Shuru
Apke Nagar Ki App…
శ్యామ్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మెంగ్రే మోహన్ ప్రజాసేవకు ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వమే ఆకర్షణ మెంగ్రే మోహన్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో దస్నాపూర్కు చెందిన మెంగ్రే మోహన్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా ఆదివాసీ, గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే వారిని ఎల్లప్పుడూ స్వాగతిస్తామని అన్నారు. మెంగ్రే మోహన్ మాట్లాడుతూ, బీఆర్ఎస్లో తగిన గుర్తింపు లేకపోవడంతో కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలిపారు. పదవులకన్నా ప్రజాసేవకు ప్రాధాన్యం ఇచ్చే శ్యామ్ నాయక్ నాయకత్వం తనను ఆకర్షించిందని, అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Krishna
శ్యామ్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మెంగ్రే మోహన్ ప్రజాసేవకు ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వమే ఆకర్షణ మెంగ్రే మోహన్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో దస్నాపూర్కు చెందిన మెంగ్రే మోహన్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా ఆదివాసీ, గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే వారిని ఎల్లప్పుడూ స్వాగతిస్తామని అన్నారు. మెంగ్రే మోహన్ మాట్లాడుతూ, బీఆర్ఎస్లో తగిన గుర్తింపు లేకపోవడంతో కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలిపారు. పదవులకన్నా ప్రజాసేవకు ప్రాధాన్యం ఇచ్చే శ్యామ్ నాయక్ నాయకత్వం తనను ఆకర్షించిందని, అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆకాశమే విరివినట్లుగా అద్భుత దృశ్యం జన్నారం మండల కేంద్రంలో ఆకాశం విరిగినట్లుగా మబ్బులతో అద్భుత అదృశ్యం ఆవిష్కృతమైంది. జన్నారంలో నిర్వహించిన శ్రీ కేతేశ్వర కాంకాలమ్మ జాతర సందర్భంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. అదే సమయంలో ఆకాశంలో మబ్బులు విరిగినట్లుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. జాతర వేల మబ్బులు కమ్ముకోవడంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. ఆకాశంలో మబ్బులు ఏర్పడటం సాధారణమే అయిన విరిగినట్లుగా ఉండటం మొదటిసారి చూస్తున్నామన్నారు.1
- Post by Ravi Poreddy1
- సీఐ చేతుల మీదుగా1
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 11 ఐ 3 న్యూస్ /* సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి: దేవి రవీందర్ సిద్దిపేట జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు. లేనియెడల, గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో, అదే విధంగా ఈరోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే వరకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి నీతి, నిజాయితీతో పనిచేస్తూ... ప్రజాదారణ పొందిన సంస్థ hmtv అని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే డిసిసి ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం అన్నారు గంగాధర మండలం ఇస్లాంపూర్ లో హెచ్ఎంటీవీ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం హెచ్ఎంటీవీ వీక్షకులకు, రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు1