వృద్ధాప్య జీవితంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతంగా జీవించే హక్కు ఉంది : - జనగామ జిల్లా చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది మంచాల రవీందర్ - ఉచిత న్యాయ సహాయం కోసం వయోవృద్ధులు 15100 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించవచ్చు లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చు. జనగామ : ప్రతి మనిషి వృద్ధాప్య జీవితంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతంగా జీవించే హక్కు ఉందని జనగామ జిల్లా చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది మంచాల రవీందర్ అన్నారు. మంగళవారం ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో శ్రీ రాజేశ్వరి వయోవృద్ధ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జనగామ జిల్లా చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది మంచాల రవీందర్ మాట్లాడుతూ మంచాల రవీందర్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు న్యాయ వ్యవస్థ కట్టుబడి ఉందని తెలిపారు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వయోవృద్ధులు తమ మలి దశ జీవితంలో సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కును కలిగి ఉన్నారని గుర్తు చేశారు. బిపి, షుగర్ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలి అని సూచించారు. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల పోషణ, సంక్షేమ చట్టం - 2007 ద్వారా వయోవృద్ధులకు పూర్తి స్థాయి చట్టబద్ధ రక్షణ లభిస్తుందని తెలిపారు. పిల్లలు లేదా వారసులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఈ చట్టం ద్వారా న్యాయం పొందవచ్చని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాలతో బాధపడుతున్న వయోవృద్ధులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, ఉచిత న్యాయవాది సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉచిత న్యాయ సహాయం కోసం వయోవృద్ధులు తమ సమస్యల పరిష్కారం కోసం లేదా చట్టపరమైన సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించ వచ్చని తెలియజేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు ప్రత్యేక సేవలను అందిస్తున్న వారిని వారి సంతక పథకాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రాజేశ్వరి వృద్ధాశ్రమ నిర్వాహకురాలు రాజేశ్వరి, పిఎల్వి బి.రాజశేఖర్, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ ఆర్.సీతారామరాజు, మనోహర్, శ్రీను తదితరులు సుమారు 20 మంది వృద్ధులు పాల్గొన్నారు.
వృద్ధాప్య జీవితంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతంగా జీవించే హక్కు ఉంది : - జనగామ జిల్లా చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది మంచాల రవీందర్ - ఉచిత న్యాయ సహాయం కోసం వయోవృద్ధులు 15100 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించవచ్చు లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చు. జనగామ : ప్రతి మనిషి వృద్ధాప్య జీవితంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతంగా జీవించే హక్కు ఉందని జనగామ జిల్లా చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది మంచాల రవీందర్ అన్నారు. మంగళవారం ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో శ్రీ రాజేశ్వరి వయోవృద్ధ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జనగామ జిల్లా చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది మంచాల రవీందర్ మాట్లాడుతూ మంచాల రవీందర్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు న్యాయ వ్యవస్థ కట్టుబడి ఉందని తెలిపారు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వయోవృద్ధులు తమ మలి దశ జీవితంలో సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కును కలిగి ఉన్నారని గుర్తు చేశారు. బిపి, షుగర్ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలి అని సూచించారు. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల పోషణ, సంక్షేమ చట్టం - 2007 ద్వారా వయోవృద్ధులకు పూర్తి స్థాయి చట్టబద్ధ రక్షణ లభిస్తుందని తెలిపారు. పిల్లలు లేదా వారసులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఈ చట్టం ద్వారా న్యాయం పొందవచ్చని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాలతో బాధపడుతున్న వయోవృద్ధులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, ఉచిత న్యాయవాది సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉచిత న్యాయ సహాయం కోసం వయోవృద్ధులు తమ సమస్యల పరిష్కారం కోసం లేదా చట్టపరమైన సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించ వచ్చని తెలియజేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు ప్రత్యేక సేవలను అందిస్తున్న వారిని వారి సంతక పథకాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రాజేశ్వరి వృద్ధాశ్రమ నిర్వాహకురాలు రాజేశ్వరి, పిఎల్వి బి.రాజశేఖర్, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ ఆర్.సీతారామరాజు, మనోహర్, శ్రీను తదితరులు సుమారు 20 మంది వృద్ధులు పాల్గొన్నారు.
- వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.1
- హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జ తెలంగాణ ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జన తెలంగాణ ఉద్యోగ జేఏసీ (TGEJAC) పిలుపు మేరకు హైదరాబాద్లో నిర్వహించిన మహాధర్నాలో మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్లోని అన్ని సంఘాల నాయకులు, వైద్యులు, వైద్య ఆరోగ్య ఉద్యోగులు భారీగా పాల్గొని తమ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా TGO Doctors Forum & TMPHDA అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్ మాట్లాడుతూ: 🔴 2వ PRCను వెంటనే అమలు చేయాలి 🔴 6 పెండింగ్ DAలను విడుదల చేయాలి 🔴 OPSను పునరుద్ధరించాలి 🔴 పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి 🔴 EHSలోని లోటుపాట్లను పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో, *TGEJAC చైర్మన్ మారం జగదీష్ అన్నగారు, జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ అన్నగారి నాయకత్వంలో సెప్టెంబర్ 10న “చలో హైదరాబాద్”* కార్యక్రమాన్ని నిర్వహించి, లక్షలాది ఉద్యోగులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 🤝 మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ ఐక్య గళం ఈ మహాధర్నాలో వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. డా. కిరణ్ మాదాల డా. వెంకట్ యాదవ్ శ్రీనివాస్ కొప్పునమోని శ్రీనివాస్ మెంగా సుజాత రాథోడ్ దేవిక రొక్కం బత్తిని సుదర్శన్ గౌడ్ డా. రవికుమార్ ✊🏻 ఐక్యంగా నిలబడదాం… హక్కులు సాధించుకుందాం ,జై TGEJAC✊🏻1
- సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.2
- అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరి ఓటు పరిరక్షణే SIR-2 లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బోనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో SIR-2 వార్డు సభ నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రజలతో కలిసి నేలపై కూర్చొని సభ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై SIR-2 కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి అర్హుడి ఓటు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భువనగిరి సర్ కోఆర్డినేటర్ ఇ.వి. శ్రీనివాస్ రావు మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ , వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవెస్ చిస్తి PACS చైర్మన్ కొండల్ రెడ్డి ,RDO కృష్ణారెడ్డి గ, MRO జగన్ , పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ , కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు BLA లు పాల్గొన్నారు... ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన ఓటరు జాబితా – ప్రజాస్వామ్య పరిరక్షణే మనందరి లక్ష్యం అని నాయకులు పేర్కొన్నారు.4
- గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.1
- హనుమకొండలో హరీశ్రావు అరెస్ట్.. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1
- నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- లారీ బోల్తాపడి పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్........... జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది.గురువారం జరిగిన ఈ ఆకస్మిక సంఘటనలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పై లారీ పడడంతో పైప్ లైన్ పగిలిపోయినట్లు స్థానికులు తెలిపారు.దీంతో కొడకండ్ల,పెద్దవంగర మండలాల గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1