యువత నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని చేరుకోవాలి.. *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* శ్రీ చైతన్య డిగ్రీ మరియు పీజి కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో బాలాజీనగర్ లో జనవరి 8న నిర్వహించిన 5కే వాకథాన్ మరియు గంజాయిపై అవగాహన కార్యక్రమానికి విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – యువత దేశానికి వెన్నుముక అని, వారు చెడు మార్గం వైపు వెళ్ళకుండా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని చేరుకొని తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడకు వచ్చిన విద్యార్ధులను ఉద్దేశించి కొన్ని ముఖ్య విషయాల గురించి వివరించారు. ఇటీవల కాలంలో చాలామంది వ్యక్తులు సైబరు మోసాలకు గురవుతున్నారని, నేరాలు జరుగుతున్న తీరును వివరించి, అప్రమత్తంగా ఉండాలని కోరారు. అమాయక ప్రజలను ముఖ్యంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది సైబరు నేరగాళ్ళు వాట్సాప్ కాల్స్ చేసి తమను డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, ఇంటి నుండి బయటకు వెళ్ళ వద్దని, మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నారని, ఆధార్ కార్డును దుర్వినియోగం చేసారని, మీ పిల్లల పై డ్రగ్స్ కేసు నమో దయ్యిందని, సిబిఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ లేదా సిఐడి లేదా కోర్టు నుండి అధికారులుగా పరిచయం చేసుకొని, బెదిరింపులకు పాల్పడుతుంటారని, చివరకు సహాయం చేస్తున్నట్లుగా నమ్మబలికి డబ్బులను కొల్లగొడుతు న్నారన్నారు. ఇటువంటి నేరగాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోనులు చేస్తే సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1930కు అందించాలన్నారు. పోలీసులు 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి మీకు సహాయపడతారని అన్నారు. అదే విధంగా జిల్లాలో గత సంవత్సరం సుమారు 250మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారని, అందులో ఎక్కువ మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన చనిపోయారని తెలిపుతూ, రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కలిపించి, వాహనాలపై వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా రక్షణ పొందాలని, మీ ప్రాంతంలో ఉండే పెద్దలు, తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్ధులకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి వాటి జోలికి వెళ్తే జైలుకు పోవడం తప్పదని, జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఎవరైనా గంజాయి వాడుతున్నట్టుగాని, అమ్ముతున్నట్టుగాని, తరలిస్తున్నట్టుగాని తెలిస్తే సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1972కు అందించాలన్నారు. విజయనగరం పట్టణంలో సుమారు 25మంది పోలీసు సిబ్బందిని స్పెషల్ టీమ్స్ గా ఏర్పాటు చేసి గంజాయి వాడకం, తరలించడం, అమ్మటం పై నిఘా పెడుతున్నామన్నారు. ప్రతి మహిళ ఫోనులో శక్తి యాప్ ఉండాలని, శక్తి యాప్ ఉంటే ఆపద సమయంలో పోలీసుల సహాయం వెంటనే పొందవచ్చునని అన్నారు. విద్యార్ధులకు మహిళా చట్టాలు మరియు పోక్సో చట్టం వాటి శిక్షల గురించి జిల్లా ఎస్పీ వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు కళాశాల టి షర్టు ను ఆవిష్కరించారు. తదుపరి జిల్లా ఎస్పీ గారు బాలాజీనగర్ నుండి 5కే వాకథాన్ ను జండా ఊపి ప్రారంభించి విద్యార్ధులతో కలిసి వాకథాన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా సీనియర్ జనసేన నాయకుడు అవనాపు విక్రం గారు, శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ ఎ.ఎన్.ఎం.రాజు, సెక్రటరీ మరియు కరెస్పాండంట్ ఎ.కిరణ్ కుమార్ రాజు, ప్రిన్సిపాల్ పి.బి.బి.ఎల్.ఎన్.రాజు గార్లు, కళాశాల విద్యార్ధులు, పోలీసు అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యువత నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని చేరుకోవాలి.. *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* శ్రీ చైతన్య డిగ్రీ మరియు పీజి కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో బాలాజీనగర్ లో జనవరి 8న నిర్వహించిన 5కే వాకథాన్ మరియు గంజాయిపై అవగాహన కార్యక్రమానికి విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – యువత దేశానికి వెన్నుముక అని, వారు చెడు మార్గం వైపు వెళ్ళకుండా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని చేరుకొని తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడకు వచ్చిన విద్యార్ధులను ఉద్దేశించి కొన్ని ముఖ్య విషయాల గురించి వివరించారు. ఇటీవల కాలంలో చాలామంది వ్యక్తులు సైబరు మోసాలకు గురవుతున్నారని, నేరాలు జరుగుతున్న తీరును వివరించి, అప్రమత్తంగా ఉండాలని
కోరారు. అమాయక ప్రజలను ముఖ్యంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది సైబరు నేరగాళ్ళు వాట్సాప్ కాల్స్ చేసి తమను డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, ఇంటి నుండి బయటకు వెళ్ళ వద్దని, మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నారని, ఆధార్ కార్డును దుర్వినియోగం చేసారని, మీ పిల్లల పై డ్రగ్స్ కేసు నమో దయ్యిందని, సిబిఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ లేదా సిఐడి లేదా కోర్టు నుండి అధికారులుగా పరిచయం చేసుకొని, బెదిరింపులకు పాల్పడుతుంటారని, చివరకు సహాయం చేస్తున్నట్లుగా నమ్మబలికి డబ్బులను కొల్లగొడుతు న్నారన్నారు. ఇటువంటి నేరగాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోనులు చేస్తే సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1930కు అందించాలన్నారు. పోలీసులు 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి మీకు సహాయపడతారని అన్నారు. అదే విధంగా జిల్లాలో గత
సంవత్సరం సుమారు 250మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారని, అందులో ఎక్కువ మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన చనిపోయారని తెలిపుతూ, రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కలిపించి, వాహనాలపై వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా రక్షణ పొందాలని, మీ ప్రాంతంలో ఉండే పెద్దలు, తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్ధులకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి వాటి జోలికి వెళ్తే జైలుకు పోవడం తప్పదని, జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఎవరైనా గంజాయి వాడుతున్నట్టుగాని, అమ్ముతున్నట్టుగాని, తరలిస్తున్నట్టుగాని తెలిస్తే సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1972కు అందించాలన్నారు. విజయనగరం పట్టణంలో సుమారు 25మంది పోలీసు సిబ్బందిని స్పెషల్ టీమ్స్ గా ఏర్పాటు చేసి గంజాయి వాడకం, తరలించడం, అమ్మటం పై నిఘా పెడుతున్నామన్నారు. ప్రతి
మహిళ ఫోనులో శక్తి యాప్ ఉండాలని, శక్తి యాప్ ఉంటే ఆపద సమయంలో పోలీసుల సహాయం వెంటనే పొందవచ్చునని అన్నారు. విద్యార్ధులకు మహిళా చట్టాలు మరియు పోక్సో చట్టం వాటి శిక్షల గురించి జిల్లా ఎస్పీ వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు కళాశాల టి షర్టు ను ఆవిష్కరించారు. తదుపరి జిల్లా ఎస్పీ గారు బాలాజీనగర్ నుండి 5కే వాకథాన్ ను జండా ఊపి ప్రారంభించి విద్యార్ధులతో కలిసి వాకథాన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా సీనియర్ జనసేన నాయకుడు అవనాపు విక్రం గారు, శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ ఎ.ఎన్.ఎం.రాజు, సెక్రటరీ మరియు కరెస్పాండంట్ ఎ.కిరణ్ కుమార్ రాజు, ప్రిన్సిపాల్ పి.బి.బి.ఎల్.ఎన్.రాజు గార్లు, కళాశాల విద్యార్ధులు, పోలీసు అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- 'మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్ సౌక ర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూర మవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. ఏళ్లు గడుస్తున్నా మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందిం చాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావ లస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు. వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించు కుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పల రాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు.1
- फिल्मी हीरो बनने की सनक: युवती को इंप्रेस करने के लिए रची नकली एक्सीडेंट की साजिश, दो युवक गिरफ्तार1
- నరసన్నపేట: సంక్రాంతికి ఊరెళితే సమాచారం ఇవ్వండి.. సీఐ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా తమ ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రయాణాల సమయంలో ఇళ్లల్లోని విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. ముందుగా సమాచారం ఇస్తే, ఆయా గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచడం ద్వారా భద్రత కల్పించబడుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.1
- సంతబొమ్మాళి, జనవరి 9,సంతబొమ్మాళి మండలం బోరుభద్ర, దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయు లు ఆధ్వర్యంలో శుక్రవారం భోగి, సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యా యులు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. డూడూ బసవన్నలు ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీ, స్లో సైక్లింగ్ తదితర ఆటలు నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక పాటలకు డాన్స్లు వేశారు. హరిదాసు,సంక్రాంతి గొబ్బెమ్మలు, కోలాటం సాంప్రదాయ నృత్యాలు నిర్వహించారు సాంప్రదాయ వంటలు వాళ్లు విషయాలపై సాంస్కృతికంగా తెలిపారు.4
- సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే ఎంజీఆర్. ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పష్టం చేసారు. ఈ మేరకు గురువారం నియోజకవర్గ పరిధి కొత్తూరు మండలంలో గల బలద గ్రామానికి చెందిన బెహర శంకరరావు మేడపై నుండి జారీ పడిపోవడంతో రెండు కాళ్ళు విరిగి ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ స్థానిక నాయుకులు ద్వారా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వద్ద వివరించారు. దీంతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పందిస్తూముఖ్యమంత్రి సహాయానిదికి దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 80,916/- రూపాయిలు చెక్ ను గురువారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి, సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవల ౦ అర్హతే ఆధారంగా నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియో జక వర్గంలో గత పాలకులు ఏరోజైనా సీఎం సహాయనిది కోసం ఒక్క దరఖాస్తు అయిన చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు ఉన్నారు.2
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల నందు సంక్రాంతి సంబరాలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహముతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి, పాటశాల అవరణంతా మామిడి తోరణాలతో, రంగు రంగుల రంగవల్లికలు తో తీర్చిదిద్దారు. విద్యార్థులు వేసిన హరిదాసు, జంగమయ్య, సోదమ్మ వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చెరకుగడలతో, క్రొత్తకుండలో పాలు పొంగించిడము, గొబ్బెమ్మలు, భోగి మంటలతో కోలాహలంగా పండుగ వాావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమానికి మండల విద్యాధికారులు చిన్నవాడు, అర్జునుడు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.1
- 🙏🙏1
- भारत सरकार ने 100 mg से ज्यादा डोज वाली निमेसुलाइड दवाओं पर रोक लगा दी है। यह पेनकिलर और एंटी‑इंफ्लेमेटरी दवा आमतौर पर बुखार, सिरदर्द और बदन दर्द में ली जाती थी, लेकिन ज्यादा मात्रा में लेने से लिवर और किडनी को नुकसान पहुंच सकता है। स्वास्थ्य मंत्रालय और डॉक्टरों ने बिना सलाह दवा लेने से बचने और बच्चों को यह दवा न देने की चेतावनी दी है।1