వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి రాష్ డ్రైవింగ్ ప్రమాదకరం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి మైనర్లు వాహనాలు నడపవద్దు - గజ్వేల్ సిఐ రవికుమార్ గజ్వేల్ నియోజకవర్గం, మార్చి 09 (ప్రజా ప్రతిభ): సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులు చదువుకునే పాఠశాలలు , విద్యాలయాల వద్ద, పలువురు యువకులు ద్విచక్ర వాహనాలపై రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాద భరితంగా వివిధ భంగిమల్లో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పలువురు యువకులను ఉద్దేశించి వారి వీడియోలను సోమవారం వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో గజ్వేల్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్తలు పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన గజ్వేల్ సిఐ రవికుమార్ పోలీస్ బృందంతో వెళ్ళి రాష్ డ్రైవింగ్ చేస్తూ వీడియోలు తీసిన యువకులను వెంటనే అదుపులోకి తీసుకొని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు, ఈ సందర్భంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపితే, చట్టపరమైన చర్యలు చేపడతామని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని రోడ్డు నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు, కాగా ద్విచక్ర వాహనాన్ని రాష్ గా నడిపిస్తూ ప్రమాద భరితంగా ఇతరులకు ఇబ్బంది పెట్టే విధంగా వీడియోలు తీసిన యువకులను వెంటనే పట్టుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టిన సీఐ రవికుమార్ కు పలువురు అభినందనలు తెలిపారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి రాష్ డ్రైవింగ్ ప్రమాదకరం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి మైనర్లు వాహనాలు నడపవద్దు - గజ్వేల్ సిఐ రవికుమార్ గజ్వేల్ నియోజకవర్గం, మార్చి 09 (ప్రజా ప్రతిభ): సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులు చదువుకునే పాఠశాలలు , విద్యాలయాల వద్ద, పలువురు యువకులు ద్విచక్ర వాహనాలపై రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాద భరితంగా వివిధ భంగిమల్లో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పలువురు యువకులను ఉద్దేశించి వారి వీడియోలను సోమవారం వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో గజ్వేల్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్తలు పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన గజ్వేల్ సిఐ రవికుమార్ పోలీస్ బృందంతో వెళ్ళి రాష్ డ్రైవింగ్ చేస్తూ వీడియోలు తీసిన యువకులను వెంటనే అదుపులోకి తీసుకొని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు, ఈ సందర్భంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపితే, చట్టపరమైన చర్యలు చేపడతామని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని రోడ్డు నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు, కాగా ద్విచక్ర వాహనాన్ని రాష్ గా నడిపిస్తూ ప్రమాద భరితంగా ఇతరులకు ఇబ్బంది పెట్టే విధంగా వీడియోలు తీసిన యువకులను వెంటనే పట్టుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టిన సీఐ రవికుమార్ కు పలువురు అభినందనలు తెలిపారు.
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.1
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.1
- మంచిర్యాల జిల్లా// దండేపల్లి మండలం మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన... మ్యాదరి పేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి. మృతులు మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్టాండుకు తలగడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- సిద్దిపేట జిల్లా : యువకుల ర్యాష్ డ్రైవింగ్ పై గజ్వెల్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. * గజ్వెల్ మున్సిపల్ సంగాపూర్ రోడ్డు లో ర్యాష్ డ్రైవింగ్ వీడియోను తీసుకున్న యువకులు * ర్యాష్ డ్రైవింగ్ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యువకులు * వీడియో వైరల్ గా మారడంతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులను గజ్వెల్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ * మళ్లీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు చేస్తానని హెచ్చరిక * విద్యార్థులు రాకపోకల సమయంలో పిచ్చి చేష్టలు చేస్తే చర్యలు తప్పవని యువకులను హెచ్చరించిన సీఐ రవి కుమార్1