అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యం విద్యుత్ శాఖ ఎస్ ఈ రవి ప్రసాద్ వికారాబాద్:జిల్లాలో కరెంట్ కోతలు లేవు: విద్యుత్ ఎస్ఈ జిల్లాలో ఎక్కడా విద్యుత్ అంతరాయ సమస్యలు లేవని విద్యుత్ ఎస్ఈ రవిప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రజలు అవాస్తవాలను నమ్మవద్దని సూచించారు. ధరూర్ మండలం PCM తండా గ్రామంలో విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఓ దినపత్రికలో ప్రచురించిన వార్తలో వాస్తవం లేదని ఎస్ఈ పేర్కొన్నారు. భూ గర్భ జలాలు తగ్గుముఖం పట్టడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టంచేశారు. ఈ వార్త వచ్చిన వెంటనే అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారని అక్కడ భూగర్భ జలాలు సమస్య కారణంగా పంటలు దెబ్బతిన్నట్టు రైతులు అధికారులకు తెలిపారని ఎస్ఈ వివరించారు. జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందని, అవసరమైన సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎస్ఈ తెలిపారు. తరిగోపుల-ఐనాపూర్ మధ్య ఇంటర్లింక్ 11 కేవీ లైన్ పూర్తయిందని, నాగారం-మోమిన్కలాన్ మధ్య 33 కేవీ లైన్ ప్రతిపాదనలు సమర్పించామని వెల్లడించారు. సబ్స్టేషన్లలో మరమ్మతులు అవసరమైతే ముందస్తుగా పత్రికల ద్వారా సమాచారం అందిస్తున్నామని, కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటు తో పాటు ఉన్న సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నామని ఎస్ఈ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఈ సంజీవ్, ఏడీఈ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు
అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యం విద్యుత్ శాఖ ఎస్ ఈ రవి ప్రసాద్ వికారాబాద్:జిల్లాలో కరెంట్ కోతలు లేవు: విద్యుత్ ఎస్ఈ జిల్లాలో ఎక్కడా విద్యుత్ అంతరాయ సమస్యలు లేవని విద్యుత్ ఎస్ఈ రవిప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రజలు అవాస్తవాలను నమ్మవద్దని సూచించారు. ధరూర్ మండలం PCM తండా గ్రామంలో విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఓ దినపత్రికలో ప్రచురించిన వార్తలో వాస్తవం లేదని ఎస్ఈ పేర్కొన్నారు. భూ గర్భ జలాలు తగ్గుముఖం పట్టడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టంచేశారు. ఈ వార్త వచ్చిన వెంటనే అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారని అక్కడ భూగర్భ జలాలు సమస్య కారణంగా పంటలు దెబ్బతిన్నట్టు రైతులు అధికారులకు తెలిపారని ఎస్ఈ వివరించారు. జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందని, అవసరమైన సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎస్ఈ తెలిపారు. తరిగోపుల-ఐనాపూర్ మధ్య ఇంటర్లింక్ 11 కేవీ లైన్ పూర్తయిందని, నాగారం-మోమిన్కలాన్ మధ్య 33 కేవీ లైన్ ప్రతిపాదనలు సమర్పించామని వెల్లడించారు. సబ్స్టేషన్లలో మరమ్మతులు అవసరమైతే ముందస్తుగా పత్రికల ద్వారా సమాచారం అందిస్తున్నామని, కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటు తో పాటు ఉన్న సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నామని ఎస్ఈ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఈ సంజీవ్, ఏడీఈ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో అన్యమతస్తు లతో పర మతస్తులతో హిందువులకు ప్రమాదం పొంచివుంది జాగ్రత్తగా ఉండండి హిందువులారా2
- అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తా ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోజ్జు అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని కలమడుగు, ఇందన్ పల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జన్నారంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ దంపతులు, మాజీ జడ్పిటిసి ఎర్రచంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1
- చరిత్ర సృష్టించిన సుష్మ భూమేష్ జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ చరిత్రను సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె 2,919 ఓట్ల మెజార్టీని సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన సర్పంచ్గా ఆమె గుర్తింపు పొందారు. దీంతో ఆమెను అందరూ అభినందించారు.1
- పోన్కల్ సర్పంచ్ గా సుష్మా భూమేష్ జన్నారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా జక్కు సుష్మ భూమేష్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జన్నారం పంచాయతీ కార్యాలయ సమావేశం మందిరంలో స్పెషల్ ఆఫీసర్ ఉమర్ షరీఫ్, వార్డు సభ్యుల సమక్షంలో సర్పంచిగా బాధ్యతలు చేపట్టారు. సుష్మ భూమేష్ మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ డి.లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఈవో రాహుల్ ఉన్నారు.1
- డిసెంబర్ 22 తేదీన నరసన్నపేట ఎస్సై నరసన్నపేట మడపం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 2 కేజీల అక్రమ గంజాయితో ఓ నిందితుడు పట్టుబడగా,మధ్యాహ్నం 12 :15 గంటల సమయంలో అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న 2.180 కేజీ ల బరువు గల గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడమైనది అని కేసు వివరాలు నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు కేసు వివరాలు ఒక ప్రకటన ద్వారా తెలిపారు1
- డిసెంబర్ 22 తేదీన నరసన్నపేట ఎస్సై నరసన్నపేట మడపం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 2 కేజీల అక్రమ గంజాయితో ఓ నిందితుడు పట్టుబడగా,మధ్యాహ్నం 12 :15 గంటల సమయంలో అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న 2.180 కేజీ ల బరువు గల గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడమైనది అని కేసు వివరాలు నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు కేసు వివరాలు ఒక ప్రకటన ద్వారా తెలిపారు1