Shuru
Apke Nagar Ki App…
బద్వేల్ నెల్లూరు రోడ్లో నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో బద్వేల్ తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యురాలు శ్రీ కె విజయమ్మ గారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ యువనేత రితేష్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులతో కలిసి వారు కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని, అలాగే బద్వేల్ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించారు.
Ponna Eswaraiah
బద్వేల్ నెల్లూరు రోడ్లో నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో బద్వేల్ తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యురాలు శ్రీ కె విజయమ్మ గారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ యువనేత రితేష్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులతో కలిసి వారు కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని, అలాగే బద్వేల్ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు, ఆయనకు మతి చలించిందని, ఆయన వేషానికీ, భాషకూ, ప్రవర్తనకూ ఏమాత్రం సంబంధం ఉండటం లేదని ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి ఆరోగ్యం బాగుండటం లేదని పేపర్లలో చూశామని పేర్కొంటూ, ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యల అనంతరం, ఆయన సాయికృష్ణ హత్య కేసులో ఎవరు చేశారు, ఆయన మృతదేహం ఎక్కడుంది, చనిపోతే ఆయన డెడ్ బాడీని తల్లికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే, దళిత సోదరుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని, ఇందుకు కారణమైన సీఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని సుధాకర్ బాబు గారు డిమాండ్ చేశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు ఒకే స్టేషన్ పరిధిలో జరిగాయని, ఈ రెండు మరణాలపై సమగ్రమైన విచారణ జరిపించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తాము గూండాలు, రౌడీలు అని తమను దూషించినా, ఈ మరణాలకు మాత్రం న్యాయం జరగాల్సిందేనని సుధాకర్ బాబు గారు ఉద్ఘాటించారు. ఎటువంటి బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు. అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ అంతరాత్మకు జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశారో, తాము ఎందుకు చేయలేకపోతున్నామో తెలుసని వ్యాఖ్యానించారు. డీఎస్సీ స్కాం నుంచి బయటపడేందుకు దానిని బయటపెట్టిన చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడులకు వెళ్తున్న మీరు క్రిమినల్స్, లేక తాము క్రిమినల్స్ అనేది పవన్ కళ్యాణ్ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గారు సవాల్ విసిరారు.1
- రాప్తాడు నియోజకవర్గం, సి.కె.పల్లి మండలం పరిధిలోని కోటం పల్లి గ్రామ సమీపాన నిర్మించిన అభయ హస్త ఆంజనేయ స్వామి గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాలు మూడు రోజులపాటు పూజలు, హోమాలు నిర్వహించగా, ఆదివారం నాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.1
- భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి H-561 ప్రారంభం ఒక కీలక ముందడుగుగా నిలిచింది. రక్షణ రంగంలో భారత్ సాధించిన మరో మైలురాయిగా ఇది పరిగణించబడుతోంది.1
- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసి రెడ్డి ప్రజలకు ప్రతి రోజూ యోగా సాధన చేయాలని సూచించారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఆయన పట్టణంలోని వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని హాకీ మైదానం మరియు ఇందిరమ్మ రాణితోపు పార్కులలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు వెంకట్రాంరెడ్డి మరియు ఓం ప్రకాశ్ యోగా ప్రాముఖ్యతను వివరించారు. వారు యోగాసనాలు చేయించడంతో పాటు, ప్రాణాయామం కూడా చేయించారు.1
- స్మార్ట్ ఫోన్ ఉపయోగించి డిజిటల్ ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉందని తెలియజేయబడింది.1
- ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే యువకుల ప్రాణాలు తీస్తున్నారని, ఆపై విషయం బయటకు రాకుండా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని వైయస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి గారు ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వేధింపుల కారణంగా ఇప్పటికే 12 మంది చనిపోయారని, కానీ దానికి బాధ్యులైన ఏ ఒక్కరి మీదా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడలో జరుగుతున్న దారుణాలను చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని గౌతమ్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో క్రాంతికుమార్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత మహిళను అని చెప్పుకునే హోంమంత్రి అనిత, సాటి దళితుడి కుటుంబానికి జరిగిన అన్యాయంపై స్పందించి న్యాయం చేయాలని పూనూరు గౌతమ్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.1
- కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది, నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం అద్దాలమర్రి గ్రామంలో జరిగింది. మృతి చెందిన వారిలో 18 ఏళ్ల జయవర్ధన్ రెడ్డి, 16 ఏళ్ల రాజా వర్ధన్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు అక్రమ ఇసుక తవ్వకాలే ప్రధాన కారణమని పలువురు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.1