తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి..... సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం రాజాపేట, సెప్టెంబర్ 16 తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారోత్సవాలు సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు వెలకట్టలేనివని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం అన్నారు. బుధవారము మండలంలోని రేణికుంటలో చింతలపూరి రామిరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుర్రారంలో పాశం రామిరెడ్డి స్థూపానికి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో పాల్గొని భూస్వామ్య, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ 78వ తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, మండల కేంద్రాల్లో యోధుల చిత్రపటాలకు నివాళులర్పించడం, వారి పోరాట చరిత్రను ప్రజలకు వివరించడం, సభలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రజలకు భూమి, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాట యోధుల పాత్రను వక్తలు గుర్తుచేయనున్నామన్నారు.యోధుల త్యాగాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని నిర్వాహకులు పేర్కొన్నారు. వారోత్సవాల్లో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ పోరాట చరిత్రను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. 17వ తేదీన హైదరాబాదులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు కార్యక్రమంలో మూల పోచయ్య ం రామిరెడ్డి పాశం రామిరెడ్డి మనవడు పాశం రామ్ ప్రతీప్ రెడ్డి నంద ఐలయ్య ధన్య శ్రీశైలం గన్నె నరసింహులు రాగుల బీరయ్య తరిగొప్పుల సిద్దులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి..... సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం రాజాపేట, సెప్టెంబర్ 16 తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారోత్సవాలు సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు వెలకట్టలేనివని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం అన్నారు. బుధవారము మండలంలోని రేణికుంటలో చింతలపూరి రామిరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుర్రారంలో పాశం రామిరెడ్డి స్థూపానికి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో పాల్గొని భూస్వామ్య, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ 78వ తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, మండల కేంద్రాల్లో యోధుల చిత్రపటాలకు నివాళులర్పించడం, వారి పోరాట చరిత్రను ప్రజలకు వివరించడం, సభలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రజలకు భూమి, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాట యోధుల పాత్రను వక్తలు గుర్తుచేయనున్నామన్నారు.యోధుల త్యాగాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని నిర్వాహకులు పేర్కొన్నారు. వారోత్సవాల్లో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ పోరాట చరిత్రను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. 17వ తేదీన హైదరాబాదులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు కార్యక్రమంలో మూల పోచయ్య ం రామిరెడ్డి పాశం రామిరెడ్డి మనవడు పాశం రామ్ ప్రతీప్ రెడ్డి నంద ఐలయ్య ధన్య శ్రీశైలం గన్నె నరసింహులు రాగుల బీరయ్య తరిగొప్పుల సిద్దులు తదితరులు పాల్గొన్నారు.
- రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?2
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గిన నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.80,100, VIP దర్శనాలతో రూ.1,12,350, కార్ పార్కింగ్ రూ.1,75,000, ప్రసాద విక్రయాలతో రూ.4,21,770, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- సువర్ణ శివలింగ దర్శనంతో రమణేశ్వరంలో భక్తిశోభ రమణేశ్వరం సువర్ణ శివలింగం వద్ద పెరిగిన భక్తుల రద్దీ1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో లలిత స్తోత్రం కార్యక్రమం శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద బుధవారం లలిత స్తోత్ర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, లలిత స్తోత్ర పారాయణం నిర్వహించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పలువురు పాల్గొన్నారు.1
- గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....3
- వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.1
- తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్1