*🔹సామెల గ్రామంలో చలివేంద్రం ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క* వాంకిడి: సామెల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీసీసీ *ప్రెస్ రిలీజ్* *తేదీ: 17-04-2026* అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్రే అనిల్ కుమార్ ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రయాణికులకు చల్లని తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ వాడ్ గురె సంతోష్ తెలిపారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ..ఎండాకాలంలో తాగునీటి కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి సమయంలో చలివేంద్రాల ఏర్పాటు చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించే ఈ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షుడు గుర్నులే నారాయణ,సర్పంచ్ వాడ్ గురె సంతోష్,ఉప సర్పంచ్ రేపాక నాగభూషణం, వార్డు సభ్యులు,పార్టీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు. *డీసీసీ కార్యాలయం, కుమురం భీం ఆసిఫాబాద్*
*🔹సామెల గ్రామంలో చలివేంద్రం ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క* వాంకిడి: సామెల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీసీసీ *ప్రెస్ రిలీజ్* *తేదీ: 17-04-2026* అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్రే అనిల్ కుమార్ ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రయాణికులకు చల్లని తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ వాడ్ గురె సంతోష్ తెలిపారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ..ఎండాకాలంలో తాగునీటి కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి సమయంలో చలివేంద్రాల ఏర్పాటు చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించే ఈ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షుడు గుర్నులే నారాయణ,సర్పంచ్ వాడ్ గురె సంతోష్,ఉప సర్పంచ్ రేపాక నాగభూషణం, వార్డు సభ్యులు,పార్టీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు. *డీసీసీ కార్యాలయం, కుమురం భీం ఆసిఫాబాద్*
- ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణ సాధ్యతపై రక్షణ శాఖ, AAI మరియు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో అధ్యయనం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ ఫీల్డ్ విజిట్ను ఏర్పాటు చేయడం ఆనందకరమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం, సంబంధిత కేంద్ర మంత్రులు మరియు తెలంగాణ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఢిల్లీలో జరిగే తదుపరి సమావేశంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్పై మరింత స్పష్టత వస్తుందని ఎమ్మెల్యే గారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు4
- ఆదిలాబాద్ జిల్లా : ప్రజా పాలన ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఎస్టీయూ భవన్లో జరిగిన ప్రత్యేక మున్సిపల్ స్థాయి సమావేశంలో ప్రసంగించిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్1
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ప్రక్రియ నేతకాని సామాజిక వర్గంలో పెను మంటలు రేపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధాన శక్తిగా ఉన్న నేతకానీలను జనాభా లెక్కల్లో విస్మరించడంపై ఆ సామాజిక వర్గ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వివక్షను నిరసిస్తూ నేతకాని విద్యార్థి సంఘం (TNMVS OUJAC) రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. "మా ఉనికిని తుడిచేస్తారా?" - ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిని ప్రసాద్ కులగణన నివేదికల్లో నేతకాని కులానికి కనీస గుర్తింపు ఇవ్వకపోవడంపై ఓయూ వేదికగా జరిగిన సమావేశంలో సాయిని ప్రసాద్ నేత మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు కుట్ర పూరిత వివక్ష: "తెలంగాణ గడ్డపై 12 లక్షల జనాభా కలిగిన మా సమాజాన్ని లెక్కల్లో చూపకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, నేతకానీల గొంతు నొక్కే ప్రయత్నం." 40 నియోజకవర్గాల్లో పంజా: రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతకాని ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారని, తమను తక్కువ అంచనా వేస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. తొత్తుల పాలన: ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ముకాస్తూ, అత్యంత వెనుకబడిన నేతకానీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణ సిద్ధం ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు నేతకాని బిడ్డలంతా ఏకతాటిపైకి వచ్చి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.1
- రోడ్డు నియమాలను అందరూ పాటించాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అలైవ్ అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ అప్పాల జలపతి, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఉన్నారు.1
- సిర్పూర్ (టి) మండల కేంద్రంలో నోయిడా కార్మికులపై లాఠీచార్జ్, అరెస్టులకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల అడ్డా వద్ద నిరసన జరిగింది. జిల్లా జాయింట్ సెక్రటరీ వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ, కార్మికులు కనీస వేతనాలు, 8 గంటల పని దినం, కాంట్రాక్ట్ విధానం రద్దు వంటి డిమాండ్ల కోసం శాంతియుతంగా పోరాడుతుండగా అణచివేత చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. కార్మికుల సమస్యలను పక్కన పెట్టి నిర్బంధాలు, అరెస్టులు చేయడం తగదని, వెంటనే ఈ చర్యలు నిలిపి డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- *ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు త్వరితగతిన అట్టి వ్యక్తిని కాపాడడానికి సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుంది పోలీస్ కమిషనర్ వెల్లడి* *జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ* *ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతి అవగాహన కలిగి ఉండవలెను* రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న *99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో* భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం ప్రజలలో ట్రాఫిక్ నియమాలు పట్ల బాధ్యత భావం పెంపొందించడం లక్ష్యంగా అరైవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు . ఇందులో భాగముగా నేడు ఐదవ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు బ్లూ కోర్టు సిబ్బందికి మరియు ఆటో డ్రైవర్లకు సిపిఆర్ పద్ధతి పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్*., గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పోలీస్ కమిషనర్ గారు పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా CPR (Cardiopulmonary Resuscitation) విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతి పై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ గారు తెలిపారు. ఈ శిక్షణలో సిపిఆర్ విధానం , ప్రాథమిక ప్రథమ చికిత్స (First Aid), అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. ప్రతి పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సిపిఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) శ్రీ జి.బస్వా రెడ్డి , నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సీ.పి శ్రీ మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , ట్రాఫిక్ సి ఐ శ్రీ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ వినోద్ , డాక్టర్ శ్రీ విశాల్ (ఐ.ఎమ్.ఏ ప్రెసిడెంట్ ) , డాక్టర్ రామనేశ్వర్ ( న్యూరాలజిస్ట్ , ( ఐ.ఎమ్.ఏ ట్రెజరీ ), డాక్టర్ శ్రీశైలం (పీడియాట్రెస్ట్) , డాక్టర్ విట్టల్ ఆనస్తేషియా స్పెషలిస్ట్, మరియు ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోర్ట్ సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.3
- I stand with you, and once I am in power, I will give them back to you. Together, we will protect your livelihoods and ensure that privatization never harms Andhra Pradesh’s future.1