గద్వాల పట్టణ పుట్ పాత్ అక్రమణలకు మంగళం పడేనా . ?? గద్వాల మున్సిపాలిటి పరిధిలోని రోడ్డుకు ఇరువైపులా పుట్ పాత్ అక్రమించి, డబ్బాలు వేసి వ్యాపారాలు కొనసాగించడంతో పాదచారులకు నరకంగా మారిన పుట్పాత్ అక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా, మంగళవారం భారీ స్థాయిలో అక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేందుకు గద్వాల మున్సిపల్ మరియు ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం సర్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ అధికారులు అక్రమణకు గురైన పుట్ పాత్ లను , రోడ్లను గుర్తించి మార్కింగ్ వేయడం జరిగింది. ఈ మేరకు ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణదారులకు, తోపుడు బండ్ల వ్యాపారులకు మున్సిపల్ అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్రాఫిక్ ఆర్ఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ బాల చంద్రుడు కృష్ణవేణి చౌరస్తా నుంచి భీంనగర్ లో గల షాపుల యజమానులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. పుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్లు, సామాగ్రిని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. గద్వాల పట్టణంలో కృష్ణవేణి చౌరస్తా నుంచి ఆంబేద్కర్ చౌరస్తా, కృష్ణవేణి చౌరస్తా నుంచి భీంనగర్ వరకు అధికారులు ఎక్కడి వరకు మార్కింగ్ చేశారో అక్కడి వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగించేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది.
గద్వాల పట్టణ పుట్ పాత్ అక్రమణలకు మంగళం పడేనా . ?? గద్వాల మున్సిపాలిటి పరిధిలోని రోడ్డుకు ఇరువైపులా పుట్ పాత్ అక్రమించి, డబ్బాలు వేసి వ్యాపారాలు కొనసాగించడంతో పాదచారులకు నరకంగా మారిన పుట్పాత్ అక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా, మంగళవారం భారీ స్థాయిలో అక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేందుకు గద్వాల మున్సిపల్ మరియు ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం సర్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ అధికారులు అక్రమణకు గురైన పుట్ పాత్ లను , రోడ్లను గుర్తించి మార్కింగ్ వేయడం జరిగింది. ఈ మేరకు ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణదారులకు, తోపుడు బండ్ల వ్యాపారులకు మున్సిపల్ అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్రాఫిక్ ఆర్ఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ బాల చంద్రుడు కృష్ణవేణి చౌరస్తా నుంచి భీంనగర్ లో గల షాపుల యజమానులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. పుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్లు, సామాగ్రిని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. గద్వాల పట్టణంలో కృష్ణవేణి చౌరస్తా నుంచి ఆంబేద్కర్ చౌరస్తా, కృష్ణవేణి చౌరస్తా నుంచి భీంనగర్ వరకు అధికారులు ఎక్కడి వరకు మార్కింగ్ చేశారో అక్కడి వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగించేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది.
- తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై స్పష్టమైన వీడియో విడుదలైంది. వరి పంట బోనస్ గురించిన పూర్తి సమాచారం కోసం రైతులు 'అగ్రికల్చర్ రఘురామ్' యూట్యూబ్ ఛానెల్ను చూడవచ్చు.1
- ఎమ్మెల్యే బీవీ జై నాగేశ్వర్ రెడ్డికి హాలహర్విలో ఘన స్వాగతం హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా1
- తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.1
- జడ్చర్ల పట్టణ కేంద్రంలో భారీ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్టాపన జడ్చర్ల పట్టణ కేంద్రంలో శ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో భారీ ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో పరిసర ప్రాంతం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. అనంతరం అహోబిల రామానుజ జీయర్ స్వామి ప్రవచనాలలో ఆంజనేయ స్వామి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా వీక్షించారు.1
- ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు, భార్య ఉన్న ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- ఎస్సీ హోదా కోసం ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవుల భారీ ర్యాలీ ఎస్సీ హోదా కొనసాగించాలని ప్రభుత్వానికి డిమాండ్1