logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తిరుమల శ్రీవారి భక్తులకు డిసెంబర్ నెలకు సంబంధించి దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించిన టీటీడీ సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు విడుదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటా విడుదల కానుంది. సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి దర్శన కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదలవుతాయి. సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల కానుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

2 hrs ago
user_Manjunath Chakkala Sr.Reporter
Manjunath Chakkala Sr.Reporter
పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
28228199-0356-43d6-8daa-cb9cf17b7f4a

తిరుమల శ్రీవారి భక్తులకు డిసెంబర్ నెలకు సంబంధించి దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించిన టీటీడీ సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు విడుదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటా విడుదల కానుంది. సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి దర్శన కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదలవుతాయి. సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల కానుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

More news from Chittoor and nearby areas
  • పుంగనూరు నియోజకవర్గ జనసేనా పార్టీ – కీలక సమావేశం సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి కీలక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పార్టీలో ప్రస్తుత పరిస్థితులపై చర్చ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ కూటమి పార్టీలతో సమన్వయం జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, జనసైనికులకు ప్రాధాన్యత కల్పించే అంశాలపై చర్చించారు పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జావిద్ భాష జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ ఆవుల చైతన్య పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్ రూరల్ అధ్యక్షులు విరూపాక్ష చౌడేపల్లి మండల నాయకులు చరణ్ రాయల్, మురళి, కాలేషా సోమల మండల అధ్యక్షులు నాగభూషణ్, సదువు మండల నాయకులు శ్రీకాంత్, ఆనంద్ రొంపిచర్ల మండల అధ్యక్షులు రెడ్డి శేఖర్ , మరియు నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు జై జనసేన! జై హింద్! ఇట్లు, సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) ఇంచార్జి, పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ
    2
    పుంగనూరు నియోజకవర్గ జనసేనా పార్టీ – కీలక సమావేశం సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్)
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ
పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి కీలక సమావేశం నిర్వహించడం జరుగుతుంది.
పార్టీలో ప్రస్తుత పరిస్థితులపై చర్చ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
కూటమి పార్టీలతో సమన్వయం
జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, జనసైనికులకు ప్రాధాన్యత కల్పించే అంశాలపై చర్చించారు
పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో
నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జావిద్ భాష జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ ఆవుల చైతన్య పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్ రూరల్ అధ్యక్షులు విరూపాక్ష చౌడేపల్లి మండల నాయకులు చరణ్ రాయల్, మురళి, కాలేషా సోమల మండల అధ్యక్షులు నాగభూషణ్, సదువు మండల నాయకులు శ్రీకాంత్, ఆనంద్ రొంపిచర్ల మండల అధ్యక్షులు రెడ్డి శేఖర్ , మరియు  నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు
జై జనసేన!  జై హింద్! 
ఇట్లు,
సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) ఇంచార్జి, పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    3 hrs ago
  • పుంగనూరులో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించిన బిజెపి నాయకులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదినం సందర్భంగా పుంగనూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీశ్ రాజు,సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులతో కలసి ఎన్టీఆర్ సర్కిల్ నందు బాణాసంచా పేలుస్తూ మిఠాయిలు పంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు మాట్లాడుతూ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ ‘సేవా సంకల్ప్ అభయాన్’ పేరుతో నెల రోజుల పాటు సాగే భారీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు,'ఆశీర్వాద్ కా దియా' ప్రమిదల వెలిగింపు, వడ్ నగర్ నుంచి వారణాసి వరకు బైక్ ర్యాలీతో పాటు పూరీ బీచ్లో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ 2,500 ప్రమిదలతో తీర్చిదిద్దిన అద్భుత ఇసుక శిల్పం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయని,దేశ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని,బీజేపీ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.ప్రజలందరూ ఆయనను ఆశీర్వాదించాలని కోరారు. అలాగే ఈరోజు సాయంత్రం పట్టణ కూడలి లో మరియు మీ ఇంటి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవుని వద్ద దీపాలు వెలిగించి ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించాలని కోరారు. జన్మదిన వేడుకలలో బిజెపి సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, పెద్ద మఠం బాబు, చంద్రశేఖర్ రాజు, రాజా జెట్టి,సతీష్, వెంకటేష్, న్యాయవాదులు మహేష్, ప్రసాద్,నిరంజన్ రాజు, శివయ్య, శివ,సుబ్రహ్మణ్యం, దివాకర్, గిరి,రమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    4
    పుంగనూరులో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించిన బిజెపి నాయకులు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదినం సందర్భంగా పుంగనూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీశ్ రాజు,సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులతో కలసి ఎన్టీఆర్ సర్కిల్ నందు బాణాసంచా పేలుస్తూ మిఠాయిలు పంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు మాట్లాడుతూ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ ‘సేవా సంకల్ప్ అభయాన్’ పేరుతో నెల రోజుల పాటు సాగే భారీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు,'ఆశీర్వాద్ కా దియా' ప్రమిదల వెలిగింపు, వడ్ నగర్ నుంచి వారణాసి వరకు బైక్ ర్యాలీతో పాటు పూరీ బీచ్లో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ 2,500 ప్రమిదలతో తీర్చిదిద్దిన అద్భుత ఇసుక శిల్పం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయని,దేశ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని,బీజేపీ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.ప్రజలందరూ ఆయనను ఆశీర్వాదించాలని కోరారు. అలాగే ఈరోజు సాయంత్రం పట్టణ కూడలి లో మరియు మీ ఇంటి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవుని వద్ద దీపాలు వెలిగించి ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించాలని కోరారు.
జన్మదిన వేడుకలలో బిజెపి సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, పెద్ద మఠం బాబు, చంద్రశేఖర్ రాజు, రాజా జెట్టి,సతీష్, వెంకటేష్, న్యాయవాదులు మహేష్, ప్రసాద్,నిరంజన్ రాజు, శివయ్య, శివ,సుబ్రహ్మణ్యం, దివాకర్, గిరి,రమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా పుంగనూరులో అన్నదాన కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా గురువారం పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం మరియు మిఠాయిల పంపిణీ చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 25 సంవత్సరాల నిరంతర రాజకీయ జీవితంలో అనేక మార్పులు చూసామని. ప్రపంచ స్థాయిలో భారత్ ప్రత్యేక గుర్తింపు పొందే విధంగా మోడీ నిరంతర కృషి చూశారన్నారు. నేటి సాయంకాలం ఏడు గంటలకు పుంగనూరు పట్టణంలోని కోనేరు వద్ద ఆశీర్వాద దీపం పేరుతో దీపం వెలిగిస్తున్నట్లు అలాగే ప్రజలందరూ కూడా మోడీ పేరుతో ఒక దీపం వెలిగించాలని ఆ దేవదేవుడు ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలని తెలిపారు
    2
    ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా పుంగనూరులో అన్నదాన కార్యక్రమం
భారత ప్రధాని నరేంద్ర మోడీ  జన్మదినం సందర్భంగా గురువారం పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం మరియు మిఠాయిల పంపిణీ చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ  25 సంవత్సరాల నిరంతర రాజకీయ జీవితంలో అనేక మార్పులు చూసామని.  ప్రపంచ స్థాయిలో భారత్ ప్రత్యేక  గుర్తింపు పొందే విధంగా మోడీ  నిరంతర కృషి చూశారన్నారు. నేటి సాయంకాలం ఏడు గంటలకు పుంగనూరు పట్టణంలోని కోనేరు వద్ద ఆశీర్వాద దీపం పేరుతో దీపం వెలిగిస్తున్నట్లు అలాగే ప్రజలందరూ కూడా మోడీ పేరుతో ఒక దీపం వెలిగించాలని ఆ దేవదేవుడు ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలని తెలిపారు
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • రామసముద్రం: హంద్రీ–నీవా కోసం రామసముద్రం ప్రజల నిరసన కార్యక్రమం హంద్రీ–నీవా జలాల కోసం రామసముద్రం మండల కేంద్రంలోని చెక్‌పోస్టు కూడలిలో తొలిసారిగా భారీ నిరసన చేపట్టారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు, ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా సాగిన నిరసనలో ‘మన నీరు.. మన హక్కు.. మన భవిష్యత్తు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హంద్రీ–నీవా జలాలను రామసముద్రం మండలానికి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ తమ ఆకాంక్షను చాటి చెప్పారు. నిరసన సందర్భంగా మాట్లాడిన HNSS సాధన సమితి సభ్యులు.. ఇది కేవలం ఒకరోజు కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. మండల ప్రజల నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రోజుకో కార్యక్రమంతో ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. గ్రామగ్రామాన ప్రజలను భాగస్వాములను చేసి, రామసముద్రం నీటి గోడును రాష్ట్ర స్థాయికి వినిపించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. *రాష్ట్ర స్థాయికి గళం: గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం తరహాలో ప్రజలందరినీ ఒకే డిమాండ్‌పై సమీకరించి పోరాటాన్ని విస్తరించాలని సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. రామసముద్రం గోడు రాష్ట్ర స్థాయికి చేరే వరకు.. హంద్రీ–నీవా నీటి సాధన కోసం ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రైతులు, యువత, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. * తహశీల్దార్‌, ఎంపీడీవోలకు వినతి : నిరసన అనంతరం HNSS సాధన సమితి ప్రతినిధులు తహశీల్దార్‌ అజారుద్దీన్‌, ఎంపీడీవో లతీఫ్‌ఖాన్‌లకు వినతిపత్రాలు అందజేశారు. హంద్రీ–నీవా జలాలను రామసముద్రం మండలానికి అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మండలంలోని గ్రామాలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందడంతో పాటు చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలను పెంపొందించేందుకు HNSS నీరు అవసరమని వివరించారు.
    4
    రామసముద్రం: హంద్రీ–నీవా కోసం రామసముద్రం ప్రజల నిరసన కార్యక్రమం
హంద్రీ–నీవా జలాల కోసం రామసముద్రం మండల కేంద్రంలోని చెక్‌పోస్టు కూడలిలో తొలిసారిగా భారీ నిరసన చేపట్టారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు, ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా సాగిన నిరసనలో ‘మన నీరు.. మన హక్కు.. మన భవిష్యత్తు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హంద్రీ–నీవా జలాలను రామసముద్రం మండలానికి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ తమ ఆకాంక్షను చాటి చెప్పారు. నిరసన సందర్భంగా మాట్లాడిన HNSS సాధన సమితి సభ్యులు.. ఇది కేవలం ఒకరోజు కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. మండల ప్రజల నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రోజుకో కార్యక్రమంతో ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. గ్రామగ్రామాన ప్రజలను భాగస్వాములను చేసి, రామసముద్రం నీటి గోడును రాష్ట్ర స్థాయికి వినిపించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
*రాష్ట్ర స్థాయికి గళం:
గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం తరహాలో ప్రజలందరినీ ఒకే డిమాండ్‌పై సమీకరించి పోరాటాన్ని విస్తరించాలని సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. రామసముద్రం గోడు రాష్ట్ర స్థాయికి చేరే వరకు.. హంద్రీ–నీవా నీటి సాధన కోసం ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రైతులు, యువత, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.
* తహశీల్దార్‌, ఎంపీడీవోలకు వినతి :
నిరసన అనంతరం HNSS సాధన సమితి ప్రతినిధులు తహశీల్దార్‌ అజారుద్దీన్‌, ఎంపీడీవో లతీఫ్‌ఖాన్‌లకు వినతిపత్రాలు అందజేశారు. హంద్రీ–నీవా జలాలను రామసముద్రం మండలానికి అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మండలంలోని గ్రామాలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందడంతో పాటు చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలను పెంపొందించేందుకు HNSS నీరు అవసరమని వివరించారు.
    user_SR
    SR
    రామసముద్రం, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • పలమనేరు బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలు కు బహుమతులు అందజేసిన ఆర్.ఎం ఈశ్వర్ నాయుడు చిత్తూరు జిల్లా పలమనేరులో ఘనంగా నిర్వహించిన పలమనేరు బాక్స్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు శ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఆర్ఎం ఈశ్వర్ నాయుడు బహుమతులను అందజేశారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలు పుంగనూరు కు చెందిన బ్రూటల్ బడ్డీస్ స్టీమ్ విన్నర్స్ గా 50 వేల రూపాయలు నగదు బహుమతి పొందగా, కుప్పం చెందిన జిఎంఆర్ టీం రన్నర్స్ 1 గా రూ. .30,000 నగదు బహుమతి పొందగా ,పలమనేరు కు చెందిన ఉమర్ టీం రన్నర్ 2 గా నిలిచి 20వేల రూపాయలు నగదును గెలుపొందారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకుడు యుడిఎస్ రాజేష్ ,పలమనేరు టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆర్బీసీ కుట్టి,పలమనేరు వైసీపీ పట్టణ అధ్యక్షుడు హేమంత్ రెడ్డి, మొదలగు వారు పాల్గొన్నారు
    1
    పలమనేరు బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలు కు బహుమతులు అందజేసిన ఆర్.ఎం ఈశ్వర్ నాయుడు
చిత్తూరు జిల్లా పలమనేరులో ఘనంగా నిర్వహించిన పలమనేరు బాక్స్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు శ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఆర్ఎం ఈశ్వర్ నాయుడు బహుమతులను అందజేశారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలు పుంగనూరు కు చెందిన బ్రూటల్ బడ్డీస్ స్టీమ్ విన్నర్స్  గా 50 వేల రూపాయలు నగదు బహుమతి పొందగా,  కుప్పం చెందిన జిఎంఆర్ టీం రన్నర్స్ 1 గా రూ. .30,000 నగదు బహుమతి పొందగా ,పలమనేరు కు చెందిన ఉమర్  టీం రన్నర్ 2 గా నిలిచి 20వేల రూపాయలు నగదును గెలుపొందారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకుడు యుడిఎస్ రాజేష్ ,పలమనేరు టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆర్బీసీ కుట్టి,పలమనేరు వైసీపీ పట్టణ అధ్యక్షుడు హేమంత్ రెడ్డి, మొదలగు వారు పాల్గొన్నారు
    user_Gangamma
    Gangamma
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • కలికిరి మండలంలో కోలాహలంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు దండాలయ్య ఉండ్రాళ్లయ్య సాంగ్ కు అందరినీ ఆకట్టుకున్న కళాకారుల నృత్యం కలికిరి నేస్తం న్యూస్..కలికిరి:16సెప్టెంబర్2026:కలికిరి మండలం కలికిరి పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలకు మూడు రోజుల ప్రత్యేక పూజలు అనంతరం బుధవారం సాయంత్రం నుంచి డి జే లు కోలాటాల మధ్య ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించి అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇదిలా ఉండగా కలికిరి మండలం కలికిరి పట్టణం రాజువారి పల్లి లో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అధిరోహించి దేవుని డిజె పాటలతో కళాకారుల నృత్యాలు మధ్య కలికిరి పట్టణంలో ఊరేగింపు అనంతరం వినాయక నిమజ్జనం చేశారు. అయితే రాజువారిపల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహంతో పాటు వారు ఏర్పాటు చేసిన కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వినాయక నిమజ్జనం, ఊరేగింపు కార్యక్రమాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ ఎస్.అనిల్ కుమార్ బందోబస్తు నిర్వహించారు. ఈ బందోబస్తు కార్యక్రమంలో ఎస్ఐ రహీం, ఏఎస్ఐ నరసింహులు, హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర, కానిస్టేబుల్ విజయ్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    కలికిరి మండలంలో కోలాహలంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు
దండాలయ్య ఉండ్రాళ్లయ్య సాంగ్ కు అందరినీ ఆకట్టుకున్న కళాకారుల నృత్యం 
కలికిరి నేస్తం న్యూస్..కలికిరి:16సెప్టెంబర్2026:కలికిరి మండలం కలికిరి పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలకు మూడు రోజుల ప్రత్యేక పూజలు అనంతరం బుధవారం సాయంత్రం నుంచి డి జే లు కోలాటాల మధ్య ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించి అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇదిలా ఉండగా కలికిరి మండలం కలికిరి పట్టణం రాజువారి పల్లి లో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అధిరోహించి దేవుని డిజె పాటలతో కళాకారుల నృత్యాలు మధ్య కలికిరి పట్టణంలో ఊరేగింపు అనంతరం వినాయక నిమజ్జనం చేశారు. అయితే రాజువారిపల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహంతో పాటు వారు ఏర్పాటు చేసిన కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వినాయక నిమజ్జనం, ఊరేగింపు కార్యక్రమాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ ఎస్.అనిల్ కుమార్ బందోబస్తు నిర్వహించారు. ఈ బందోబస్తు కార్యక్రమంలో ఎస్ఐ రహీం, ఏఎస్ఐ నరసింహులు, హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర, కానిస్టేబుల్ విజయ్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Kalikiri Nestham Tv (Sufi)
    Kalikiri Nestham Tv (Sufi)
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కుప్పం పట్టణంలో బిజెపి మండల అధ్యక్షుడు. వినీల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. కుప్పం పట్టణంలో బిజెపి అధినేత. నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు సందర్భంగా. పట్టణంలో. మండల అధ్యక్షుడు వినీల్ ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా. డిగ్రీ కాలేజీ విద్యార్థులు, బిజెపి కార్యకర్తలు, యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అన్నిటికంటే రక్తదానం మిన్న. అంటూ యూత్ ముందుకు వచ్చి ప్రధానమంత్రి జన్మదిన సందర్భంగా ఈ అవకాశాన్ని మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
    1
    కుప్పం పట్టణంలో బిజెపి మండల అధ్యక్షుడు. వినీల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. 
కుప్పం పట్టణంలో బిజెపి అధినేత. నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు సందర్భంగా. పట్టణంలో. మండల అధ్యక్షుడు వినీల్ ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా. డిగ్రీ కాలేజీ విద్యార్థులు, బిజెపి కార్యకర్తలు, యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అన్నిటికంటే రక్తదానం మిన్న. అంటూ యూత్ ముందుకు వచ్చి ప్రధానమంత్రి జన్మదిన సందర్భంగా ఈ అవకాశాన్ని మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • డీఎస్సీ నియామకాల్ని పారదర్శకంగా చేపట్టామని మీరు నమ్మితే.. ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ఎంక్వైరీ వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపుతోంది. ఎంక్వైరీ వేసి డీఎస్సీ అక్రమాలు బయటపడితే నారా లోకేష్ కెరీర్ ముగిసిపోతుందని భయపడుతున్నావా చంద్రబాబూ? -సలాం బాబు గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్‌ డీఎస్సీ నియామకాల్ని పారదర్శకంగా చేపట్టామని మీరు నమ్మితే.. ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ఎంక్వైరీ వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపుతోంది. ఎంక్వైరీ వేసి డీఎస్సీ అక్రమాలు బయటపడితే నారా లోకేష్ కెరీర్ ముగిసిపోతుందని భయపడుతున్నావా చంద్రబాబూ? -సలాం బాబు గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్‌
    1
    డీఎస్సీ నియామకాల్ని పారదర్శకంగా చేపట్టామని మీరు నమ్మితే.. ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ఎంక్వైరీ వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపుతోంది. ఎంక్వైరీ వేసి డీఎస్సీ అక్రమాలు బయటపడితే నారా లోకేష్ కెరీర్ ముగిసిపోతుందని భయపడుతున్నావా చంద్రబాబూ? 

-సలాం బాబు గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్‌
డీఎస్సీ నియామకాల్ని పారదర్శకంగా చేపట్టామని మీరు నమ్మితే.. ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ఎంక్వైరీ వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపుతోంది. ఎంక్వైరీ వేసి డీఎస్సీ అక్రమాలు బయటపడితే నారా లోకేష్ కెరీర్ ముగిసిపోతుందని భయపడుతున్నావా చంద్రబాబూ? 
-సలాం బాబు గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్‌
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.