112 call కు పిర్యాదు చేసిన 45 నిమిషాల వ్యవదిలోనే తప్పిపోయిన బాలికఆచూకీ కనిపెట్టిన మండపేట టౌన్ పోలీస్.... మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారేడుబాక గ్రామంలో గల సూర్యచంద్ర ఘీ ఫ్యాక్టరీ నందు బీహార్ రాష్ట్రమునకు సంబంధించిన వారు వారి కుటుంబలతో పాటుగా ఇక్కడ నివసిస్తూ, ఈ ఫ్యాక్టరీ నందు పనిచేయుచున్నారు. వారిలో రేణుదేవి అను ఆమె యొక్క సుమారు 15 సంవత్సరాల వయసు గల కుమార్తె, మొబైల్ ఫోన్ నందు రీల్స్ చేస్తుందనే కారణంతో, ఆ బాలికను ఆమె తల్లిదండ్రులు మందలించారు. దాని నిమిత్తం ఆ బాలిక నిన్న అనగా ది.30.07.2026వ తేదీన మధ్యాహ్నం 01.00 గంటకు వారు నివసించే ప్రదేశము నుండి ఒంటరిగా వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆ బాలిక కోసం ది.30.07.2026వ రాత్రి 9:15 నిమిషాల వరకు వెతికారు. కాని ఆ బాలిక యొక్క ఆచూకీ లభించలేదు. ది.30.07.2026వ రాత్రి 9:15 నిమిషాలకు బాలిక తల్లిదండ్రులు 112 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే మండపేట పట్టణ పోలీసు వారు స్పందించి ధవలేశ్వరం సిఐ & రాజమహేంద్రవరం RPF – CI వారి సహకారంతో మరియు తూర్పు గోదావరి జిల్లా Command & Control సమన్వయంతో సాంకేతికను ఉపయోగించి, 45 నిమిషాల వ్యవధిలోనే ఆ బాలికను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నందు గుర్తించి, ఆ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించినారు. ఈ సందర్భంగా మండపేట పట్టణ సీ.ఐ. డి.సురేష్ మాట్లాడుతూ... మండపేట పట్టణ పరిధిలో ప్రజలు లేదా బాధితులు 112 కాల్ కు ఫిర్యాదు చేసిన యెడల, 5 నిమిషాలు వ్యవధిలోనే సంఘటన స్థలానికి చేరుకుని త్వరితగతిన సమస్యపై చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసినారు.
112 call కు పిర్యాదు చేసిన 45 నిమిషాల వ్యవదిలోనే తప్పిపోయిన బాలికఆచూకీ కనిపెట్టిన మండపేట టౌన్ పోలీస్.... మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారేడుబాక గ్రామంలో గల సూర్యచంద్ర ఘీ ఫ్యాక్టరీ నందు బీహార్ రాష్ట్రమునకు సంబంధించిన వారు వారి కుటుంబలతో పాటుగా ఇక్కడ నివసిస్తూ, ఈ ఫ్యాక్టరీ నందు పనిచేయుచున్నారు. వారిలో రేణుదేవి అను ఆమె యొక్క సుమారు 15 సంవత్సరాల వయసు గల కుమార్తె, మొబైల్ ఫోన్ నందు రీల్స్ చేస్తుందనే కారణంతో, ఆ బాలికను ఆమె తల్లిదండ్రులు మందలించారు. దాని నిమిత్తం ఆ బాలిక నిన్న అనగా ది.30.07.2026వ తేదీన మధ్యాహ్నం 01.00 గంటకు వారు నివసించే ప్రదేశము నుండి ఒంటరిగా వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆ బాలిక కోసం ది.30.07.2026వ రాత్రి 9:15 నిమిషాల వరకు వెతికారు. కాని ఆ బాలిక యొక్క ఆచూకీ లభించలేదు. ది.30.07.2026వ రాత్రి 9:15 నిమిషాలకు బాలిక తల్లిదండ్రులు 112 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే మండపేట పట్టణ పోలీసు వారు స్పందించి ధవలేశ్వరం సిఐ & రాజమహేంద్రవరం RPF – CI వారి సహకారంతో మరియు తూర్పు గోదావరి జిల్లా Command & Control సమన్వయంతో సాంకేతికను ఉపయోగించి, 45 నిమిషాల వ్యవధిలోనే ఆ బాలికను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నందు గుర్తించి, ఆ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించినారు. ఈ సందర్భంగా మండపేట పట్టణ సీ.ఐ. డి.సురేష్ మాట్లాడుతూ... మండపేట పట్టణ పరిధిలో ప్రజలు లేదా బాధితులు 112 కాల్ కు ఫిర్యాదు చేసిన యెడల, 5 నిమిషాలు వ్యవధిలోనే సంఘటన స్థలానికి చేరుకుని త్వరితగతిన సమస్యపై చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసినారు.
- ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.1
- డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- బాధితులను కాదు.. నిందితులను పరామర్శించడం దారుణం: కొల్లు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పర్యటనపై రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఓదార్చడం కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పరామర్శ పేరుతో గంజాయి బ్యాచ్ను పోగేసి ప్రదర్శనలు నిర్వహించడం అవసరమా అని జగన్ను ప్రశ్నించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కేసులో ఓ యాదవ యువకుడు మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా జైలులో ఉన్న నిందితులను ములాఖత్ పేరుతో కలవడం సిగ్గుచేటని అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చకుండా నిందితులను పరామర్శించడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్ఐ పట్ల జగన్ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. జైలు వద్ద ప్రదర్శనలు నిర్వహించేందుకే కావాలనే సాయంత్రం 5 గంటల వరకు వెళ్లకుండా రాజకీయ డ్రామా చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు, పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జగన్కు సూచించారు.1
- వికలాంగులకు వీల్చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్ఐ వెంకటేష్ అభినందించారు.1
- కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ప్రజాదర్బార్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1