పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం అభినందనీయం - ఎమ్మెల్యే షాజహాన్ భాష - స్వాస్త్య హాస్పిటల్స్ చే ఉచిత వైద్య శిబిరం మదనపల్లె : పట్టణంలోని సత్సంగ్ స్వాస్త్య హాస్పిటల్స్ సేవా దృక్పథంతో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. బుధవారం మదనపల్లె పట్టణంలోని చంద్రకాలనీ బైపాస్ రోడ్ జహా చేనేత నగర్లో మదనపల్లె నియోజకవర్గ క్లస్టర్ ఇన్చార్జ్ రాగినేని రఘుపతినాయుడు ఆధ్వర్యంలో సత్సంగ్ స్వాస్థ్య హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పరిసర కాలనీలకు చెందిన సుమారు 200 మంది ప్రజలు శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు, చికిత్స పొందారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా శిబిరాన్ని పరిశీలించి, వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్సంగ్ ఫౌండేషన్, స్వాస్థ్య హాస్పిటల్ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ముంతాజ్ అలీ ఆధ్వర్యంలో మదనపల్లె ప్రజలకు విశేష వైద్య సేవలు అందించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్న హాస్పిటల్ యాజమాన్యం, వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటి ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో రెండో వార్డు ఇన్చార్జ్ రాగినేని కవిత, వార్డు అధ్యక్షుడు చిన్నరెడ్డప్ప, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, బూత్ ఇన్చార్జిలు శ్రీరాములు, రామాంజులునాయుడు, రామ్మోహన్, జగదీష్నాయుడు, భాస్కర్, మహబూబ్బాషా, శ్రీనివాసులు, ఐటీడీపీ కాశీశ్రీరామ్, ప్రభాకర్, తెలుగుదేశం నాయకులు ప్రవీణ్నాయుడు, ఆసిఫ్, సాంబ తదితరులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం అభినందనీయం - ఎమ్మెల్యే షాజహాన్ భాష - స్వాస్త్య హాస్పిటల్స్ చే ఉచిత వైద్య శిబిరం మదనపల్లె : పట్టణంలోని సత్సంగ్ స్వాస్త్య హాస్పిటల్స్ సేవా దృక్పథంతో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. బుధవారం మదనపల్లె పట్టణంలోని చంద్రకాలనీ బైపాస్ రోడ్ జహా చేనేత నగర్లో మదనపల్లె నియోజకవర్గ క్లస్టర్ ఇన్చార్జ్ రాగినేని రఘుపతినాయుడు ఆధ్వర్యంలో సత్సంగ్ స్వాస్థ్య హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పరిసర కాలనీలకు చెందిన సుమారు 200 మంది ప్రజలు శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు, చికిత్స పొందారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా శిబిరాన్ని పరిశీలించి,
వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్సంగ్ ఫౌండేషన్, స్వాస్థ్య హాస్పిటల్ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ముంతాజ్ అలీ ఆధ్వర్యంలో మదనపల్లె ప్రజలకు విశేష వైద్య సేవలు అందించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్న హాస్పిటల్ యాజమాన్యం, వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటి ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో రెండో వార్డు ఇన్చార్జ్ రాగినేని కవిత, వార్డు అధ్యక్షుడు చిన్నరెడ్డప్ప, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, బూత్ ఇన్చార్జిలు శ్రీరాములు, రామాంజులునాయుడు, రామ్మోహన్, జగదీష్నాయుడు, భాస్కర్, మహబూబ్బాషా, శ్రీనివాసులు, ఐటీడీపీ కాశీశ్రీరామ్, ప్రభాకర్, తెలుగుదేశం నాయకులు ప్రవీణ్నాయుడు, ఆసిఫ్, సాంబ తదితరులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
- పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు..అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి మక్కాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాతి మసీదు వీధి, నాగపాళ్యం ముడెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మొగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సోదరభావం,శాంతి,ఐక్యతను చాటుతూ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి.4
- జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.1
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత చిత్తూరు జిల్లా కుప్పం . న్యూస్.. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు2
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- పరిమళించిన తల్లి హృదయం. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన చోటు చేసుకుంటుంది. ఆకలితో ఉన్న ఒక పంది పిల్ల ఓ గోమాత చెంతకు చేరి పాలు తాగుతూ ఆకలి తీర్చుకున్న వింత ఘటన చోటుచేసుకున్నది. ఆకలితో ఉన్న ఆ పందిపిల్ల పాలు తాగుతున్నా ఆ గోమాత ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పంది పిల్ల ఆకలి తీర్చింది... అందుకే అంటారు కాబోలు తల్లి ఎక్కడైనా ఎవరైనా తల్లే..... వెల్దుర్తిలో పోలీస్స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఘటన1