వాల్మీకి విద్య చైతన్య కమిటీ సమావేశం నిర్వహించి కమిటీ ఏర్పాటు గద్వాల: జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో చదువును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, చదువు ఉంటే అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలనే తపనతో కేటి దొడ్డి మండలం లో,వాల్మీకి విద్యా చైతన్య కమిటీ ని కేటీ దొడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది. కేటి దొడ్డి అధ్యక్షులు:కుచినెర్ల సుధాకర్ ప్రధాన కార్యదర్శి:కేటి దొడ్డి జంగిలప్ప , కోశాధికారి చింతలకుంట శ్రీకాంత్ ఉపాధ్యక్షులు నందిని చిన్న నాగేష్ కేటి దొడ్డి సాయన్న కుచినేర్ల కృష్ణ సోంపురం మహేష్ పాగుంట కృష్ణ కాంతు చింతలకుంట ఉమేష్ చేయడం వెంకటేష్ మల్లాపురం లక్ష్మన్న గువ్వల దీన్నే ఆనందు ఓమిత్యాల వీరేశు వెంకటాపురం శ్రీను గంగనపల్లి జయన్న కొండాపురం గోపి రంగాపురం వీరేష్ మల్లాపురం రవి ఈ కార్యక్రమంలో జిల్లా వాల్మీకిఉద్యోగ సంఘం అధ్యక్షులు, మేడికొండ ఈశ్వర్,జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘ ప్రధాన కార్యదర్శి J. ఎల్ల స్వామి,, జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘ మాజీ అధ్యక్షులు తుమ్మలచెరువు ఆంజనేయులు,, కేటి దొడ్డి మండల సేవా సంఘం అధ్యక్షులు, నందిన్నె నాగేష్ జిల్లా వాల్మీకి , జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘ ఉపాధ్యక్షులు బిజ్వారం తిమ్మప్ప,జిల్లా వాళ్లకి ఉద్యోగ సంఘ ఉపాధ్యక్షులు, గొందిమల్ల రామకృష్ణ జిల్లా వాల్మీకు ఉద్యోగ సంఘ ఉపాధ్యక్షులు నందిన్నె మల్లికార్జున్ కేటి దొడ్డి మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు తిప్పన్న నందిన్నె గ్రామ సర్పంచ్ వెంకటేష్ గువ్వల దీన్నే సర్పంచ్ ఆంజనేయులు కేటి దొడ్డి మండల వాల్మీకి నాయకులు కొండన్న,కేటి దొడ్డి వాల్మీకి నాయకులు రవిబాబు, గ్రామ ఉపసర్పంచ్లు వార్డ్ మెంబర్లు వాల్మీకి పెద్దలు తదితరులు పాల్గొన్నారు
వాల్మీకి విద్య చైతన్య కమిటీ సమావేశం నిర్వహించి కమిటీ ఏర్పాటు గద్వాల: జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో చదువును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, చదువు ఉంటే అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలనే తపనతో కేటి దొడ్డి మండలం లో,వాల్మీకి విద్యా చైతన్య కమిటీ ని కేటీ దొడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది. కేటి దొడ్డి అధ్యక్షులు:కుచినెర్ల సుధాకర్ ప్రధాన కార్యదర్శి:కేటి దొడ్డి జంగిలప్ప , కోశాధికారి చింతలకుంట శ్రీకాంత్ ఉపాధ్యక్షులు నందిని చిన్న నాగేష్ కేటి దొడ్డి సాయన్న కుచినేర్ల కృష్ణ సోంపురం మహేష్ పాగుంట కృష్ణ కాంతు చింతలకుంట ఉమేష్ చేయడం వెంకటేష్ మల్లాపురం లక్ష్మన్న గువ్వల దీన్నే ఆనందు ఓమిత్యాల వీరేశు వెంకటాపురం శ్రీను గంగనపల్లి జయన్న కొండాపురం గోపి రంగాపురం వీరేష్ మల్లాపురం రవి ఈ కార్యక్రమంలో జిల్లా వాల్మీకిఉద్యోగ సంఘం అధ్యక్షులు, మేడికొండ ఈశ్వర్,జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘ ప్రధాన కార్యదర్శి J. ఎల్ల స్వామి,, జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘ మాజీ అధ్యక్షులు తుమ్మలచెరువు ఆంజనేయులు,, కేటి దొడ్డి మండల సేవా సంఘం అధ్యక్షులు, నందిన్నె నాగేష్ జిల్లా వాల్మీకి , జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘ ఉపాధ్యక్షులు బిజ్వారం తిమ్మప్ప,జిల్లా వాళ్లకి ఉద్యోగ సంఘ ఉపాధ్యక్షులు, గొందిమల్ల రామకృష్ణ జిల్లా వాల్మీకు ఉద్యోగ సంఘ ఉపాధ్యక్షులు నందిన్నె మల్లికార్జున్ కేటి దొడ్డి మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు తిప్పన్న నందిన్నె గ్రామ సర్పంచ్ వెంకటేష్ గువ్వల దీన్నే సర్పంచ్ ఆంజనేయులు కేటి దొడ్డి మండల వాల్మీకి నాయకులు కొండన్న,కేటి దొడ్డి వాల్మీకి నాయకులు రవిబాబు, గ్రామ ఉపసర్పంచ్లు వార్డ్ మెంబర్లు వాల్మీకి పెద్దలు తదితరులు పాల్గొన్నారు
- ఆరాధన మహోత్సవములు 29, 30, 31 నాడు జరుగును. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥ జోగుళాంబ గద్వాల జిల్లా, తెలంగాణ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహా సంస్థానము మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి పరమపూజ్య 1008 వ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీ పాదులవారి ఆజ్ఞానుసారముగా సమస్త భగవద్భక్తులకు ఆహ్వానం. స్థానిక శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం, షేరేల్లివీధి యందుశ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవములు ఈ నెల 29, 30, 31. తారీకు వరకు విశేషంగా నిర్వహించబడును శ్రీ రాఘవేంద్రస్వామి మఠం|| దుర్వాది ధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే ।శ్రీ రాఘవేంద్ర గురవే నమః అత్యంత దయాలవే ॥. శ్రీ రాఘవేంద్రస్వామి వారు సశరీరముగా బృందావన ప్రవేశము చేసి నేటికి 355 సం||లు అయినది. ఇప్పటికి కూడ భక్తుల సర్వాభీష్టములు తీర్చుతూ భక్తుల పాలిటి కలియుగ కల్పతరువు కామధేనువై విరాజిల్లుచున్నారు. కావున సమస్త భగవద్ భక్తులు శ్రీ స్వామి వారి ఆరాధనా మహోత్సవములందు పాల్గొని తను, మన, ధనములతో సేవలు గావించి తీర్థప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామి విశేషానుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్ధన.శ్రీ శేషదాస మరియు శ్రీ రాఘవేంద్ర భజనమండలీ గద్వాల వారిచే భజన కార్యక్రమములు.తేది 26-08-2026 బుధవారము ఉ॥ 9-00 గం॥లకు ఋగ్వేద నిత్య నూతన ఉపాకర్మతేది 28-08-2026 శుక్రవారము10-00యజుర్వేద నిత్యనూతన ఉపాకర్మసామూహిక శ్రీ సత్యనారాయణస్వామి పూజసా॥ 6-00 గం॥లకుగోపూజ, ధ్వజారోహణం, లక్ష్మీపూజ,ధాన్యపూజ మొ॥నవి జరుగును.తేది 29-08-2026 నుండి 31-08-2026 వరకు జరుగు రోజువారి కార్యక్రమములుఉ॥5-00 గం॥లకు,ఉ 8-00 గంలకు10-30,ఉ॥ 11-00 గం॥లకుఉ॥ 11-30 గం॥లకుమ॥ 12-30 గం॥లకుసుప్రభాతం, నిర్మాల్య విసర్జనంమహా పంచామృత అభిషేకంప్రహ్లాదుల వారి పాదుపూజ, అష్టోత్తర పారాయణం సహితంతులసీ అర్చనఅలంకార సేవహస్తోదకం తీర్థప్రసాదముల వితరణ,29-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము30-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము31-08-2026 | 09 పురవీధులగుండా ప్రహ్లాదరాయల రధోత్సవ కార్యక్రమము జరుగును.2
- నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.1
- తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.1
- చిన్నకడబూరులో శివాలయ దేవాలయంకు వైభవంగా నూతన ధ్వజస్తంభం మహోత్సవం వేడుకలు పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో ఉన్న శ్రీ అంజినేయ స్వామి దేవాలయం పక్కన ఉన్న శివాలయ దేవాలయంకు నూతన ధ్వజస్తంభంను బుధవారం వైభవంగా జరిగింది.ఈ నూతన ద్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ధనుర్లగ్న శుభ ముహూర్తమున పండితులు వేద మంత్రాలు పఠిస్తుండంగా ఆలయ ధర్మకర్త గౌళ్ళ నల్లారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఆలయ,గ్రామ పెద్దల సమక్షంలో అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగిందని ఆలయ ,కమిటీ పెద్దలు బుధవారం తెలిపారు.ప్రత్యేకంగా హోమం ద్వారా శివాలయ దేవాలయం నందు భ్రమరాంబిక,గణపతి,కుమారస్వామి, విగ్రహాలకు అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ప్రత్యేకంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలను గౌరవించారు.వేద పండితులు ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం కాల్చిన అనంతరం శివాలయ దేవాలయముకు నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకు వచ్చిన భక్తాదులు ప్రత్యేక పూజలు గావించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మీసేవ ఆంజనేయులు, మల్లికార్జున,ఆలయ పెద్దలు గౌళ్ళ నల్లారెడ్డి,తయాన్న,నారాయణస్వామి,ముత్తన్న,కోడిగుడ్ల లక్ష్మన్న, వీరారెడ్డి,ఎల్లన్న ,గిడ్డయ్య,సొసైటీ డైరెక్టర్ యం.జి నరసన్న,కోస్గి డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న,బుసిరెడ్డి, జనసేన నాయకులు మహదేవ, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,శివాలయం స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.2
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు నంద్యాల నుంచి కొత్తూరు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద గాలి వీచినా, వర్షం పడినా అవి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఒరిగిన స్తంభాల వల్ల ఏ క్షణమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను సరిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.1