ఫోటో రైట్ అప్ ఎస్ ఎంపీ 01 క్రికెట్ టోర్నమెంట్, ముగ్గుల పోటీ, కృష్ణాష్టమి వేడుకలు కరపత్రాలను విడుదల చేస్తున్న,జిల్లా యాదవ సంఘం నాయకులు సెప్టెంబర్ 4న జిల్లాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు క్రికెట్ టోర్నమెంట్, ముగ్గుల పోటీలు హాజరవుతున్న మంత్రులు ,ఎమ్మెల్యే జిల్లా యాదవ సంఘం నాయకులు , సోమందేపల్లి ఆగస్టు 27 అనంతపురం జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యాదవ సంఘం నాయకులు పేర్కొన్నారు గురువారం సోమందేపల్లి మండల కేంద్రంలో హిందూపూర్ రోడ్డు నక్కలగుట్ట కాలనీలో శ్రీకృష్ణుడు గుడి, కళ్యాణ మండపం నిర్మాణ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానం కరపత్రాలను యాదవ సంఘం నాయకులు విడుదల చేశారు ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ ,రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సెప్టెంబర్ 2న ముగ్గుల పోటీలు, ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 2 వరకు క్రికెట్ టోర్నమెంట్,జరుగుతున్నట్లు వివరించారు క్రికెట్ పై ఆసక్తికరవారు 94922 533 07 జైపాల్ యాదవ్, 94401 84049 బల్లి పోయిన సురేష్ నంబర్లకు సంప్రదించి పాల్గొనే వారి వివరాలను తెలియజేయాలని కోరారు అదేవిధంగా ముగ్గుల పోటీలు పాల్గొనే మహిళా మణులు 8244 82204 రాధిక, 79950 56877 మీనా, 83176 28248 పల్లవి నెంబర్లను సంప్రదించాలని తమ వివరాలను తెలపాలని తెలియజేశారు ఈ పోటీలలో విజయం సాధించిన వారికి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి మంత్రులు, ఎమ్మెల్యేలు చేతుల మీదుగా ప్రధానం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా గృహ నిర్మాణం ,సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్, ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎక్స్ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి, డాక్టర్ రామచంద్రయ్య, డాక్టర్ రమేష్ బాబు హాజరవుతున్నట్లు కార్యనిర్వాహకులు జైపాల్ యాదవ్ బల్లిపోయిన సురేష్ తెలియజేశారు పోస్టర్ల విడుదల కార్యక్రమంలో సత్యసాయి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు లక్ష్మీనరసింహప్ప, అడ్వకేట్ రామయ్య యాదవ్, పోతుల రాధాకృష్ణ యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షులు అశ్వర్ధ, సోమందేపల్లి మండల అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గోపాల్ యాదవ్,కార్యనిర్వాక కార్యదర్శి నాగరాజు యాదవ్,యూత్ అధ్యక్షులు మైలార యాదవ్, ఓబులేష్ యాదవ్, , సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ యాదవ్, రజక సంఘం నాయకులు క్రిష్టప్ప తదితరులు పాల్గొన్నారు ,
ఫోటో రైట్ అప్ ఎస్ ఎంపీ 01 క్రికెట్ టోర్నమెంట్, ముగ్గుల పోటీ, కృష్ణాష్టమి వేడుకలు కరపత్రాలను విడుదల చేస్తున్న,జిల్లా యాదవ సంఘం నాయకులు సెప్టెంబర్ 4న జిల్లాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు క్రికెట్ టోర్నమెంట్, ముగ్గుల పోటీలు హాజరవుతున్న మంత్రులు ,ఎమ్మెల్యే జిల్లా యాదవ సంఘం నాయకులు , సోమందేపల్లి ఆగస్టు 27 అనంతపురం జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యాదవ సంఘం నాయకులు పేర్కొన్నారు గురువారం సోమందేపల్లి మండల కేంద్రంలో హిందూపూర్ రోడ్డు నక్కలగుట్ట కాలనీలో శ్రీకృష్ణుడు గుడి, కళ్యాణ మండపం నిర్మాణ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానం కరపత్రాలను యాదవ సంఘం నాయకులు విడుదల చేశారు ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ ,రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సెప్టెంబర్ 2న ముగ్గుల పోటీలు, ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 2 వరకు క్రికెట్ టోర్నమెంట్,జరుగుతున్నట్లు వివరించారు క్రికెట్ పై ఆసక్తికరవారు 94922 533 07 జైపాల్ యాదవ్, 94401 84049 బల్లి పోయిన సురేష్ నంబర్లకు సంప్రదించి పాల్గొనే వారి వివరాలను తెలియజేయాలని కోరారు అదేవిధంగా ముగ్గుల పోటీలు పాల్గొనే మహిళా మణులు 8244 82204 రాధిక, 79950 56877 మీనా, 83176 28248 పల్లవి నెంబర్లను సంప్రదించాలని తమ వివరాలను తెలపాలని తెలియజేశారు ఈ పోటీలలో విజయం సాధించిన వారికి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి మంత్రులు, ఎమ్మెల్యేలు చేతుల మీదుగా ప్రధానం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా గృహ నిర్మాణం ,సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్, ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎక్స్ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి, డాక్టర్ రామచంద్రయ్య, డాక్టర్ రమేష్ బాబు హాజరవుతున్నట్లు కార్యనిర్వాహకులు జైపాల్ యాదవ్ బల్లిపోయిన సురేష్ తెలియజేశారు పోస్టర్ల విడుదల కార్యక్రమంలో సత్యసాయి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు లక్ష్మీనరసింహప్ప, అడ్వకేట్ రామయ్య యాదవ్, పోతుల రాధాకృష్ణ యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షులు అశ్వర్ధ, సోమందేపల్లి మండల అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గోపాల్ యాదవ్,కార్యనిర్వాక కార్యదర్శి నాగరాజు యాదవ్,యూత్ అధ్యక్షులు మైలార యాదవ్, ఓబులేష్ యాదవ్, , సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ యాదవ్, రజక సంఘం నాయకులు క్రిష్టప్ప తదితరులు పాల్గొన్నారు ,
- శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........ ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.1
- ధర్మవరం నుంచి మరో సరికొత్త వెబ్ సిరీస్.. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో “అర్జున్ – ది హంట్” శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం పట్టణానికి చెందిన పెద్ది రాజు నరసింహ రచన, దర్శకత్వంలో “అర్జున్ – ది హంట్” పేరుతో మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో వెబ్ సిరీస్ రూపొందుతోంది. ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించేలా కథ, సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వెబ్ సిరీస్లో AI టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వారి ఫొటోలను స్వీకరించి, వాటి ఆధారంగా AI సహాయంతో ప్రత్యేకమైన క్యారెక్టర్ లుక్ను రూపొందించనున్నట్లు తెలిపారు. వ్యక్తుల లుక్కు అనుగుణంగా కథలో పాత్రను డిజైన్ చేసే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెబ్ సిరీస్లో భాగం కావాలనుకునే వారు తమ ఫొటోతో పాటు వివరాలను పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం 8978580208 నంబర్కు WhatsAppలో “ARJUN – THE HUNT” అని మెసేజ్ చేసి, పేరు, వయస్సు, ప్రాంతం, ఫొటో, మొబైల్ నంబర్ వివరాలను పంపించాలని సూచించారు. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ను సరికొత్త విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. జై భీమ్ బహుజన ఐక్యత వర్ధిల్లాలి!2
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- నేపాల్ వరదలకు కారణం ఇదేనా..? బాంబు పేలినట్టుగా మంచుకొండ కూలింది..! నేపాల్, టిబెట్ను వణికించిన ఆకస్మిక వరదలపై ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం... హిమాలయాల్లోని ఓ గ్లేషియర్ నుంచి సుమారు 2 వేల అడుగుల వెడల్పున్న భారీ మంచుకొండ విరిగిపోయినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ భారీ మంచుకొండ ఏకంగా 4 వేల అడుగుల లోతున్న లోయలోకి నిట్టనిలువుగా జారిపడినట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయని కథనం పేర్కొంది. అంత భారీ మంచు ద్రవ్యరాశి ఒక్కసారిగా లోయలోకి పడిపోవడంతో... భారీగా మంచు, రాళ్లు, నీరు ఒక్కసారిగా కదిలి... దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంచుకొండ పడిన ప్రాంతం... బాంబు పేలినట్టుగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వివరించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. అంటే... ఇది సాధారణ వర్షాలతో వచ్చిన వరదేనా..? లేక... హిమాలయాల్లో భారీ మంచుకొండ విరిగిపడి... దాని ప్రభావంతో ఒక్కసారిగా నీరు ఉప్పొంగిందా..? అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇది ఇంకా ప్రాథమిక శాస్త్రీయ అంచనా మాత్రమే. ఈ మంచుకొండ విరిగిపడటం, దాని పరిమాణం, లోయలోకి పడిన ప్రభావం, వరదలతో దాని సంబంధం వంటి అంశాలపై మరింత శాస్త్రీయ పరిశీలన అవసరం. ఒకవైపు భారీ మంచుకొండ విరిగిపడటం... మరోవైపు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద... హిమాలయాల్లో ప్రకృతి ఎంతటి శక్తిని చూపించగలదో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.1