ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై ప్రతి ఒక్కరూ పట్టు సాధించడం అత్యంత అవసరమని గోనెగండ్ల ఎంఈఓ-2 నీలకంఠ నొక్కిచెప్పారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహించిన ఉచిత ఇంగ్లీషు శిక్షణ తరగతులు శనివారం విజయవంతంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ఎంఈఓ-2 నీలకంఠతో పాటు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుమ్మల బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేటి ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు సాధించడం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు ఇలాంటి ఉచిత శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఇంగ్లీష్లో ప్రావీణ్యం పెంపొందించుకోవడం ద్వారా పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని సూచించారు. వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థులు స్వచ్ఛందంగా శిక్షణ తరగతులకు హాజరుకావడం అభినందనీయమని వారు తెలిపారు. యుటిఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో, సీనియర్ ఉపాధ్యాయుడు రామన్ సహకారంతో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం, ప్రతి ఏడాది విద్యార్థుల కోసం ఉచిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడు రామన్ను యుటిఎఫ్ నాయకులు శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎస్. నరసింహులు, మండల గౌరవ అధ్యక్షుడు లింగన్న, ప్రధాన కార్యదర్శి కేశన్న, నాయకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై ప్రతి ఒక్కరూ పట్టు సాధించడం అత్యంత అవసరమని గోనెగండ్ల ఎంఈఓ-2 నీలకంఠ నొక్కిచెప్పారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహించిన ఉచిత ఇంగ్లీషు శిక్షణ తరగతులు శనివారం విజయవంతంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ఎంఈఓ-2 నీలకంఠతో పాటు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుమ్మల బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేటి ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు సాధించడం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు ఇలాంటి ఉచిత శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఇంగ్లీష్లో ప్రావీణ్యం పెంపొందించుకోవడం ద్వారా పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని సూచించారు. వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థులు స్వచ్ఛందంగా శిక్షణ తరగతులకు హాజరుకావడం అభినందనీయమని వారు తెలిపారు. యుటిఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో, సీనియర్ ఉపాధ్యాయుడు రామన్ సహకారంతో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం, ప్రతి ఏడాది విద్యార్థుల కోసం ఉచిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడు రామన్ను యుటిఎఫ్ నాయకులు శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎస్. నరసింహులు, మండల గౌరవ అధ్యక్షుడు లింగన్న, ప్రధాన కార్యదర్శి కేశన్న, నాయకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
- ధరూరు మండలంలోని నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఆలయ భూమిని గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తుల నుండి విడిపించి, ఆ భూమిని దేవస్థాన సేవకులకు వ్యవసాయం చేసుకోవడానికి అందజేయాలని నాగర్ దొడ్డి గ్రామ ప్రజలు తీవ్రంగా వేడుకుంటున్నారు. దేవాలయ భూమిని తక్షణమే కాపాడాలని, ప్రస్తుత పరిస్థితిలో దానిని అలాగే వదిలేస్తే పూర్తిగా కబ్జా అయ్యే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.1
- వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం కంట్రోల్ రూమ్ ఎస్సైగా విధులు నిర్వర్తించిన సుబ్బరాజు 37 సంవత్సరాల విశిష్ట సేవలు అందించిన తర్వాత పదవీ విరమణ పొందారు. ప్రజాసేవను పరమావధిగా, క్రమశిక్షణను జీవిత సూత్రంగా భావించి, పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, విధి నిబద్ధతకు చిరునామాగా ఆయన నిలిచారని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి ఎస్పీ సుబ్బరాజును, ఆయన సతీమణిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేసి ఆయన విశిష్ట సేవలను కొనియాడారు. ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ, కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై స్థాయికి ఎదిగిన సుబ్బరాజు ప్రయాణం యువ పోలీసులకు స్ఫూర్తిదాయకం అన్నారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కాదని, అది సమాజ భద్రత కోసం చేసే త్యాగయాత్ర అని, అలాంటి యాత్రను 37 సంవత్సరాలపాటు అత్యంత నిజాయితీతో, నిబద్ధతతో కొనసాగించిన అధికారి సుబ్బరాజు అని ఆమె ప్రశంసించారు. 1989లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్గా సేవలు ప్రారంభించిన ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి సబ్ ఇన్స్పెక్టర్ హోదాను అందుకోవడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శమని తెలిపారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి వంటి ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సైతం ధైర్యసాహసాలతో సేవలందించి, తన సర్వీసు కాలమంతా ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు లేకుండా విధులు నిర్వర్తించడం ఆయన నిష్కళంక సేవలకు నిదర్శనమని ఎస్పీ కొనియాడారు. ఆయన చూపిన విధి నిబద్ధత, ప్రజల పట్ల మానవీయ దృక్పథం, సహోద్యోగులతో స్నేహపూర్వక వైఖరి యువతరం పోలీసులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక కొత్త అధ్యాయమని, ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి పొందిన అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ సునీత రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే జీపీఎఫ్, ఇన్సూరెన్స్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా, పదవీ విరమణ అనంతరం అందాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి సీఐ సుగంధ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూరు సీఐ శివకుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, ఇతర అధికారులు, సుబ్బరాజు కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.3
- కాస్త ఈ రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో..! తిమ్మాపురం గ్రామస్తుల ఆవేదన నంద్యాల జిల్లా మహానంది : కాస్త మా వీధి రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. శనివారం మహానంది మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి మండల కేంద్రమైన తిమ్మాపురం గ్రామంలో పెద్దమ్మ అరుగు వీధి రోడ్డు జలమయమైంది. చినుకు చిటుక్కుమంటే చాలు రోడ్డంతా వర్షపు నీరు నిలిచిపోయి కాలనీవాసులు తిరగడానికి కూడా లేని పరిస్థితి, గ్రామంలో అన్ని సిసి రోడ్లు అయితే వేశారు. కానీ మా కాలనీ రోడ్డు తరుగు అవడంతో వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- నంద్యాల జిల్లాలోని చాగలమర్రి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర రోడ్డు ప్రమాదంలో మరణించారు. కొత్త కారు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం నంద్యాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆళ్లగడ్డ వీరాయిపల్లె సమీపంలో ఆయన కారు రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొనడంతో పూర్తిగా నుజ్జయింది. ఈ ఘోర ప్రమాదంలో నరేంద్ర సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, కారులో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.1
- రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం రాయదుర్గంలో 24 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన 13 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఆపదలో అత్యవసర చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 387 మందికి 2.58 కోట్ల రూపాయల సహాయం అందిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు కాలవ సన్నన్న, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కాల్వ పునరుద్ఘాటించారు.1
- నరసరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ చలివేంద్రం సేవలను రూరల్ ఎస్సై కిషోర్ అభినందించారు.1
- మంత్రాలయం ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తుంగభద్ర నదిలో కొంతమంది అదృశ్యమయ్యారు. ప్రస్తుతం, గల్లంతైన వారి కోసం విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ గాలింపు చర్యలలో పోలీసులు మరియు మత్స్యకారులు రంగంలోకి దిగి, అదృశ్యమైన వారిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.1