Shuru
Apke Nagar Ki App…
అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి...... అంగన్వాడి కేంద్రాల సేవలను గర్భిణీలు, బాలింతలు వినియోగించుకోవాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, తాసిల్దార్ బక్కయ్య, సిడిపిఓ రేష్మ కోరారు. జన్నారం మండలంలో పనిచేస్తున్న అంగన్వాడి టీచర్లకు సోమవారం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వం సరఫరా చేసిన స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఐసిడిఎస్ ద్వారా నిర్వహించే వివిధ కార్యక్రమాల వివరాల నమోదుకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
P.G. Murthy
అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి...... అంగన్వాడి కేంద్రాల సేవలను గర్భిణీలు, బాలింతలు వినియోగించుకోవాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, తాసిల్దార్ బక్కయ్య, సిడిపిఓ రేష్మ కోరారు. జన్నారం మండలంలో పనిచేస్తున్న అంగన్వాడి టీచర్లకు సోమవారం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వం సరఫరా చేసిన స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఐసిడిఎస్ ద్వారా నిర్వహించే వివిధ కార్యక్రమాల వివరాల నమోదుకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel1
- జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో, దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి): మండలంలోని గోవిందపూర్లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. చన్కపూర్ గౌరుబాయి ఇల్లు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయి భారీ నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- పత్రికా ప్రకటన ఏప్రిల్ 20, 2026-ఆదిలాబాద్: ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు గాను ప్రధాన మంత్రి అవార్డు లభించింది. ఇది గర్వకారణమైన ఘనత మాత్రమే కాకుండా, నార్నూర్కు కొత్త మార్పు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ గుర్తింపుతో నార్నూర్ నీటిని కేంద్రంగా చేసుకొని సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. ఏప్రిల్ తర్వాత వెంటనే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి. మొత్తం 10 సాగునీటి చెరువులు పునరుద్ధరించబడి, 79,300 ఘన మీటర్ల మట్టిని తొలగించి, నీటి నిల్వ సామర్థ్యం 30 లక్షల ఘన మీటర్లకు పైగా పెంచబడింది. జల్ శక్తి అభియాన్ కింద పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్లు, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలు తాడిహత్నూర్, సోనాపూర్, నాగల్కొండ, జాండా, గుంజాల వంటి గ్రామాలలో చేపట్టబడ్డాయి. ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడి వ్యవసాయానికి బలాన్నిచ్చాయి. “మన బడి – మన నీరు” కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో వర్షపు నీటి సంగ్రహణ గుంతలు నిర్మించబడ్డాయి. నీటి లభ్యత మెరుగుపడడంతో తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. నాందీ వాటర్స్ సహకారంతో నార్నూర్, ఖంపూర్, నాగల్కొండలో RO ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. CHC నార్నూర్లో కూడా RO ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో సురక్షిత నీటి అందుబాటు పెరిగింది. ఆర్థికాభివృద్ధి దిశగా మహువా లడ్డూ యూనిట్, బాంబూ ప్రాసెసింగ్ యూనిట్, దాల్ మిల్ వంటి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. మార్కెట్ లింకేజ్లు, రివాల్వింగ్ ఫండ్ మద్దతు ద్వారా రైతులకు మంచి ధరలు లభించాయి. 3700 చెట్లపై లాక్ సాగు చేపట్టి 370 గిరిజన కుటుంబాలకు స్థిర ఆదాయం కల్పించబడింది. వ్యవసాయంలో వాడి మూడు స్థాయిల సాగు విధానం, డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, ఆయిల్ పామ్ సాగు వంటి పద్ధతులు అమలు చేయబడ్డాయి. సాయిల్ హెల్త్ కార్డులతో శాస్త్రీయ వ్యవసాయం ప్రోత్సహించబడింది. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద గృహ నిర్మాణం (హౌసింగ్), PM JANMAN ద్వారా గిరిజన అభివృద్ధి చేపట్టబడింది. ఆరోగ్యరంగంలో టెలీమెడిసిన్ సేవలు, ధర్మ సేవ వెల్నెస్ ప్రోగ్రామ్, మెన్స్ట్రుయల్ అవేర్నెస్ కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయబడి, పోషణ మేళాలు నిర్వహించబడ్డాయి. రెండు సబ్సెంటర్లు NQAS సర్టిఫికేషన్ పొందాయి. విద్యలో డిజిటల్ క్లాస్రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ద్వారా 48.6% మెరుగుదల నమోదైంది. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం AI ఆధారిత బోధన పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి. గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు ట్రైబల్ మ్యూజియం స్థాపించబడింది. యువతలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు యంగ్ లీడర్స్ క్లబ్బులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సమగ్ర చర్యల ఫలితంగా నార్నూర్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించబడింది. దీని ఫలితంగా 2025 సెప్టెంబర్ క్వార్టర్లో దక్షిణ ప్రాంతంలో డెల్టా ర్యాంకింగ్లో 1వ స్థానం సాధించబడింది. NITI Aayog స్టేట్ యూజ్ కేస్ ఛాలెంజ్లో విద్య విభాగంలో 3వ స్థానం కూడా లభించింది. నార్నూర్ ప్రయాణం నీటి ఆధారిత, సమగ్ర అభివృద్ధి మోడల్గా నిలిచింది. ప్రధాన మంత్రి అవార్డు ద్వారా ప్రారంభమైన ఈ మార్పు, ఇప్పుడు స్థిరమైన అభివృద్ధి దిశగా కొనసాగుతోంది.1
- నెరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామంలో నూతనంగా గొల్ల నారాయణ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృప్రవేశానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అర్హులందరికీ రెండవ విడతలో ఇల్లు అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరతరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- *హుజూరాబాద్ డంప్ యార్డ్ పై బీజేపీ యుద్దభేరీ...* *నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం* *ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ* *ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి* *డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే* *ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం* *చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది* *కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా* *అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి* *బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు* హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్ చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు. *నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం* *ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ* *ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి* *డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే* *ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం* *చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది* *కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా* *అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి* *బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు* హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్ చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- కుమురం భీమ్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో ఏప్రిల్ 19న ‘నా ఊరు–నా బాధ్యత’ కార్యక్రమం కింద యువత స్వచ్ఛందంగా శ్రమదానం నిర్వహించారు. గ్రామ ఎక్స్రోడ్ వద్ద రహదారి పక్కన పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని యువత అవగాహన కల్పించారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మద్దతు తెలుపుతూ యువత సేవలను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.1