అంగరంగ వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు దమ్మాయిగూడ సీతారామ నిలయం, పీఎస్ రావు నగర్ అయ్యప్ప కాలనీలో భోజనపల్లి శ్రీనివాసాచార్యులు, సుందరాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవంలో భాగంగా కామాఖ్య సాధనామృత పీఠం వేణు శ్యామ అమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సిరి జ్యోతి అర్చన కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. ధనుర్మాస సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, విష్ణు సహస్రనామ పారాయణం, దివ్యప్రబంధ పఠనం, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేణు శ్యామ అమ్మ మాట్లాడుతూ.. ధనుర్మాసం భక్తి, నియమం, ఆచరణలకు ప్రతీకగా నిలిచే పవిత్ర కాలమని తెలిపారు. ఈ సమయంలో చేసే పూజలు, జపాలు, అర్చనలు ఆత్మశుద్ధికి, కుటుంబ సంక్షేమానికి దోహదపడతాయని పేర్కొన్నారు. సిరి జ్యోతి అర్చన ద్వారా శుభఫలాలు సిద్ధిస్తాయని ఆమె అన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ సీతారామచంద్రుని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ధార్మిక భావనలు, సంప్రదాయ విలువలు యువతలో మరింతగా పెంపొందుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కాలనీ వాసులు, భక్తులు విశేషంగా సహకరిస్తుండటంతో ఆలయ ప్రాంగణం నిత్యం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది.
అంగరంగ వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు దమ్మాయిగూడ సీతారామ నిలయం, పీఎస్ రావు నగర్ అయ్యప్ప కాలనీలో భోజనపల్లి శ్రీనివాసాచార్యులు, సుందరాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవంలో భాగంగా కామాఖ్య సాధనామృత పీఠం వేణు శ్యామ అమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సిరి జ్యోతి అర్చన కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. ధనుర్మాస సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, విష్ణు సహస్రనామ పారాయణం, దివ్యప్రబంధ పఠనం, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేణు
శ్యామ అమ్మ మాట్లాడుతూ.. ధనుర్మాసం భక్తి, నియమం, ఆచరణలకు ప్రతీకగా నిలిచే పవిత్ర కాలమని తెలిపారు. ఈ సమయంలో చేసే పూజలు, జపాలు, అర్చనలు ఆత్మశుద్ధికి, కుటుంబ సంక్షేమానికి దోహదపడతాయని పేర్కొన్నారు. సిరి జ్యోతి అర్చన ద్వారా శుభఫలాలు సిద్ధిస్తాయని ఆమె అన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ సీతారామచంద్రుని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ధార్మిక భావనలు, సంప్రదాయ విలువలు యువతలో మరింతగా పెంపొందుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కాలనీ వాసులు, భక్తులు విశేషంగా సహకరిస్తుండటంతో ఆలయ ప్రాంగణం నిత్యం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది.
- - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? - ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? - కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? - ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? - పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? - రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. - ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. - ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. - వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న - ఈటల రాజేందర్.1
- గజ్వేల్ మున్సిపల్లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు1
- సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్1
- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1
- మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.1
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- కరీంనగర్ జిల్లా హైదరాబాద్ ప్రధాన రహదారి అలుగునూరు బ్రిడ్జిపై మారుతి 800 కారులో మంటలు తగలబడుతున్న కారు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కు కలిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది1
- *రాబోయే రోజుల్లో డబ్బు తీసుకొని ఓటు వేయకపోతే ఓడిన అభ్యర్థులు ఇలాగే చేస్తారేమో. ఆలోచనాత్మక వీడియో*1