logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాద్ చెరువుల ఆక్రమణలపై హైడ్రా కఠిన నిఘా 900 సీసీ కెమెరాలతో చెరువుల పర్యవేక్షణ HYD: హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలను అరికట్టేందుకు హైడ్రా కీలక చర్యలు చేపట్టింది. నగరంలోని చెరువుల వద్ద 900 సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రత్యేక కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పర్యవేక్షణ ప్రారంభించింది. అక్రమ నిర్మాణాలు, చెత్త పారవేత, ఆక్రమణ ప్రయత్నాలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు

1 hr ago
user_Ram Thotapally
Ram Thotapally
Local News Reporter సరూర్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
1 hr ago
6efd19c6-0390-49d4-9fcb-17e624b610de
57e459e2-a7a5-4a53-a97f-b370ed9243da

హైదరాబాద్ చెరువుల ఆక్రమణలపై హైడ్రా కఠిన నిఘా 900 సీసీ కెమెరాలతో చెరువుల పర్యవేక్షణ HYD: హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలను అరికట్టేందుకు హైడ్రా కీలక చర్యలు చేపట్టింది. నగరంలోని చెరువుల వద్ద 900 సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రత్యేక కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పర్యవేక్షణ ప్రారంభించింది. అక్రమ నిర్మాణాలు, చెత్త పారవేత, ఆక్రమణ ప్రయత్నాలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    1
    తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    20 hrs ago
  • ప్రొటోకాల్ పాటించకుంటే ఆందోళనలు: టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్కే హైమద్. ​మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్‌ను బేఖాతరు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనలో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత అధికారులదేనని, తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
    1
    ప్రొటోకాల్ పాటించకుంటే ఆందోళనలు: 
టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్కే హైమద్.
​మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్‌ను బేఖాతరు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనలో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత అధికారులదేనని, తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter Ramayampet, Medak•
    1 hr ago
  • ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన జనగణన కీలకం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం కలెక్టర్ జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి . రాందాస్ చౌరస్తా వరకు మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జెండాతో ప్రారంభించిన కలెక్టర్ జనగణన ట్యాబ్లు ఆవిష్కరించిన కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మారథాన్ వాక్ కార్యక్రమాన్ని పాల్గొని ఇంటింటి సందర్శనతో అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, 2021లో జనగణన జరగాల్సింది ఉంది కానీ కోవిడ్ కారణంగా జరగలేదని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చేస్తున్న జనగణన ఇది 16వసారి, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వీయగణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు క్రీడాభిమానులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
    1
    ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన జనగణన కీలకం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 
సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన  కీలకం 
కలెక్టర్
జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలి
పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి . రాందాస్ చౌరస్తా వరకు మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జెండాతో ప్రారంభించిన కలెక్టర్
జనగణన ట్యాబ్లు ఆవిష్కరించిన కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్   వరకు  మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో
కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మారథాన్ వాక్ కార్యక్రమాన్ని పాల్గొని ఇంటింటి సందర్శనతో అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, 2021లో జనగణన జరగాల్సింది ఉంది కానీ కోవిడ్ కారణంగా జరగలేదని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చేస్తున్న జనగణన ఇది 16వసారి, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.   స్వీయగణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.  జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు. 
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు  వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు క్రీడాభిమానులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
  • బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    1
    బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని
నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    3 hrs ago
  • నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేక‌ర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేక‌ర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    22 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
    1
    తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణలోని మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసన చేపట్టారు. బ్రీత్ ఎనలైజర్ యంత్రం మద్యం తాగకున్నా 56 పైగా రీడింగ్ చూపిస్తుండటంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ సేవలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
    1
    తెలంగాణలోని మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసన చేపట్టారు. బ్రీత్ ఎనలైజర్ యంత్రం మద్యం తాగకున్నా 56 పైగా రీడింగ్ చూపిస్తుండటంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ సేవలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    8 hrs ago
  • హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి - కలెక్టర్ ప్రతిమా సింగ్. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందేలా చూడాలన్నారు. మే 13 నుండి జరిగే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఉపాధి హామీలో 100 రోజుల పని కల్పించాలని ఆదేశించారు. నేటి నుంచి ప్రారంభమైన జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
    1
    హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి - కలెక్టర్ ప్రతిమా సింగ్.
కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందేలా చూడాలన్నారు. మే 13 నుండి జరిగే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఉపాధి హామీలో 100 రోజుల పని కల్పించాలని ఆదేశించారు. నేటి నుంచి ప్రారంభమైన జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter Ramayampet, Medak•
    1 hr ago
  • వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి జిల్లాలో జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి,అదనపు కలెక్టర్ నగేశ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు అడివయ్య మాట్లాడుతూ మెదక్ జిల్లా లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయనీ, రైతులు ఏదో ఒకచోట రోజు ఆందోళన చేస్తున్నారన్నారు.వాతావరణం లో మార్పులు రావడం వలస వర్షం వచ్చే పరిస్థితిని చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. అక్కడికక్కడ చిరు జల్లుళ్లతో దాన్యం తడిపించిపోతుందనీ, అకస్మాత్తుగా వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో నిబంధనలు పాటించడం లేదన్నారు.తూఖం 41.6 కేజీలు పెట్టాల్సి ఉండగా 42 నుంచి 44 కేజీలు తూకం వేయడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.తేమశాతం 17 వరకు కొనుగోలు చేయాల్సి ఉండగా 13 నుండి 14 వరకు ఉంటేనే కొనుగోలు చేస్తున్నారనీ మండి పడ్డారు.రైస్ మిల్లులు సకాలంలో అన్లోడింగ్ చేయక పోవడం తో దాన్యం మిల్లుకు చేరిన తర్వాత తేమ తూకం విషయాలలో మిల్లర్లు దరఖాస్తులు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు టెంటు మంచినీటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. పరిస్థితుల రిత్య జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలు సకాలంలో అందించాలని మిల్లుల వద్ద వెంట వెంటనే అన్లోడింగ్ చేయాలని తూకంలో తేడాలు లేకుండా తేమశాతం తేడాలను పిల్లర్లు వేధించకుండా ఆపాలని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు నీడ కోసం దీంట్లో మంచినీరు సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.మల్లేశం మాట్లాడుతూ భవిష్యత్తులో వడ్లు ఆరబోయేసే తమకు శాశ్వత స్థలాల కేటాయింపు చేయాలని రాబోవు సీజన్స్ కు ముందుగానే వారి ధాన్యం వెంటనే అంచనా వేసి గోనె సంచులు లారీలు సరిపడా ముందస్తుగా ప్రణాళిక వేయాలి అని అన్నారు కొనుగోలు కేంద్రానికి దగ్గర్లోని రైస్ మిల్ లుకు దాన్యం పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ మెదక్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పద్మ గారు,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే మల్లేశం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గౌరయ్య , అజయ్,పార్టీ సభ్యులు దుర్గ యాదగిరి వెంకట్ నరేందర్ నహీం ప్రవీణ్ ప్రశాంత్, లచ్చ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
    1
    వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి జిల్లాలో జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి 
సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్   
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి,అదనపు కలెక్టర్ నగేశ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు అడివయ్య మాట్లాడుతూ 
మెదక్ జిల్లా లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయనీ, రైతులు ఏదో ఒకచోట రోజు ఆందోళన చేస్తున్నారన్నారు.వాతావరణం లో మార్పులు రావడం వలస వర్షం వచ్చే పరిస్థితిని చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. అక్కడికక్కడ చిరు జల్లుళ్లతో దాన్యం తడిపించిపోతుందనీ, అకస్మాత్తుగా వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారనీ ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాలలో నిబంధనలు పాటించడం లేదన్నారు.తూఖం 41.6 కేజీలు పెట్టాల్సి ఉండగా 42 నుంచి 44 కేజీలు తూకం వేయడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.తేమశాతం 17 వరకు కొనుగోలు చేయాల్సి ఉండగా 13 నుండి 14 వరకు ఉంటేనే కొనుగోలు చేస్తున్నారనీ మండి పడ్డారు.రైస్ మిల్లులు సకాలంలో అన్లోడింగ్ చేయక పోవడం తో  దాన్యం మిల్లుకు చేరిన తర్వాత తేమ తూకం విషయాలలో మిల్లర్లు దరఖాస్తులు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు టెంటు మంచినీటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
పరిస్థితుల రిత్య జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలు సకాలంలో అందించాలని మిల్లుల వద్ద వెంట వెంటనే అన్లోడింగ్ చేయాలని తూకంలో తేడాలు లేకుండా తేమశాతం తేడాలను పిల్లర్లు వేధించకుండా ఆపాలని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు నీడ కోసం దీంట్లో మంచినీరు సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.మల్లేశం మాట్లాడుతూ భవిష్యత్తులో వడ్లు ఆరబోయేసే తమకు శాశ్వత స్థలాల కేటాయింపు చేయాలని రాబోవు సీజన్స్ కు ముందుగానే వారి ధాన్యం వెంటనే అంచనా వేసి గోనె సంచులు లారీలు సరిపడా ముందస్తుగా ప్రణాళిక వేయాలి అని అన్నారు కొనుగోలు కేంద్రానికి దగ్గర్లోని రైస్ మిల్ లుకు దాన్యం పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ మెదక్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పద్మ గారు,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే మల్లేశం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గౌరయ్య , అజయ్,పార్టీ సభ్యులు దుర్గ యాదగిరి వెంకట్ నరేందర్ నహీం ప్రవీణ్ ప్రశాంత్, లచ్చ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.