమర్ల నగరం నుండి 18 బస్సులలో  భోగాపురానికి ప్రజలు ఉత్సాహంగా ..
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ప్రజలు శనివారం ఉదయం 18 బస్సులలో బోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉత్సాహంగా బయలుదేరారు. నగర కమిషనర్ కిల్లాన  అప్పలరాజు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సహకారంతో నగర ప్రజలను బస్సులలో ఎక్కించి తీసుకు వెళ్లడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. విజయనగరం జిల్లాకి  అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయo ప్రారంభోత్సవం కాబోతుండటంతోనే  ప్రజలు ఆనందంగా బయలుదేరుతున్నామని అన్నారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • రాజాం అర్టీసీ కాంప్లెక్స్ బస్సు లు లేక బస్టాండ్ నిర్మాణస్యంగా మారింది.. రాజాం ఆర్ టి సి కాంప్లెక్స్ లోశనివారం బస్సులు లేక బస్టాండ్ నిర్మాణస్యంగా మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవనికి బస్సులన్నీ తరలించడంతో కాంప్లెక్స్ ప్రయాణకులు లేక ఖాళీ అయింది. అత్యవసర ప్రయాణం చేయాల్సినవారు బస్సులు లేవని తెలుసుకుని ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళవలసి వచ్చింది.
    1
    రాజాం అర్టీసీ కాంప్లెక్స్ బస్సు లు లేక బస్టాండ్ నిర్మాణస్యంగా మారింది..
రాజాం ఆర్ టి సి కాంప్లెక్స్ లోశనివారం బస్సులు లేక బస్టాండ్ నిర్మాణస్యంగా మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవనికి బస్సులన్నీ తరలించడంతో కాంప్లెక్స్ ప్రయాణకులు లేక ఖాళీ అయింది. అత్యవసర ప్రయాణం చేయాల్సినవారు బస్సులు లేవని తెలుసుకుని ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళవలసి వచ్చింది.
    user_HARIBABU  TALADA
    HARIBABU TALADA
    Farmer రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    11 min ago
  • *భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..* VSP..భోగాపురం ఎయిర్ పోర్ట్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, రామ్మోహన్‌ నాయుడు.. 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్‌ ను పరిశీలించిన మోడీ.. ఓపెన్‌ టాప్‌ కారులో థింసా నృత్యాన్ని తిలకించిన మోడీ.. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం.. మోడీకి బొబ్బిలి వీణను బహూకరించిన సీఎం చంద్రబాబు...
    1
    *భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..*
VSP..భోగాపురం ఎయిర్ పోర్ట్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, రామ్మోహన్‌ నాయుడు.. 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్‌ ను పరిశీలించిన మోడీ.. ఓపెన్‌ టాప్‌ కారులో థింసా నృత్యాన్ని తిలకించిన మోడీ.. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం.. మోడీకి బొబ్బిలి వీణను బహూకరించిన సీఎం చంద్రబాబు...
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మడగడ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 లక్షలతో నిర్మించనున్న చేతిపంపు బోరుకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కష్టాలను దశలవారీగా తీరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మడగడ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 లక్షలతో నిర్మించనున్న చేతిపంపు బోరుకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కష్టాలను దశలవారీగా తీరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మన భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఈరోజు స్టార్ట్ అవుతుంది..... మన భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఈరోజు ఓపెన్ అవుతుంది దానికోసం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అందరూ కూడా వస్తున్నారు. అక్కడి స్థలం ఇచ్చిన వాళ్ళకి ఫ్రీగా విమానం ఎక్కించి విహారయాత్ర చేపిస్తున్నారు అక్కడున్న జనాలందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఎక్కడ వాళ్ళు ఒక్కసారి ఎత్తితే ఎంత సంతోష ఇస్తారు
    1
    మన భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఈరోజు స్టార్ట్ అవుతుంది.....
మన భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఈరోజు ఓపెన్ అవుతుంది దానికోసం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అందరూ కూడా వస్తున్నారు. అక్కడి స్థలం ఇచ్చిన వాళ్ళకి ఫ్రీగా విమానం ఎక్కించి విహారయాత్ర చేపిస్తున్నారు అక్కడున్న జనాలందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఎక్కడ వాళ్ళు ఒక్కసారి ఎత్తితే ఎంత సంతోష ఇస్తారు
    user_Parvathipuram No helmet
    Parvathipuram No helmet
    Farmer జియ్యమ్మవలస, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం ​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ​13,000 మంది పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.
    1
    గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం
​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం   దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం  గిన్నిస్  బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది.  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్  సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. 
ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ​13,000 మంది  పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా  నృత్యాన్ని ప్రదర్శించారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.