అనుమతులు లేని ప్రైవేట్ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి - యుడైస్ కోడ్ నమోదు కాకుండానే శ్రీ చైతన్య తపస్య విద్యాసంస్థ నిర్వహణ - డీఈవో నిర్లక్ష్య వైఖరిపై స్వతంత్ర విచారణ జరపాలి: యూఎస్ఎఫ్ఐ మదనపల్లె : ప్రభుత్వ అనుమతులు, యూడైస్ నమోదు లేకుండానే నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ పరిధిలోని శ్రీ చైతన్య తపస్యా విద్యాసంస్థ ప్రభుత్వ అనుమతులు లేకుండానే సుమారు 300 నుంచి 400 మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆరోపించిన యూఎస్ఎఫ్ఐ, దీనిపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, కార్యాలయ సూపరింటెండెంట్ ఉషారాణికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ, అనుమతి లేని ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరు యూడైస్ లో నమోదు లేకపోవడం వల్ల విద్యార్థుల విద్యా రికార్డులు, తదుపరి తరగతులకు ప్రమోషన్, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల నుంచి అడ్మిషన్ ఫీజులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం తదితర పేర్లతో భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ నిబంధనల అమలుపై డీఈవో నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. అలాగే మదనపల్లెలో అనేక ప్లే స్కూళ్లు కూడా ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వహిస్తూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.45 వేల నుంచి రూ.60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయచోటి ప్రాంతంలోని ఫ్యూచర్ ఆన్, డెక్కన్ స్కూల్, కలికిరిలోని తపస్యా స్కూల్, విజయవాణి స్కూల్ తదితర విద్యాసంస్థల్లో ప్రభుత్వ అనుమతులు, యూడైస్ నమోదు, ఇతర నిబంధనల అమలుపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి డా. కే. సుబ్రమణ్యం పనితీరు పై ప్రభుత్వం స్వతంత్ర విచారణ జరపాలన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కమలాకర్, గణేష్, ఆఫ్రిద్, యువరాజ్, ప్రేమ్, యాసిన్ పాల్గొన్నారు.
అనుమతులు లేని ప్రైవేట్ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి - యుడైస్ కోడ్ నమోదు కాకుండానే శ్రీ చైతన్య తపస్య విద్యాసంస్థ నిర్వహణ - డీఈవో నిర్లక్ష్య వైఖరిపై స్వతంత్ర విచారణ జరపాలి: యూఎస్ఎఫ్ఐ మదనపల్లె : ప్రభుత్వ అనుమతులు, యూడైస్ నమోదు లేకుండానే నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ పరిధిలోని శ్రీ చైతన్య తపస్యా విద్యాసంస్థ ప్రభుత్వ అనుమతులు లేకుండానే సుమారు 300 నుంచి 400 మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆరోపించిన యూఎస్ఎఫ్ఐ, దీనిపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, కార్యాలయ సూపరింటెండెంట్ ఉషారాణికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ, అనుమతి లేని ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరు యూడైస్ లో నమోదు లేకపోవడం వల్ల విద్యార్థుల విద్యా రికార్డులు,
తదుపరి తరగతులకు ప్రమోషన్, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల నుంచి అడ్మిషన్ ఫీజులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం తదితర పేర్లతో భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ నిబంధనల అమలుపై డీఈవో నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. అలాగే మదనపల్లెలో అనేక ప్లే స్కూళ్లు కూడా ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వహిస్తూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.45 వేల నుంచి రూ.60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయచోటి ప్రాంతంలోని ఫ్యూచర్ ఆన్, డెక్కన్ స్కూల్, కలికిరిలోని తపస్యా స్కూల్, విజయవాణి స్కూల్ తదితర విద్యాసంస్థల్లో ప్రభుత్వ అనుమతులు, యూడైస్ నమోదు, ఇతర నిబంధనల అమలుపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి డా. కే. సుబ్రమణ్యం పనితీరు పై ప్రభుత్వం స్వతంత్ర విచారణ జరపాలన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కమలాకర్, గణేష్, ఆఫ్రిద్, యువరాజ్, ప్రేమ్, యాసిన్ పాల్గొన్నారు.
- పుంగనూరు లో దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ.. అన్నమయ్య జిల్లా. పుంగనూరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము. కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు. నమస్కారములతో.... పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం. పుంగనూరు......2
- భవిష్యవాణి పేరుతో మా ఊరి ప్రజలను మోసం చేస్తున్నారు: గ్రామస్తులు భవిష్య వాణి పేరుతో తమ గ్రామంలో ఓ వ్యక్తి ప్రజల నుంచి రూ 5 నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నాడని యాదమరి మండలం, జంగాలపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆరోపించారు. 'దేవుడి పేరుతో మాయ మాటలు చెప్పి నగదు తీసుకుంటున్నాడు. ప్రజలు ఇలాంటి మాయమాటలకు మోసపోకూడదని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే నా వద్ద లక్ష మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు, మీపైనే నెగిటివ్ ప్రచారం చేస్తా అని బెదిరించినట్లు తమ దృష్టికి వచ్చింది' అని స్థానికులు తెలియజేశారు.1
- అక్రమ మద్యం. ఇసుక అక్రమాలను అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీనా అక్రమ మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి: ముఖేష్ కుమార్ మీనా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు, ఖనిజ ఆదాయం, నాన్-వర్కింగ్ లీజులపై సమీక్ష నిర్వహించి పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల కోసం గుర్తించిన భూములకు అవసరమైన అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.1
- 🔴 చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల భారీ నిరసన...! 🔴 చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల భారీ నిరసన...!1
- గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామ సమీపంలో చెరువు దగ్గర పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు . పేకాట రాళ్లపై దాడి. గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామ సమీపంలో చెరువు దగ్గర పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గ్రామ సమీపంలోని చెరువు దగ్గర పేకాట ఆడుతున్న వాళ్లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. దీంతో పేకాట ఆడుతున్న నలుగురు మందిని అదుపులో తీసుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తుపడుతున్నారు.2
- తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్ తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్1
- పుంగనూరు లో ర్యాలీ చేసిన దస్తావేజు లేఖరులు,స్టాంప్ వెండర్లు,డిటిపి ఆపరేటర్లు, సహాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్న విషయం విధితమే! చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం సభ్యులు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు.3
- సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తూ బస్సును నిర్లక్ష్యముగా నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్. అన్నమయ్య జిల్లా: మదనపల్లి నుండి చిత్తూరు వెళుతున్న బస్సులో సెల్ ఫోన్లో నిమగ్నమైన డ్రైవర్ ఒక చేతితో ఫోన్ చూస్తూ, మరొక్క చేతితో బస్సును నడుపుతున్నాడు. ఈ నిర్లక్ష్యము వలన ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు భాద్యులు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి భాద్యత లేని డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరగక మునుపే సంబందిత అధికారులు స్పందిచి మరలా ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేయకుండా వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతున్న డ్రైవర్ ను ప్రయాణికుడు తన ఫోన్ లో చిత్రీకరించడంతో వెలుగులోకి వచ్చింది. ఆ బస్సు పలమనేరు డిపోకు చెందిన బస్సు గా గుర్తింపు.1