Shuru
Apke Nagar Ki App…
వృద్ధులు వితంతువులు కళ్ళల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - రామమూర్తి. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కళ్ళల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పీలేరు రైతు మార్కెట్ యార్డ్ చైర్మన్ పురం రామమూర్తి అన్నారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచనలతో ఆయన శనివారం ఉదయం 6 గంటల నుండి బండ్ల వంక రాములు వారి గుడి వీధి సిల్వర్ లాడ్జి వీధి ట్రెజరీ వీధి తదితర ప్రాంతాల్లో "ఎన్టీఆర్ భరోసా" పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా "ఎన్టీఆర్ భరోసా"పథకంతో పింఛన్ పెంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల పింఛన్ అందించి ఆదుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మోసిన, జీవిత, రాధిక, ఖాదర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
SK masthan saheb
వృద్ధులు వితంతువులు కళ్ళల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - రామమూర్తి. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కళ్ళల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పీలేరు రైతు మార్కెట్ యార్డ్ చైర్మన్ పురం రామమూర్తి అన్నారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచనలతో ఆయన శనివారం ఉదయం 6 గంటల నుండి బండ్ల వంక రాములు వారి గుడి వీధి సిల్వర్ లాడ్జి వీధి ట్రెజరీ వీధి తదితర ప్రాంతాల్లో "ఎన్టీఆర్ భరోసా" పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా "ఎన్టీఆర్ భరోసా"పథకంతో పింఛన్ పెంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల పింఛన్ అందించి ఆదుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మోసిన, జీవిత, రాధిక, ఖాదర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అన్నమయ్య జిల్లా, పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసన శుక్రవారం 11వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ కొత్త విధానంతో తమ ఉపాధితో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి ఆలోచించాలని, సేవా కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ముందుకు కదిలారు.1
- పుంగనూరు లో దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ.. అన్నమయ్య జిల్లా. పుంగనూరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము. కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు. నమస్కారములతో.... పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం. పుంగనూరు......2
- ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.1
- కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా: రఘునాథ్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలనపై కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా లభిస్తోందని టీడీపీ నేత రఘునాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి లోని పుల్లయ్య తోట ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరాతీసారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం అవుతోందన్నారు.1
- గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామ సమీపంలో చెరువు దగ్గర పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు . పేకాట రాళ్లపై దాడి. గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామ సమీపంలో చెరువు దగ్గర పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గ్రామ సమీపంలోని చెరువు దగ్గర పేకాట ఆడుతున్న వాళ్లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. దీంతో పేకాట ఆడుతున్న నలుగురు మందిని అదుపులో తీసుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తుపడుతున్నారు.2
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట డాక్యుమెంట్ రైటర్లు నిరసన అన్నమయ్య జిల్లా, పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసన శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త విధానంతో తమ ఉపాధితో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించి, సేవా కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో ర్యాలీ చేసిన దస్తావేజు లేఖరులు,స్టాంప్ వెండర్లు,డిటిపి ఆపరేటర్లు, సహాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్న విషయం విధితమే! చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం సభ్యులు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు.3
- సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవం ప్రోగ్రాం ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మంటపంపల్లి పెన్నా హైస్కూల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ భావన, కరస్పాండెంట్ రామయ్య, ప్రిన్సిపల్ దాక్షాయణి అధ్వర్యంలొ "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు" పురస్కరించుకొని సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు కీటక జనిత వ్యాధుల గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా సుబ్బరాయుడు గారు మాట్లాడుతు ప్రతి ఒక కుటుంబము చెక్,క్లీన్,కవర్ పాటించాలని తెలియపరిచారు. అలాగనే ప్రతిఒక్కరు దోమతెరలలోనే నిద్రించాలని తెలియపరిచారు.డాక్టర్ భావన గారు మాట్లాడుతు14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అమ్మాయిలందరు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు.సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతు ఆగస్టు 3నుండి 8 వరకు జరగబోవు డిపిటి,టిడి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 5,10,16 సంవత్సరాల పిల్లలు వ్యాక్సిన్ వేపించుకోవాలని తెలియ జేశారు.అనంతరం మంటపంపల్లి గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము,MLHP చంద్రిక,స్త్రీ ఆరోగ్య కార్యకర్త సరోజ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవం ప్రోగ్రాం ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మంటపంపల్లి పెన్నా హైస్కూల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ భావన, కరస్పాండెంట్ రామయ్య, ప్రిన్సిపల్ దాక్షాయణి అధ్వర్యంలొ "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు" పురస్కరించుకొని సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు కీటక జనిత వ్యాధుల గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా సుబ్బరాయుడు గారు మాట్లాడుతు ప్రతి ఒక కుటుంబము చెక్,క్లీన్,కవర్ పాటించాలని తెలియపరిచారు. అలాగనే ప్రతిఒక్కరు దోమతెరలలోనే నిద్రించాలని తెలియపరిచారు.డాక్టర్ భావన గారు మాట్లాడుతు14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అమ్మాయిలందరు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు.సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతు ఆగస్టు 3నుండి 8 వరకు జరగబోవు డిపిటి,టిడి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 5,10,16 సంవత్సరాల పిల్లలు వ్యాక్సిన్ వేపించుకోవాలని తెలియ జేశారు.అనంతరం మంటపంపల్లి గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము,MLHP చంద్రిక,స్త్రీ ఆరోగ్య కార్యకర్త సరోజ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.1
- సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తూ బస్సును నిర్లక్ష్యముగా నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్. అన్నమయ్య జిల్లా: మదనపల్లి నుండి చిత్తూరు వెళుతున్న బస్సులో సెల్ ఫోన్లో నిమగ్నమైన డ్రైవర్ ఒక చేతితో ఫోన్ చూస్తూ, మరొక్క చేతితో బస్సును నడుపుతున్నాడు. ఈ నిర్లక్ష్యము వలన ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు భాద్యులు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి భాద్యత లేని డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరగక మునుపే సంబందిత అధికారులు స్పందిచి మరలా ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేయకుండా వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతున్న డ్రైవర్ ను ప్రయాణికుడు తన ఫోన్ లో చిత్రీకరించడంతో వెలుగులోకి వచ్చింది. ఆ బస్సు పలమనేరు డిపోకు చెందిన బస్సు గా గుర్తింపు.1