డిజిటల్ యుగంలో వెబ్ వినియోగం, సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన ప్రపంచ వ్యాప్త వెబ్ ఆవిర్భావం, ఇంటర్నెట్ సాంకేతికత అభివృద్ధిలో వెబ్ పాత్ర, డిజిటల్ యుగంలో వెబ్ వినియోగం, సైబర్ భద్రత, సమాచార మార్పిడిలో వెబ్ ప్రాధాన్యత వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా వీరవల్లి ఎం.కె ప్రసాద్ వివరించారు.ప్రపంచ వ్యాప్త వెబ్ దినోత్సవం (World Wide Web Day) సందర్భంగా పాలకొల్లులోని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న వీరవల్లి ఎం.కె ప్రసాద్ ప్రపంచ వ్యాప్త వెబ్ ఆవిర్భావం, ఇంటర్నెట్ సాంకేతికత అభివృద్ధిలో వెబ్ పాత్ర, డిజిటల్ యుగంలో వెబ్ వినియోగం, సైబర్ భద్రత, సమాచార మార్పిడిలో వెబ్ ప్రాధాన్యత వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. నేటి విద్య, ఉపాధి, పరిశోధన ఆవిష్కరణలలో వెబ్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం మాట్లాడుతూ, సమాచార సాంకేతిక రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విద్యార్థులు వెబ్ సాంకేతికతలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో డిజిటల్ వనరులను బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించడం ప్రతి విద్యార్థి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ, ఐక్యూఏసి కోఆర్డినేటర్ వెంకటస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ సుమలత, కంప్యూటర్ అప్లికేషన్స్ అధ్యాపకులు రవికుమార్, అధ్యాపకులు రామకృష్ణ, విజయలక్ష్మి, వేణు మాధురి విద్యార్థులు పాల్గొన్నారు.
డిజిటల్ యుగంలో వెబ్ వినియోగం, సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన ప్రపంచ వ్యాప్త వెబ్ ఆవిర్భావం, ఇంటర్నెట్ సాంకేతికత అభివృద్ధిలో వెబ్ పాత్ర, డిజిటల్ యుగంలో వెబ్ వినియోగం, సైబర్ భద్రత, సమాచార మార్పిడిలో వెబ్ ప్రాధాన్యత వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా వీరవల్లి ఎం.కె ప్రసాద్ వివరించారు.ప్రపంచ వ్యాప్త వెబ్ దినోత్సవం (World Wide Web Day) సందర్భంగా పాలకొల్లులోని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న వీరవల్లి ఎం.కె ప్రసాద్ ప్రపంచ వ్యాప్త వెబ్ ఆవిర్భావం, ఇంటర్నెట్ సాంకేతికత అభివృద్ధిలో వెబ్ పాత్ర, డిజిటల్ యుగంలో వెబ్ వినియోగం, సైబర్ భద్రత, సమాచార మార్పిడిలో వెబ్ ప్రాధాన్యత వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. నేటి విద్య, ఉపాధి, పరిశోధన ఆవిష్కరణలలో వెబ్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం మాట్లాడుతూ, సమాచార సాంకేతిక రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విద్యార్థులు వెబ్ సాంకేతికతలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో డిజిటల్ వనరులను బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించడం ప్రతి విద్యార్థి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ, ఐక్యూఏసి కోఆర్డినేటర్ వెంకటస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ సుమలత, కంప్యూటర్ అప్లికేషన్స్ అధ్యాపకులు రవికుమార్, అధ్యాపకులు రామకృష్ణ, విజయలక్ష్మి, వేణు మాధురి విద్యార్థులు పాల్గొన్నారు.
- డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.1
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నల్లబెల్లి లో నిర్వహించే అంతిమ సంస్కారానికి హాజరై నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు. అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- ఆలేరు రెవెన్యూ డివిజన్పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య 👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. 📡 T20HD Telugu news channel subscribe like share1
- కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- ప్రియ స్నేహితు లారా ఆయనకు నూతన జ్ఞానం మీ జీవితంలో మెండుగా ఉండబోతుంది1