బొల్లారం: బొల్లారం జనప్రియ బంగ్లాస్ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డు-8 పరిధిలోని బొల్లారంలోని జనప్రియ బంగ్లాస్ యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు శనివారం పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ను కలిసి కాలనీలో నెలకొన్న పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఓపెన్ డ్రెయిన్ కారణంగా దుర్గంధం, దోమల సమస్య తీవ్రంగా ఉందని, వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉన్నందున రైల్వే, కంటోన్మెంట్ అధికారులతో సమన్వయం చేసి పైప్లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే భూగర్భ జలాలు తగ్గిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొత్త బోర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలనీలో చిన్నారుల కోసం చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్, యువత, వయోవృద్ధుల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కూడా అభ్యర్థించారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాలరాజు, కాలనీ వైస్ ప్రెసిడెంట్ కర్నల్ (డాక్టర్) పి.కె. మలాకర్, ట్రెజరర్ వై. రమణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళీకృష్ణ, కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బొల్లారం: బొల్లారం జనప్రియ బంగ్లాస్ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డు-8 పరిధిలోని బొల్లారంలోని జనప్రియ బంగ్లాస్ యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు శనివారం పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ను కలిసి కాలనీలో నెలకొన్న పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఓపెన్ డ్రెయిన్ కారణంగా దుర్గంధం, దోమల సమస్య తీవ్రంగా ఉందని, వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉన్నందున రైల్వే, కంటోన్మెంట్ అధికారులతో సమన్వయం చేసి పైప్లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే భూగర్భ జలాలు తగ్గిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొత్త బోర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలనీలో చిన్నారుల కోసం చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్, యువత, వయోవృద్ధుల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కూడా అభ్యర్థించారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాలరాజు, కాలనీ వైస్ ప్రెసిడెంట్ కర్నల్ (డాక్టర్) పి.కె. మలాకర్, ట్రెజరర్ వై. రమణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళీకృష్ణ, కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక తనిఖీ.. పారిశుధ్యంపై అధికారుల ఆదేశాలు చిన్నశంకరంపేట మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య పరిస్థితులను ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటయ్య శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రత ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. లోపాలపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. ఈ తనిఖీలో ఎంపీడీవో దామోదర్ పాల్గొన్నారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు వంట గ్యాస్ పొయ్యిలు అందజేసిన దాతలు పెద్దశంకరంపేట మండలంలోని జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు సామాజిక సేవాభావాన్ని చాటుతూ గడ్డం వెంకన్న, మల్లన్న వంట గ్యాస్ పొయ్యిలను విరాళంగా అందజేశారు. వర్షాకాలంలో మధ్యాహ్న భోజనాల తయారీలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం చేసినట్లు వారు తెలిపారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శిరీష సమక్షంలో గ్యాస్ పొయ్యిలను పాఠశాలకు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల సిబ్బంది కూడా వారి సేవాభావాన్ని అభినందించారు.1
- ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం -కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.1
- కూలిపోయిందని దుష్ప్రచారం చేసిన కాలేశ్వరం ప్రాజెక్టు తోనే రైతులకు సాగునీరు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రైతులకు సాగునీరు కాళేశ్వరం రివర్స్ పంపింగ్ను వృథా అంటూ దుష్ప్రచారం చేసి.. నేడు అదే రివర్స్ పంపింగ్ పద్ధతిలో SRSP వరద కాలువలోని రాంపూర్ పంప్హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పంప్హౌస్ల ద్వారా గోదావరి జలాలను SRSP వరద కాలువకు ఎదురెక్కిస్తుండడంతో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందుతున్న సాగునీరు1